close
Choose your channels

బాల‌కృష్ణ‌, బోయపాటి శ్రీను హ్యాట్రిక్ మూవీ ప్రారంభం

Friday, December 6, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బాల‌కృష్ణ‌, బోయపాటి శ్రీను హ్యాట్రిక్ మూవీ ప్రారంభం

`సింహ, లెజెండ్` లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాల తర్వాత నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తోన్న హ్యాట్రిక్ చిత్రం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ద్వారక క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకుడు బి. గోపాల్ క్లాప్ నివ్వగా ప్రముఖ నిర్మాత అంబికా కృష్ణ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఫస్ట్ షాట్ లోనే నటసింహ నందమూరి బాలకృష్ణ `నువ్వొక మాటంటే అది "శబ్దం" అదే మాట నేనంటే అది "శాసనం" చెక్ ఇన్ ద‌ పబ్లిక్` అనే పవర్ఫుల్ డైలాగ్ ను తనదయిన స్టైల్ లో చెప్పారు బాల‌కృష్ణ‌. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాతలు సి. కల్యాణ్, శివలెంక కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు.

అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో..
నటసింహ నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ -
"ఈరోజు శుభదినం. ఎప్పడు ఎప్పుడా అని అందరూ ఎదురుచూస్తున్న నా మరియు బోయపాటి శ్రీను కలయికలో ద్వారక క్రియేషన్ మిర్యాల రవీందర్ రెడ్డి గారు నిర్మాతగా నూతన చిత్రం ప్రారంభం జరిగింది. బోయపాటి శ్రీను కాంబినేషన్ లో 'సింహ', 'లెజెండ్' సినిమాలు చేయడం అద్భుతమైన విజయాలు అందుకోవడం జరిగింది. మా కాంబినేషన్ అనగానే ప్రేక్షకులలో, అభిమానుల్లో ఎంతో ఎక్కువ ఎక్స్‌పెక్టేష‌న్స్ ఉంటాయి. అయితే నాది బోయపాటిది సిద్ధాంతం ఏంటంటే గతం గతః. మేము చేసిన సినిమాల గురించి మాట్లాడుకోకుండా పూర్తి కాన్స‌న్ ట్రేష‌న్ మా నెక్స్ట్ మూవీ మీదనే ఉంచుతాం. అలాగే ఎం. రత్నం గారి కథా సంభాషణలు వినసొంపుగా ఉంటాయి. ఏదయితే జనం కోరుకుంటున్నారో అవి ఇవ్వాల్సిన భాద్యత మా మీద ఉంది. అంత భాద్యత తీసుకుంటాం కనుకనే 'సింహ', 'లెజెండ్' సినిమాలు అంత పెద్ద విజయం సాధించాయి. ఈ సినిమా కథలో కొత్తదనం ఉంది అలాగే ఆద్యాత్మికం కూడా ఉంది. కొన్ని కథలు ఒక పాత్రలో నుండి పుట్టుకొస్తాయి. కొన్ని ఒక మనిషి వ్యక్తిత్వం నుండి పుట్టుకొస్తాయి. అయితే మా కలయికలో క‌థ‌లు ఎక్కువగా మా ఆవేశం నుండి పుట్టుకొస్తాయి. అలాగే ఈ కథ అద్భుతంగా వ‌చ్చింది. ఇండస్ట్రీ కి మిర్యాల రవీందర్ లాంటి మంచి మంచి యంగ్ ప్రొడ్యూసర్స్ రావాల్సిన అవసరం ఎంతో ఉంది. అటువంటి త‌రుణంలో వ‌స్తోన్న మా కాంబినేషన్ లో చాలా మంచి సినిమా ఇవ్వబోతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.

(దిశ నిందితుల ఎన్‌కౌంట‌ర్ గురించి మాట్లాడుతూ) - దిశ అనే మహిళ పైన కొంత మంది దుండగులు చేసిన సామూహిక అత్యాచారానికి ఫలితంగా ఈ రోజు వారిని ఎన్ కౌంటర్ చేయడం జరిగింది. ఎన్నో మాధ్యమాల ద్వారా సంఘాన్ని మార్చడానికి, వారికి ఒక మంచి సందేశాన్ని ఇవ్వడానికి అన్న నందమూరి తారక రామారావు గారు, నాన్న గారు ఎన్నో మంచి సందేశాత్మక చిత్రాలు చేయడం జరిగింది. అలాగే 'లెజెండ్' సినిమాలో మేము కూడా స్త్రీ లేకుంటే సృష్టి లేదుఅనే మంచి సందేశం ఇవ్వడం జరిగింది. ఇక్కడే కాదు దేశం యావత్తు మ‌న‌ మహిళల పై ఎన్నో ఘాతకాలు జరుగుతున్నాయి. ఆ భగవంతుడే పోలీసుల రూపంలో ఈరోజు నిందితులకు సరైన శిక్ష విధించడం జరిగింది, మరోసారి ఎవరూ కూడా అలాంటి దుశ్చర్యలు చేయకుండా ఉండటానికి, అసలు ఆ ఆలోచన కూడా మొలకెత్తనీయకుండా వారిని ఎన్‌కౌంట‌ర్ చేయడం జరిగింది. అందరికి కూడా ఇదొక గుణపాఠం కావాలి. ముందు ముందు ఇటువంటి ఘాతుకానికి సాహసించకుండా, ఆ ఆలోచన కూడా రానివ్వకుండా చేసిన తెలంగాణ ప్రభుత్వానికి, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ కి నా అభినందనలు తెలియజేస్తున్నా. దిశ ఆత్మకు ఇప్పుడు శాంతి చేకూరింది. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.

మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను మాట్లాడుతూ - ``ద్వారక క్రియేషన్ లో నా రెండవ సినిమా. బాలయ్య బాబు, నాది హ్యాట్రిక్ ఫిలిం. ఇండస్ట్రీ లో నా మొదటి సినిమా 'భద్రస‌. ఒకమంచి సినిమాతో నా లైఫ్ స్టార్ట్ అయింది. సింహతో విజయంతో నా జీవితానికి మంచి మలుపు వచ్చింది. సింహ, లెజెండ్ మంచి విజయాన్ని సాధించాయి. ఇప్పుడు రాబోతున్న మూడవ సినిమా నాభాద్యత. ఆరెండు సినిమాలకు మించిన మంచి సినిమాను మీ ముందుకు తీసుకువచ్చి నా భాద్యతను నెరవేర్చుకుంటాను.

(దిశ నిందితుల ఎన్‌కౌంట‌ర్ గురించి మాట్లాడుతూ).. దిశ కి జరిగిన అన్యాయం గురించి దేశంలోని అందరూ బాధపడుతున్నపుడు తెలిసిన మంచి విషయం ఏంటంటే వారు పారి పోవడానికి ప్రయత్నిస్తే పోలీసులు వారిని ఎన్‌కౌంట‌ర్ చేయడం. ఎవరైనా ఒకటే గుర్తుంచుకోవాలి `పొల్యూషన్ నుండైనా ఎవరైనా తప్పించుకోవచ్చేమో కానీ పోలీస్ నుండి ఎవరూ తప్పించుకోలేరు`.

చిత్ర నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి మాట్లాడుతూ - "భవిష్యత్తులో నేను చాలా సినిమాలు తీస్తుండొచ్చు. కానీ బాలకృష్ణ గారితో సినిమా అంటే గౌరవంగా భావిస్తా. ఆ గౌరవాన్ని సినిమా విడుదల తర్వాత బాలకృష్ణ గారి అభిమానులు, సినిమా ఇష్టపడే ప్రతి ఒక్కరి నుండి అటువంటి గౌరవాన్ని పొందే విధంగా ఈ సినిమాను నిర్మిస్తానని ప్రామిస్ చేస్తున్నాను 'అన్నారు.

నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి డైలాగ్స్: ఎం.రత్నం,సంగీతం: థమన్ ఎస్.ఎస్, సినిమాటోగ్రఫీ : రాంప్రసాద్, ఆర్ట్ డైరెక్టర్ : ఎ.ఎస్.ప్రకాష్, ఎడిటింగ్ : కోటగిరి వేంకటేశ్వర రావు, తమ్మిరాజు, నిర్మాత : మిర్యాల రవీందర్ రెడ్డి, దర్శకత్వం: బోయపాటి శ్రీను.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.