close
Choose your channels

ఆసుపత్రిలో లతా మంగేష్కర్.. ఆటో డ్రైవర్ త్యాగం, ఏం చేశాడంటే..?

Sunday, January 23, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఆసుపత్రిలో లతా మంగేష్కర్.. ఆటో డ్రైవర్ త్యాగం, ఏం చేశాడంటే..?

దిగ్గజ సింగర్ లతా మంగేష్కర్(92) కరోనా బారినపడటంతో ఆమె ముంబయిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆమె ఆరోగ్యంపై మీడియాతో రకరకాల వదంతులు వస్తున్నాయి. కాగా.. లతా మంగేష్కర్ వీరాభిమాని ఒకరు ఆమె పట్ల అభిమానం చాటుకున్నారు. చిన్నప్పటి నుంచి లతాజీ అంటే ప్రాణమిచ్చే ఆయన.. ఇప్పుడు కోసం తన సంపాదనను ఆమె కోసం దానం చేస్తున్నాడు. ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్న సత్యవాన్ తన ఆటోలో కూడా పూర్తిగా లతా మంగేష్కర్‌ బొమ్మలతో నింపేశాడు.

కాగా తన ఇంటిలో పనిచేసే సిబ్బందిలో ఒకరి నుంచి లతాజీ వైరస్ బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు తాజాగా ప్రకటన చేశారు. ఆమె ఆరోగ్యం మెరుగుపడుతోందని అన్నారు. లతా మంగేష్కర్ అధికారిక ట్విట్టర్ ఖాతా నుంచి ఆమె ఆరోగ్య పరిస్థితిపై ట్వీట్ చేశారు. ‘లతా ఆరోగ్యంపై వదంతులను ఆపమని’ వైద్యులు అభ్యర్థించారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నారని తెలిపారు.

లతా మంగేష్కర్‌కు కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఆమెను ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేర్చారు. కొన్ని మీడియా నివేదికల ప్రకారం లతా న్యుమోనియాతో బాధపడుతున్నారు. నాటి నుంచి ఆమెకు ఐసీయూలోనే చికిత్స అందిస్తున్నారు. వృద్ధాప్యం కారణంగా లతాజీ కోలుకోవడానికి సమయం పడుతుందని వైద్యులు చెబుతున్నారు. మరోవైపు లతా మంగేష్కర్ ఆరోగ్యం గురించి వస్తున్న వదంతులపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ స్పందించారు. లతా కుటుంబ సభ్యుల సందేశాన్ని ఈ సందర్భంగా స్మృతి వివరించారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.