బాహుబలి 2 లోకేషన్ ఫోటోస్ లీక్..!

  • IndiaGlitz, [Tuesday,September 20 2016]

ప్ర‌పంచ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన తెలుగు సినిమా బాహుబ‌లి. ద‌ర్శ‌క‌ధీర రాజ‌మౌళి బాహుబ‌లి చిత్రానికి సీక్వెల్ గా బాహుబ‌లి 2 రూపొందిస్తున్న విష‌యం తెలిసిందే. ప్ర‌భాస్, అనుష్క‌, రానా, త‌మ‌న్నా, ర‌మ్య‌కృష్ణ ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్న బాహుబ‌లి 2 కోసం ఇటీవ‌ల రామోజీ ఫిల్మ్ సిటీలో క్లైమాక్స్ సీన్స్ చిత్రీక‌రించారు. ఇంకా క్లైమాక్స్ సీన్స్ కి సంబంధించిన కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు. అయితే...ఎన్నిర‌కాలుగా జాగ్ర‌త్త‌లు తీసుకున్నా..
ఈ సినిమాకి సంబంధించి ఏదో ర‌కంగా ఏదొక‌టి లీక్ అవుతునే ఉంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన లోకేష‌న్ స్టిల్స్ లీక‌య్యాయి. లీకైన ఈ స్టిల్స్ సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. భారీ లోయ‌లో జ‌రుగుతున్న షూటింగ్ లో యుద్ధ ప‌రిక‌రాల‌ను సిద్దం చేస్తున్న‌ట్టుగా ఈ స్టిల్స్ ను చూస్తే తెలుస్తుంది. అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందిస్తున్న బాహుబ‌లి 2 చిత్రాన్ని వ‌చ్చే సంవ‌త్స‌రం ఏప్రిల్ 28న రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

More News

కోటికొక్క‌డు గా సుదీప్

ఈగ సినిమాలో విల‌న్‌గా న‌టించి మెప్పించిన క‌న్న‌డ స్టార్ న‌టుడు కిచ్చా సుదీప్ రీసెంట్‌గా `ముడింజ ఇన్నై పుడి` త‌మిళం చిత్రంలో హీరోగా న‌టించాడు. ఈ చిత్రాన్ని క‌న్న‌డ‌లో `కోటిగొబ్బ‌2` అనే పేరుతో విడుద‌ల చేశారు. నిత్యామీన‌న్ హీరోయిన్‌గా న‌టించింది.

రానా సినిమాను విడుద‌ల చేస్తున్న క‌ర‌ణ్‌ జోహార్

`బాహుబ‌లి ది బిగినింగ్` సినిమాను ద‌ర్మేంద్ర ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై బాలీవుడ్‌లో విడుద‌ల చేసి తెలుగు సినిమా మార్కెట్‌కు హిందీలో మార్గం వేసుకునేలా దోహ‌ద‌ప‌డిన నిర్మాత క‌ర‌ణ్ జోహార్ ఇప్పుడు రానా ద‌గ్గుబాటి హీరోగా పివిపి బ్యాన‌ర్‌పై సంక‌ల్ప్ రెడ్డి తెర‌కెక్కిస్తున్న చిత్రం `ఘాజి`.

శ్రీకాళ‌హ‌స్తిలో అనిత ప్ర‌త్యేక పూజ‌లు

నువ్వు నేను ఫేమ్ అనిత చాలా గ్యాప్ త‌రువాత తెలుగులో మ‌న‌లో ఒక‌డు అనే చిత్రంలో న‌టించింది. ఆర్.పి.ప‌ట్నాయ‌క్ ద‌ర్శ‌కత్వంలో రూపొందిన మ‌న‌లో ఒక‌డు త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

యు.ఎస్ లో హాఫ్ మిలియ‌న్ మార్క్ క్రాస్ చేసిన జ్యోఅచ్యుతానంద‌..!

నారా రోహిత్, నాగ శౌర్య‌, రెజీనా కాంబినేష‌న్లో అవ‌స‌రాల శ్రీనివాస్ తెర‌కెక్కించిన చిత్రం జ్యోఅచ్యుతానంద‌. ఈ చిత్రాన్ని వారాహి చ‌ల‌న చిత్ర బ్యాన‌ర్ పై సాయి కొర్ర‌పాటి నిర్మించారు.

కొత్త ద‌ర్శ‌కుడితో నాగ‌శౌర్య‌

రీసెంట్‌గా జ్యో అచ్యుతానంద మంచి విజ‌యాన్ని అందుకున్న హీరో నాగ‌శౌర్య నెక్ట్స్ సినిమా ఏం చేస్తాడ‌నే దానిపై ఇప్ప‌టికీ ఒక క్లారిటీ వ‌చ్చింది. నిజానికి నాన్న‌కు ప్రేమ‌తో క‌థా ర‌చ‌యిత హుస్సేన్ షా కిర‌ణ్‌, నందినీ రెడ్డిల ద‌ర్శ‌క‌త్వంలో సినిమాలు చేయ‌నున్నాడ‌ని వార్త‌లు వ‌చ్చాయి.