వాళ్ల సినిమాలు చూడొద్దు.. మానేయండి: అశ్వనీదత్

నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో నెలకొన్న ఆందోళనలపై తాజాగా టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ స్పందించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్‌పై కూడా విమర్శలు గుప్పించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్.. చేసిన దాంట్లో 10 శాతం చేసినా గొప్ప సీఎం అవుతారని ఆయన హితవు పలికారు. మెగాస్టార్ చిరంజీవి, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో పాటు పలువురు టాలీవుడ్‌కు చెందిన నటీనటుల గురించి పరోక్షంగా ప్రస్తావిస్తూ తీవ్ర వ్యాఖ్యలు గుప్పించారు.

వాళ్ల సినిమాలు చూడొద్దు!

‘పృథ్వీ హాస్యనటుడు.. ఆయన మాటలకు విలువ ఇవ్వాల్సిన అర్ధం లేదు. పృథ్వీ లాంటి వారి వల్లే జగన్‌ భ్రష్టు పట్టిపోతున్నారు. మద్దతు కోసం సినీ హీరోలను రైతులు అడుక్కోవాల్సిన అవసరం లేదు. ఈ ప్రాంతంలో పుట్టిన వాళ్లు సూపర్‌ స్టార్లుగా ఉన్నారు (పరోక్షంగా మహేశ్ బాబును). నటుడిగా కాకున్నా.. సగటు మనిషిగా స్పందించాల్సిన అవసరం లేదా?. వాళ్ల సినిమాలు చూడడం మానేయండి.. వారే దిగివస్తారు. మంత్రి బొత్స సత్యనారాయణ ఏం మాట్లాడుతున్నారో ఆయన కుటుంబ సభ్యులకే అర్ధం కావడం లేదు. గన్నవరం ఎయిర్‌పోర్టు విస్తరణకు భూములిస్తే.. ప్రతిగా రాజధానిలో భూములిచ్చారు. ఎయిర్‌పోర్టు విస్తరించారు..ఆ భూములను ఎలా తిరిగిస్తారు?. 151 సీట్లు ఇచ్చిన ప్రజల ఆకాంక్షలను గౌరవించాలి’ అని అశ్వనీదత్ విమర్శలు గుప్పించారు.

కాగా.. మహేశ్ హీరోగా నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ రిలీజ్ అవ్వగా.. అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘అల వైకుంఠపురంలో’ రేపు విడుదల కానుంది. అయితే అశ్వనీదత్ మాత్రం పరోక్షంగా వాళ్ల సినిమాలు చూడొద్దని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై చిరు, మహేశ్, పవన్ కల్యాణ్ ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.

More News

చిరుకేం తెలుసు..? పవన్ నటిస్తే కోట్లే..  అశ్వనీదత్ సంచలన వ్యాఖ్యలు

నవ్యాంధ్ర రాజధాని అమరావతిని తరలించి.. మూడు రాజధానులుంటాయేమోనని అసెంబ్లీ వేదికగా సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రకటన చేసిన నాటి నుంచి రైతులు, రైతు కూలీలు,

పార్టీ ముఖ్య సమావేశంలో పవన్.. ఎడ్ల పందాల్లో రాపాక

అవును.. జనసేన పార్టీకి సంబంధించిన విస్తృతస్థాయి సమావేశంలో ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ బిజిబిజీగా ఉంటే..

ఫిబ్రవరి 21 న 'రాహు' రిలీజ్

కృతి గార్గ్, అభిరామ్ వర్మ, కాలకేయ ప్రభాకర్, చలాకీ చంటి, గిరిధర్, సత్యం రాజేష్, స్వప్నిక కీలక పాత్రలు పోషిస్తున్నారు.

మనసులను కదిలిస్తున్న పూజా హెగ్డే మాటలు

ఆస్ట్రేలియా అడవుల్లోని కార్చిచ్చు.. తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. యావత్ ప్రపంచాన్ని కదిలిస్తోంది.

ప్రభాస్‌తో త్రివిక్రమ్.. చర్చలు షురూ!

టాప్ రైటర్, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కాంబినేషన్‌లో సినిమా రాబోతుందా అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు.