close
Choose your channels

రామ్‌చరణ్‌కు 'బాహుబలి' కాజాతో సన్మానం.. డైరెక్టర్‌ శంకర్‌కు కూడా, ఫొటోలు వైరల్

Monday, March 7, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

రామ్‌చరణ్‌కు బాహుబలి కాజాతో సన్మానం .. డైరెక్టర్‌ శంకర్‌కు కూడా, ఫొటోలు వైరల్

దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌తో కలిసి నటించిన ఆర్ఆర్ఆర్ షూటింగ్ ముగియడం, విడుదలకు  సిద్ధమవ్వడంతో మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ తన మిగిలిన ప్రాజెక్ట్స్‌పై దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో తమిళ దర్శక దిగ్గజం శంకర్ డైరెక్షన్‌లో RC15 షూటింగ్‌లో పాల్గొంటున్నారు చెర్రీ. ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్‌ గా నటిస్తోంది. దిల్‌రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. శ్రీకాంత్, అంజలి, సునీల్‌, జయరామ్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి పరిసరాల్లో జరుగుతోంది. రామ్‌చరణ్‌పై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈక్రమంలో చరణ్‌కు అరుదైన గౌరవం దక్కింది.

రామ్‌చరణ్‌కు బాహుబలి కాజాతో సన్మానం .. డైరెక్టర్‌ శంకర్‌కు కూడా, ఫొటోలు వైరల్

రాజమండ్రిలోని ఓ హోటల్‌ బస చేస్తున్న రామ్‌చరణ్‌కు తాపేశ్వరం సురుచి వర్మ ‘బాహుబలి’ కాజాను అందజేశారు. కాగా తూర్పుగోదావరి జిల్లాకు ప్రముఖులు ఎవరు వచ్చినా వారికి గౌరవ పూర్వకంగా బాహుబలి కాజాను ఇవ్వడం సాంప్రదాయంగా వస్తోంది. చరణ్‌ తో పాటు డైరెక్టర్‌ శంకర్‌‌కు కూడా ఈ కాజాను బహుమతిగాఅందించారు సురుచి వర్మ. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అంతకుముందు భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మెగాస్టార్ చిరంజీవి, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, సమంత వంటి ప్రముఖులకు కూడా బాహుబలి కాజా అందింది. అలాగే కొన్నినెలల క్రితం ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా షూటింగ్‌ కోసం రాజమండ్రికి వచ్చిన శర్వానంద్‌, రష్మిక‌లకు కూడా బాహుబలి కాజాను బహుమతిగా అందించారు సురుచి వర్మ.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.