బాలయ్య 105వ మూవీ లుక్.. కాపీ పేస్టే!

  • IndiaGlitz, [Saturday,October 26 2019]

న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా న‌టిస్తోన్న 105వ చిత్రం విషయంలో అభిమానులకు చిత్రబృందం తియ్యటి శుభావార్త చెప్పింది. దీపావళి సందర్భంగా ఈ చిత్రానికి టైటిల్, రిలీజ్ డేట్‌ను దర్శకనిర్మాతలు ఖారురు చేశారు. కాగా ఈ చిత్రానికి ‘రూల‌ర్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేయగా.. డిసెంబర్ 20న ఈ చిత్రాన్ని గ్రాండ్ లెవ‌ల్లో విడుద‌ల చేస్తామని ప్రకటించారు. అంతేకాదు ఈ సందర్భంగా ఫస్ట్‌లుక్‌ను కూడా రిలీజ్ చేసింది చిత్రబృందం. ఇంతవరకూ అంతా ఓకే గానీ ఈ లుక్ చూసిన నెటిజన్లు, బాలయ్య అంటే పడని కొందరు వ్యక్తులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

సేమ్ టూ సేమ్!

ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. బాలయ్య లుక్ అచ్చుగుద్దినట్లుగా రజనీకాంత్ మూవీ ‘దర్బార్’ లుక్‌ మాదిరిగా ఉండటం గమనార్హం. దీంతో నెటిజన్లు బాలయ్య ఫొటో.. రజనీ ఫొటో పక్కపక్కనే పెట్టి కాపీ చేసి పేస్ట్ చేసేశారంటూ సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు. సేమ్ టూ సేమ్ పోలీస్ గెటప్‌లో ఉండటం.. అయితే రజనీ చేతిలో లాఠీ.. బాలయ్య చేతిలో గొడ్డలి ఇదొక్కటే తేడా. మిగినదంతా హెయిర్ స్టైల్ మొదలుకుని మొత్తం సేమ్ టూ సేమ్ అంతే. ఈ లుక్‌లు రెండూ మిక్స్ చేసి నెట్టింట్లో కొందరు పెద్ద ఎత్తున వైరల్ చేస్తున్నారు.

కాగా.. ఏఆర్ మురగదాస్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి పండుగ బరిలో నిలిచేందుకు ముస్తాబవుతోంది. ఈ చిత్రానికి సంతోష్ శివన్ సినిమాటోగ్రఫిని అందిస్తుండగా, అనిరుధ్ మ్యూజిక్, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. దర్బార్ సినిమాలోని ప్రధాన భాగమంతా ముంబైలోని మురికివాడల్లో చిత్రీకరిస్తున్న సంగతి తెలిసిందే.

More News

కార్తి 'ఖైదీ' దీపావళిక బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది - కె.కె.రాధామోహన్‌

యాంగ్రీ హీరో కార్తి కథానాయకుడిగా డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ పతాకంపై లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో ఎస్‌.ఆర్‌.ప్రకాష్‌బాబు, ఎస్‌.ఆర్‌.ప్రభు, తిరుప్పూర్‌ వివేక్‌

హుజూర్‌నగర్‌పై కేసీఆర్ వరాల వర్షం... తెలంగాణలో ఏ ఇంచైనా నాదే!

హుజూర్‌నగర్‌ ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి కలలో కూడా ఊహించని రీతిలో మెజార్టీ సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఇందుకు కృతజ్ఞతగా సీఎం కేసీఆర్ సభ నిర్వహించారు.

ఆర్టీసీ జేఏసీ నేతల చర్చలు విఫలం.. వాట్ నెక్స్ట్!

తెలంగాణ ఆర్టీసీ జేఏసీ నేతలు యాజమాన్యంతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. అన్ని డిమాండ్లు పరిష్కరించాలని కార్మిక నేతలు పట్టుబట్టారు.

'సరిలేరు నీకెవ్వరు' దీపావళి డబుల్ ధమాకా

సూపర్‌స్టార్‌ మహేష్‌ అప్ కమింగ్ సెన్సేషన్‌ 'సరిలేరు నీకెవ్వరు' చిత్రానికి సంబంధించి న్యూ స్టిల్స్ ను దీపావళి శుభాకాంక్షలతో విడుదల చేశారు. సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా దిల్‌రాజు

ఉర్రూతలూగిస్తున్న అల వైకుంఠపురములో 'రాములో... రాముల' గీతం

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, మాటల మాంత్రికుడు, సుప్రసిద్ధ సినీ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'అల వైకుంఠపురములో...' వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న