వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి కారుపై దాడి.. కుట్ర జరిగిందా!?

  • IndiaGlitz, [Tuesday,January 07 2020]

నవ్యాంధ్ర రాజధాని అమరావతిని తరలించొద్దని గత కొన్నిరోజులుగా రైతులు, రైతు కూలీలు, టీడీపీ నేతలు ధర్నాలు, రాస్తారోకోలు చేపడుతున్న సంగతి తెలిసిందే. అంతేకాదు విజయవాడ, గుంటూరు జిల్లాలోని వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు రాజీనామా చేసి తీరాల్సిందేనని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. వైసీపీ నేతలు ర్యాలీ జరుగుతున్న ప్రదేశంలో కనపడితే చాలు కొట్టుకునేంత.. కొట్టేంత పరిస్థితులు నెలకొన్నాయ్. ఇప్పటికే పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలకు రాజధాని నిరసన సెగలు తగిలాయ్ కూడా..!

అసలేం జరిగింది!
అయితే తాజాగా.. గుంటూరు జిలమాచర్ల ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కారుపై రైతులు దాడికి తెగబడ్డారు. జిల్లాలోని చినకాకాని హైవేపై ఆయన కారులో వెళ్తుండగా అడ్డుకున్న రైతులు, ఆందోళనకారులు.. కారును చుట్టుముట్టారు. ఈ క్రమంలో నినాదాలు చేస్తూ కారుపై రాళ్లు రువ్వారు. ఈ దాడిలో ఎమ్మెల్యే కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. మరోవైపు ఎమ్మెల్యే గన్‌మెన్‌లు, సెక్యూరిటీ సిబ్బందిపై కూడా కొందరు యువకులు దాడికి దిగారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయ్. ఎమ్మెల్యే పిన్నెల్లి రాజీనామా చేయాలని రైతులు ఈ సందర్భంగా నినాదాలు చేస్తున్నారు.

దాడికి పాల్పడిందెవరు!?
కాగా.. పిన్నెల్లి మీద దాడికి పాల్పడిందెవరు..? అనే విషయం పూర్తిగా తెలియరాలేదు. మరోవైపు స్థానికులపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రాజధాని ఆందోళనలను చెదరగొట్టేందుకు ఎత్తుగడ వేశారా? లేదా.. వ్యూహం ప్రకారమే పిన్నెల్లిపై రాజధాని వ్యతిరేక శక్తులు దాడి చేశాయా? అనే విషయంపై క్లారిటీ రాలేదు. పిన్నెల్లి వాహనాన్ని అడ్డుకుని నిరసన తెలపడం సరే.. దాడికి పాల్పడింది ఎవరు? కుట్ర కోణం ఉందా? అనేదానిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ వ్యవహారంలో రాజధాని ప్రాంతంలో.. స్థానికుల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. రాజధాని గ్రామాల్లో అసలేం జరుగుతోంది..? అనేది ఎవరికీ తెలియట్లేదు. కాగా ఘటనాస్థలిలో ఉన్న పోలీసులు దీనికి కారణాలు..? దాడి చేసిందెవరనేది చెప్పాలి మరి.

More News

శ‌ర్వానంద్‌, స‌మంత చిత్రం 'జాను' .. ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

శ‌ర్వానంద్‌, స‌మంత హీరో హీరోయిన్లుగా న‌టిస్తోన్న చిత్రానికి `జాను` అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు.

'అల వైకుంఠ‌పుర‌ములో' మ్యూజిక‌ల్ ఫెస్టివల్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా శ్రీమ‌తి మ‌మ‌త స‌మ‌ర్ప‌ణ‌లో హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్‌, గీతాఆర్ట్స్ ప‌తాకాల‌పై స్టార్ డైరెక్టర్ త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో

రజనీకాంత్ నాకు రోల్ మోడల్.. ‘దర్బార్‌’కు ఆల్ ది బెస్ట్ : బన్నీ

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే, టబు, సునీల్ నటీనటులుగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన చిత్రం ‘అల వైకుంఠపురములో..’.

విఘ్నేశ్‌తో విడిపోయారన్న వార్తలపై నయన్ క్లారిటీ

లేడీ సూపర్‌స్టార్ నయనతార గురించి నటన పరంగా ప్రత్యేకించి మరి చెప్పనక్కర్లేదు. ‘నాకు నేనే పోటీ.. నాకు నేనే సాటి’ అన్నట్టుగా నటించేస్తుంటుంది. అయితే రీల్ లైఫ్ వరకూ అంతా ఓకే గానీ..

మోదీని 'మంచు' కలవడం వెనుక కారణలివీ..!

టాలీవుడ్ సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు కుటుంబ సభ్యులు.. ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అవ్వడంతో రకరకాలుగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇదిగో వైసీపీకి టాటా చెప్పేసి..