అయేషా పోస్టుమార్టంలో తాజాగా సీబీఐ ఏం తేల్చింది!?

విజయవాడలో దారుణ హత్యకు గురైన ఆయేషామీరా హత్య కేసు అప్పట్లో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో తమకు న్యాయం ఇంతవరకూ జరగట్లేదని బాధితురాలి తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించడం.. ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో సీబీఐ రంగంలోకి దిగింది. అయితే ఇవాళ అనగా శనివారం నాడు.. 12 ఏళ్ల తర్వాత అయేషా మృతదేహానికి రీ-పోస్టుమర్టం నిర్వహించారు. సుమారు ఆరు గంటలకు పైగా.. అధికారుల పర్యవేక్షణలో ఈ ప్రక్రియ పూర్తి జరిగింది. అయితే మృతదేహాన్ని వెలికితీసి నిశితంగా ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలించి.. ఆనవాళ్లు నమోదు చేసుకున్నట్లు తెలిసింది. కాగా.. ఎముకలు, కేశాలు, గోళ్లను క్షుణ్ణంగా పరిశీలించిన నిపుణులు.. పుర్రె, అస్థికలపై గాయాలున్నట్లు గుర్తించారు. ఆధారాలు సేకరించి పూర్తి నివేదిక తయారుచేయనున్నట్లు ఫోరెన్సిక్ బృందం ఈ సందర్భంగా మీడియాకు వెల్లడించింది. కాగా.. ఈ హత్యకేసును సీబీఐ సీరియస్‌గా విచారణ చేస్తోంది. శవపరీక్ష పూర్తి చేసిన ఫోరెన్సిక్ నిపుణులు ఆ రిపోర్ట్‌ను ఓ సీల్డ్ కవర్‌లో పెట్టి హైకోర్టుకు సమర్పించడం జరిగింది. అయేషా ఎముకల నుంచి అవశేషాలు సేకరించి.. అనంతరం సీబీఐ ఎస్పీ నేతృత్వంలో రీపోస్టుమార్టం నిర్వహించారు.

ఇదిలా ఉంటే.. 2007 డిసెంబర్‌లో విజయవాడ శివారులోని ఇబ్రహీంపట్నంలో ఓ ప్రైవేట్ హాస్టల్‌లో ఆయేషా మీరా దారుణహత్య జరిగింది. అయితే ఈ కేసులో అప్పట్లో బడా బాబుల పిల్లలు, మనువళ్లు ఉండటంతో ఇన్ని రోజులు నాన్చుతూనే జాప్యం చేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. నాటి నుంచి నేటి వరకూ ఈ కేసు ఎన్ని మలుపులో తిరిగిందో అర్థం కాని పరిస్థితి.

More News

గోపీచంద్‌ - సంపత్‌నంది కాంబినేషన్లో భారీ చిత్రం ప్రారంభం

మ్యాచోస్టార్‌ గోపీచంద్‌ హీరోగా మాస్‌ డైరెక్టర్‌ సంపత్‌ నంది దర్శకత్వంలో 'యు టర్న్‌'లాంటి సూపర్‌హిట్‌ చిత్రాన్ని అందించిన శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై ప్రొడక్షన్‌ నెం.3 గా శ్రీనివాసా

'కె.జి.య‌ఫ్' అభిమానులకు గుడ్ న్యూస్

రాకింగ్ స్టార్ య‌ష్ హీరోగా.. కైకాల స‌త్య‌నారాయ‌ణ స‌మ‌ర్ప‌ణ‌లో హోంబ‌లే ఫిలిమ్స్ బ్యాన‌ర్‌పై ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో విజ‌య్ కిర‌గందూర్ నిర్మిస్తోన్న‌ భారీ బ‌డ్జెట్ చిత్రం `కె.జి.య‌ఫ్‌` చాప్ట‌ర్ 2.

ఇన్‌టెన్స్ లుక్‌తో ఆక‌ట్టుకుంటున్న రానా

'బాహుబ‌లి', 'నేనే రాజు నేనే మంత్రి' వంటి వైవిధ్యమైన క‌థా చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన యాక్ట‌ర్ రానా ద‌గ్గుబాటి ఆరోగ్య కార‌ణాల‌తో కొన్ని రోజుల పాటు విశ్రాంతిని తీసుకున్నాడు.

నాగ‌చైత‌న్య తదుప‌రి ఖ‌రారైందోచ్‌!!

ఈ శుక్ర‌వారం `వెంకీమామ` విడుద‌లైంది. తొలి రోజున ప్ర‌పంచ వ్యాప్తంగా రూ.16 కోట్ల గ్రాస్ క‌లెక్ష‌న్స్ వ‌చ్చాయి. ఈ సినిమా విడుద‌లై ఒక రోజు అయ్యిందో లేదో.. చైత‌న్య త‌దుప‌రి సినిమాను ఖ‌రారు చేశారు.

‘రంగమార్తాండ’లో ప్రకాష్ రాజ్ కుమార్తెగా శివాత్మిక!

సీనియర్ డైరెక్టర్ కృష్ణవంశీ ‘రంగమార్తాండ’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. చాలా రోజుల తర్వాత ఓ మంచి హ్యూమన్ ఇంట్రెస్టింగ్ స్టోరీతో కృష్ణవంశీ తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.