రేపే బాల‌య్య వందో సినిమా ప్ర‌క‌ట‌న‌..

  • IndiaGlitz, [Thursday,April 07 2016]

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ వందో సినిమాకి సంబంధించిన పూర్తి వివ‌రాల‌ను ఉగాది రోజున అన‌గా రేపు ప్ర‌క‌టించ‌నున్నారు. అభిరుచి గ‌ల ద‌ర్శ‌కుడు క్రిష్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్నారు. ఈ భారీ చిత్రాన్ని క్రిష్ ఫ‌స్ట్ ఫ్రేమ్ ఎంట‌ర్ టైన్మెంట్స్ బ్యాన‌ర్ పై నిర్మిస్తుండ‌డం విశేషం. చారిత్రాత్మ‌క క‌థాంశమైన గౌత‌మి పుత్ర శాత‌క‌ర్ణి క‌థతో ఈ సినిమా రూపొందుతుంది.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని అమ‌రావ‌తిలోని బుధ్ధ విగ్ర‌హం వ‌ద్ద బాల‌య్య రేపు ఉద‌యం 10.30 నిమిషాల‌కు వందో సినిమాను ప్ర‌క‌టించ‌నున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీప్ర‌సాద్ సంగీతం అందించ‌నున్నారు. ఈ సినిమాకి సంబంధించిన టీమ్ అంతా రేపు ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మంలో పాల్గొంటున్నారు. ఈ చిత్రంలో బాల‌య్య స‌ర‌స‌న న‌టించే క‌ధానాయిక ఎవ‌ర‌నేది ఇంకా ఫైన‌ల్ కాలేదు. ఈ ప్ర‌తిష్టాత్మ‌క సినిమాకి సంబంధించిన‌ పూర్తి వివ‌రాలు రేపు ప్ర‌క‌టిస్తారు.

More News

రాజశేఖర్ ప్లేస్ ఎవరంటే....

కెరీర్ స్టారింగ్ లో నువ్వునేను, చిత్రం, జయం వంటి చిత్రాలతో బ్లాక్ బస్టర్ సక్సెస్ లు సాధించిన డైరెక్టర్ తేజ ఇప్పుడు అహం అనే చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే.

సినిమాకో మ్యూజిక్ డైరెక్ట‌రా?

సాధార‌ణంగా త‌నకి క‌లిసొచ్చిన లేదంటే స‌న్నిహితం ఉన్న‌ సంగీత ద‌ర్శ‌కుడుతో మ‌రో సినిమా చేయ‌డం ద‌ర్శ‌కుల‌కుండే అల‌వాటు. అయితే ఇందుకు విరుద్దంగా ఉన్నారు టాలెంటెడ్ డైరెక్ట‌ర్ క్రిష్‌.

ఎన్టీఆర్ కి ఫైన్ వేసిన ట్రాఫిక్ పోలీస్..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి ఓ ట్రాఫిక్ పోలీస్ ఫైన్ వేసాడట.ఇంతకీ ఎన్టీఆర్ కి ఎందుకు ట్రాఫిక్ పోలీస్ ఫైన్ వేసాడంటే...

పవన్ కోసం షూటింగ్ క్యాన్సిల్ చేసిన హీరో, డైరెక్టర్..

పపర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సర్ధార్ గబ్బర్ సింగ్ ఉగాది రోజున అనగా ఈనెల 8న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే.

తమిళంలోకి మహేష్ హీరోయిన్....

తెలుగులో మహేష్ సరసన నేనొక్కడినే చిత్రంలో యాక్ట్ చేసిన కృతిసనన్ తర్వాత హీరో పంటి,దిల్ వాలే చిత్రాల్లో నటించింది.