'బాహుబలి-2' ఆడియో లాంచ్ డేట్...

  • IndiaGlitz, [Monday,March 06 2017]

తెలుగు సినిమా స్టామినాని దేశానికే కాదు, ప్ర‌పంచానికి తెలియ‌చెప్పిన సినిమా బాహుబ‌లి. విజువ‌ల్ వండ‌ర్‌గా రూపొందిన ఈ సినిమా పార్ట్‌1 సెన్సేష‌న‌ల్ హిట్ అయ్యి ఆరు వంద‌ల కోట్ల‌కు పైగా క‌లెక్ష‌న్స్‌ను సాధించింది. ఇప్పుడు అంద‌రూ బాహుబ‌లి పార్ట్ 2 కోసం ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. వ‌ర్చువ‌ల్ రియాలిటీలో ఏప్రిల్ 28న బాహుబ‌లి 2 విడుద‌ల కానుంది.

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌భాస్‌, రానా, అనుష్క‌, త‌మ‌న్నా, స‌త్యరాజ్‌, ర‌మ్య‌కృష్ణ‌, నాజర్ స‌హా ప‌లువురు తారాగ‌ణంగా న‌టించిన ఈ సినిమా విడుద‌ల ద‌గ్గ‌ర ప‌డుతుంటే, సినిమా ప్ర‌మోష‌న్స్‌కు రంగం సిద్ధం చేస్తుంది. ముందుగా ఈ సినిమా ట్రైల‌ర్‌ను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రానున్నారు. అలాగే ఎం.ఎం.కీర‌వాణి సంగీత ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన పాట‌ల‌ను ఈసారి హైద‌రాబాద్ రామోజీ ఫిలింసిటీలో నిర్వ‌హిస్తార‌ట‌. పార్ట్‌-1 ఆడియో వేడుక‌ను తిరుప‌తిలో నిర్వ‌హించారు.

More News

రాజశేఖర్ సినిమాలో సన్ని స్పెషల్ సాంగ్...

పోలీస్,సి.బి.ఐ పాత్రలకు హీరో డా.రాజశేఖర్ పెట్టింది పేరు.అంకుశం,అగ్రహం,మగాడు సహా పలు పోలీసు క్యారెక్టర్స్ లో రాజశేఖర్ మెప్పించారు.

భాలీవుడ్ హీరోయిన్ పై కన్నేసిన బన్ని...

స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా రచయిత టర్న్ డ్ డైరెక్టర్ వక్కంతం వంశీ తెరకెక్కిస్తున్న సినిమాకు రంగం సిద్ధమవుతుంది.

ఇద్దరు పిల్లలకు తండ్రి అయిన దర్శక నిర్మాత

ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్పై సినిమాలను నిర్మిస్తూ,తెరకెక్కిస్తున్న ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ గురించి అందరికీ తెలిసిందే.

'టిక్ టాక్' డిజిటల్ టీజర్ విడుదల

PH ప్రొడక్షన్స్ బ్యానర్ లో ‘హోప్’ చిత్రానికి నేషనల్ అవార్డు అందుకొని,చంద్రహాస్ సినిమాకి స్వర్ణ నందిని పొంది,సతీష్, దేవకట్టాలాంటి దర్శకుల్ని,

మార్చి 17న 'ఓ పిల్లా నీ వల్లా'

కిషోర్ స్వీయ దర్శకత్వంలో బిగ్ విగ్ మూవీ ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం 'ఓ పిల్లా నీ వల్లా'.