‘ఆటా’ 17వ మహాసభలు.. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఆహ్వానం

అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో జూలై 1 నుంచి 3 వరకు జరిగే 17వ అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ (ఆటా) మహాసభలకు హాజరు కావాల్సిందిగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఆహ్వానం అందింది. ఈ మేరకు టీఆర్‌ఎస్‌ ఎన్నారై కో-ఆర్డినేటర్ మహేష్ బిగాల ఆధ్వర్యంలో ఆటా ప్రతినిధులు మంగళవారం కవితను కలిసి ఆహ్వాన పత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా ఆటా ప్రతినిధులు మాట్లాడుతూ.. అమెరికా నలుమూలల నుంచి దాదాపు 15,000 మంది మహాసభలో పాల్గొంటున్నారని తెలిపారు. అలాగే ఈ సారి తెలంగాణ రాష్ట్ర పెవిలియన్‌ని ఏర్పాటు చేయనున్నట్లు.. అందులో మన ఊరు -మన బడి, బతుకమ్మ, తెలంగాణ టూరిజం, వివిధ రకాల ఏర్పాట్లు చేస్తున్నామని వారు ఎమ్మెల్సీ కవితకు వివరించారు. భవిష్యత్‌ తరాలకు మన బతుకమ్మ విశిష్టత గురించి తెలిపేందుకు బతుకమ్మపై ఇంగ్లీష్‌లో పుస్తకాన్ని ముద్రిస్తున్నట్టు పేర్కొన్నారు. కల్వకుంట్ల కవితను కలిసిన వారిలో ఆటా అధ్యక్షుడు భువనేశ్ భుజాల, శరత్ వేముల, జయంత్ చల్ల, వేణు సంకినేని తదితరులు ఉన్నారు.

ఈ సభలకు హాజరుకావాల్సిందిగా ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తదితరులను ఆటా ప్రతినిధులు ఇప్పటికే ఆహ్వానించిన సంగతి తెలిసిందే.

ఇకపోతే... ఆటా మహాసభలకు సంబంధించి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు నిర్వాహకులు. కరోనా మహమ్మారి కారణంగా గడిచిన రెండేళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించలేకపోయారు. ప్రస్తుతం అమెరికా సహా ప్రపంచవ్యాప్తంగా వైరస్ అదుపులోకి రావడంతో ఈసారి తెలుగు మహాసభలను భారీఎత్తున నిర్వహించాలని ఆటా నిర్వాహక కమిటీ నిర్ణయించింది. సభల నిర్వహణకు సంబంధించి 65 కమిటీలను ఏర్పాటు చేశామని ఆటా ప్రెసిడెంట్‌ భువనేష్‌ బూజల మీడియాకు తెలిపారు. ఇందులో దాదాపు 350 మందిని సభ్యులుగా ఎన్నుకున్నట్లు తెలిపారు. వీరంతా మహాసభలను విజయవంతం చేసేందుకు కృషి చేస్తారని భువనేష్ వెల్లడించారు.

ప్రముఖ ఆధ్యాత్మిక గురువు పద్మవిభూషణ్ జగ్గీ వాసుదేవ్ (సద్గురు) , ప్రముఖ కవులు, కళాకారులు, రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు విజయ్ దేవరకొండ , రకుల్ ప్రీత్ సింగ్ , గాయకుడు రాం మిరియాల ఆటా సభలకు హాజరుకానున్నారు. అలాగే దిగ్గజ సంగీత దర్శకుడు ఇళయరాజా ఆధ్వర్యంలో సంగీత విభావరికి ఏర్పాట్లు చేస్తున్నారు.

More News

లైవ్‌లోనే విశ్వక్‌సేన్‌ను చెప్పుతో కొట్టాల్సింది .. సినిమాల్లోకి రానీయొద్దు : దానం నాగేందర్ వ్యాఖ్యలు

హీరో విశ్వక్‌సేన్ నటించిన ‘‘అశోకవనంలో అర్జున కళ్యాణం’’ చిత్రం మే 6న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇంజినీరింగ్ కాలేజీలో 'అల్లంత దూరాన' పాట విడుదల

"అల్లంత దూరాన" చిత్రంలో హుషారుగా సాగే  ఓ యూత్ ఫుల్ పాటను హైదరాబాద్ లోని ఎం.వి.ఎస్.ఆర్. ఇంజినీరింగ్ కాలేజీ లో

ముదురుతోన్న 'ప్రాంక్' వివాదం: మంత్రి తలసాని వద్దకు పంచాయతీ, విశ్వక్‌సేన్‌పై టీవీ9 యాంకర్ ఫిర్యాదు

సినిమా ప్రమోషన్ కోసం యువ హీరో విశ్వక్ సేన్ అండ్ టీం చేయించిన ఫ్రాంక్ వీడియో చివరికి అతని మెడకు చుట్టుకుంది. నడిరోడ్డుపై పబ్లిక్‌ను డిస్ట్రబ్ చేసేలా న్యూసెన్స్ క్రియేట్ చేశారంటూ విశ్వక్ సేన్‌పై

బండ్ల గణేష్ 'డేగల బాబ్జీ' మే 20 న విడుదల

తెలుగు స్క్రీన్ మీద తొలిసారి సింగిల్ యాక్టర్ తో చేసిన సినిమా డేగల బాబ్జీ. ఒకే ప్లేస్లో ఒకే లొకేషన్లో, ఒక్క వ్యక్తి మాత్రమే సినిమా అంతా కనిపిస్తాడు. ఇంకా ఈ సినిమాలో మిగతా క్యారెక్టర్లు ఉన్నా..

మహిళలపై అత్యాచారాలు.. వినతి పత్రం ఇద్దామని వస్తే.. అరెస్ట్ చేయిస్తారా : ఏపీ సర్కార్‌పై జనసేన ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్‌లో వరుస అత్యాచార ఘటనలపై జనసేన ఆగ్రహం వ్యక్తం చేసింది.