close
Choose your channels

రాసుకుపూసుకు తిరుగుతున్నారుగా.. ఆ డబ్బంతా ఏమైంది: బాలకృష్ణ

Thursday, July 15, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నటసింహం నందమూరి బాలకృష్ణ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మా అసోసియేషన్ ఎన్నికలపై, మా బిల్డింగ్ నిర్మాణంపై బాలయ్య చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. మా ఎన్నికలో లోకల్, నాన్ లోకల్ అనే అంశాన్ని తాను పట్టించుకోనని బాలయ్య అన్నారు. ఓ ఇంటర్వ్యూలో చిత్ర పరిశ్రమ గురించి అనేక విషయాలు మాట్లాడారు.

లోకల్, నాన్ లోకల్ పక్కన పెట్టండి.. నేను ఒక్కటే సూటిగా అడుగుతున్నా.. ఇంతవరకు మా బిల్డింగ్ ఎందుకు కట్టలేదు.. సమాధానం చెప్పండి అని బాలయ్య ప్రశ్నించారు. పనికిరాని గొడవల్లో నేను తలదూర్చను. నాకు చాలా భాద్యతలు ఉన్నాయి అని బాలయ్య అన్నారు. మనది గ్లామర్ ఇండస్ట్రీ. ఏ సమస్య వచ్చిన కూర్చుని చర్చించుకోవాలి. రచ్చ చేయకూడదు అని అన్నారు.

కంట్లో నలుసు పడింది కదా అని కనుగుడ్లు పీకేసుకుంటామా అని బాలయ్య ఇండస్ట్రీలో జరుగుతున్న గొడవలపై ఎద్దేవా చేశారు. అసలు సమస్యపై ఫోకస్ చేయాలి. బిల్డింగ్ ఇంతవరకు ఎందుకు కట్టలేదు.. తెలంగాణ ప్రభుత్వాన్ని అడిగితే ఒక ఎకరా భూమి ఇవ్వలేదా ? తెలంగాణ ప్రభుత్వంతో రాసుకుపూసుకు తిరుగుతున్నారుగా.. అడిగితే ఇవ్వరా అని బాలయ్య ప్రశ్నించారు.

ఇంతకు ముందు కూడా ఫండ్ రైజింగ్ కార్యక్రమాలు చేశారు. అమెరికాకు ఫస్ట్ క్లాస్ విమానాల్లో ప్రయాణించారు. ఆ డబ్బంతా ఏమైంది అని బాలయ్య అడిగారు. కానీ నేను ఇలాంటి విషయాలు పెద్దగా పట్టించుకోను. ఎందుకంటే నాకు నా నియోజకవర్గం, క్యాన్సర్ ఆసుపత్రి, సినిమాలు ఇలా చాలా భాద్యతలు ఉన్నాయి అని బాలయ్య అన్నారు.

తాను సొంతంగా మా బిల్డింగ్ నిర్మిస్తాను అంటున్న మంచు విష్ణుకి బాలయ్య మద్దతు తెలిపారు. అలా చేస్తే నేను కూడా మంచు విష్ణుకి సాయం అందిస్తాను.. ఓ చేయి వేస్తాను అని బాలయ్య అన్నారు. అందరం తలో చెయ్యి వేస్తే ఇంద్రభవనం లాంటి బిల్డింగ్ నిర్మించవచ్చు అని బాలయ్య తెలిపారు.

మా ఎన్నికల్లో ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, సివిఎల్ నరసింహారావు, జీవిత లాంటి ప్రముఖులు పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.