close
Choose your channels

ర‌ష్యాలో బాహుబ‌లి సంద‌డి

Friday, May 29, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ర‌ష్యాలో బాహుబ‌లి సంద‌డి

తెలుగు సినిమా స్థాయిని ప్ర‌పంచానికి చాటిన చిత్రం బాహుబ‌లి. ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రెండు భాగాలుగా రూపొందిన ఈ చిత్రం దాదాపు రూ.2500కోట్లను వ‌సూలు చేసింది. బాహుబ‌లి 2 విడుద‌లై రెండేళ్లు అవుతున్న‌ప్ప‌టికీ ఈ సినిమా మానియా మాత్రం ఇంకా త‌గ్గ‌డం లేదు. తాజాగా బాహుబ‌లి 2 చిత్రం ర‌ష్యాలో సంద‌డి చేస్తోంది. ర‌ష్య‌న్ డ‌బ్బింగ్ వెర్ష‌న్‌తో బాహుబ‌లి 2 చిత్రాన్ని ర‌ష్యాలోని పాపుల‌ర్ టీవీలో ప్ర‌ద‌ర్శించారు. ఈ సినిమా క్లిప్‌ను ర‌ష్య‌న్ కార్యాల‌యం ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసింది. ఈ వీడియో నెటిజ‌న్స్‌ను ఆక‌ట్టుకుంటుంది. ఈ సినిమా మానియాపై నెటిజ‌న్స్ ప‌లు కామెంట్స్ చేస్తున్నారు.

ప్ర‌భాస్‌, రానా, అనుష్క‌, ర‌మ్య‌కృష్ణ‌, త‌మ‌న్నా, స‌త్య‌రాజ్ త‌దిత‌రులు ప్ర‌ధాన తారాగ‌ణంగా న‌టించిన ఈ చిత్రంలో ప్ర‌తి పాత్ర ఎంతో ప‌వ‌ర్‌ఫుల్‌గా ఉంటుంది. ఈ సినిమాతో ప్ర‌భాస్ పాన్ ఇండియా హీరోగా మారారు. బాహుబ‌లి త‌ర్వాత ప్ర‌భాస్ హీరోగా చేసిన సాహో పెద్ద‌గా ఆక‌ట్టుకోలేదు. మ‌రో ప‌క్క ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ఈసారి తార‌క్‌, చ‌ర‌ణ్‌ల‌ను క‌లిపి రౌద్రం ర‌ణం రుధిరం సినిమాను తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాతో మ‌రో ఇద్ద‌రు తెలుగు హీరోలు పాన్ ఇండియా హీరోలు కావ‌డం అనేది ప‌క్కా అని ట్రేడ్ వ‌ర్గాలు అంటున్నాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.