ఏడాదికో మెగా హీరోతో బాల‌య్య‌

  • IndiaGlitz, [Sunday,June 17 2018]

గ‌త మూడేళ్ళుగా సంక్రాంతి సీజ‌న్‌లో త‌న సినిమాల‌తో సంద‌డి చేస్తున్నారు 'సంక్రాంతి క‌థానాయ‌కుడు'గా పేరు తెచ్చుకున్న‌ న‌ట సింహ బాల‌కృష్ణ‌. అంతేగాకుండా.. వ‌చ్చే ఏడాది కూడా ఆయ‌న సంక్రాంతికి సంద‌డి చేయ‌నున్నారు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమిటంటే.. గ‌త రెండేళ్ళుగా త‌న సినిమాల‌తో పాటు మెగా హీరోల సినిమాలు సంక్రాంతి బ‌రిలో నిలిచాయి. వ‌చ్చే ఏడాది కూడా అదే రిపీట్ కాబోతోంది. కాస్త వివ‌రాల్లోకి వెళితే.. 2017లో నందమూరి బాలకృష్ణ 100వ చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ సంక్రాంతి కానుక‌గా విడుదల అయి.. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది.

ఆ సినిమా విడుద‌ల‌కి ఒక రోజు ముందు మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఖైదీ నంబర్ 150’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చిరు కెరీర్‌లో 150వ చిత్రంగా, రీ-ఎంట్రీ ఫిల్మ్‌గా రూపొందిన ఈ సినిమా మంచి వసూళ్లను రాబట్టింది. అలాగే.. ఈ ఏడాది సంక్రాంతికి బాల‌య్య న‌టించిన‌ ‘జై సింహా’ తో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 25వ చిత్రం‘అజ్ఞాతవాసి’ విడుద‌ల‌యింది.

క‌ట్ చేస్తే.. వ‌చ్చే ఏడాది సంక్రాంతికి త‌న తండ్రి నంద‌మూరి తార‌క రామారావు బ‌యోపిక్ ‘యన్.టి.ఆర్’తో ప‌ల‌క‌రించ‌నున్నారు బాలకృష్ణ. అదే స‌మ‌యంలో రామ్ చ‌ర‌ణ్ హీరోగా బోయ‌పాటి తెర‌కెక్కిస్తున్న సినిమా విడుద‌ల కాబోతోంది. అంటే.. సంక్రాంతి సీజ‌న్‌లో వ‌రుస‌గా మూడేళ్ళ పాటు బాల‌య్య సినిమాల‌తో పాటు మెగా హీరోల సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయ‌న్న‌మాట‌.

మెగా హీరోల‌తో బ‌రిలోకి దిగిన గ‌త రెండు సంద‌ర్భాల్లోనూ బాల‌య్య‌కు విజ‌యాలు వ‌రించాయి. వ‌చ్చే ఏడాది కూడా అది రిపీట్ అవుతుందేమో చూడాలి.

More News

జూన్ 21న యువి క్రియేష‌న్స్, పాకెట్ సినిమా వారి 'హ్యాపి వెడ్డింగ్' ఇన్విటేష‌న్‌

వ‌రుడు..  ల‌వ‌ర్స్‌, కేరింత లాంటి మంచి విజ‌యాల‌తో యూత్ ఆడియ‌న్స్ నే కాకుండా ఫ్యామిలి ఆడియ‌న్స్ లో కూడా మంచి పేరు తెచ్చుకున్న సుమంత్ అశ్విన్‌

రాజ్ కందుకూరి - మధుర శ్రీధర్ రెడ్డి చేతుల మీదుగా 'ఐపిసి సెక్షన్.. భార్యాబంధు' ట్రైలర్స్ విడుదల

ఇండియన్ పీనల్ కోడ్ లోని ఒక ముఖ్యమైన సెక్షన్ ను ఆధారం చేసుకుని రూపొందుతున్న వినూత్న కుటుంబ కథాచిత్రం 'ఐపిసి సెక్షన్.. భార్యాబంధు".

బంగారి బాలరాజు మూవీ ట్రైలర్ లాంచ్ లో చిన్న సినిమాలకు వరం - అంబికా కృష్ణ

రాఘవ్, కరోణ్య కత్రిన్ హీరో హీరోయిన్ లు గా నంది క్రియేషన్స్ పతాకం పై కె.యండి. రఫీ. రెడ్డం రాఘవేంద్ర రెడ్డి నిర్మాతలుగా కోటేంద్ర దుద్యాల దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం "బంగారి బాలరాజు".

జూన్ 21న 'పంతం' ఆడియో రిలీజ్ - నిర్మాత కె.కె.రాధామోహ‌న్‌

టాలీవుడ్ యాక్ష‌న్ స్టార్ గోపీచంద్ హీరోగా శ్రీ స‌త్య‌సాయి ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై కె.కె.,రాధామోహ‌న్ నిర్మిస్తోన్న చిత్రం 'పంతం'.

సాయిప‌ల్ల‌వి షాక్ ఇస్తుంద‌ట‌

శర్వానంద్, సాయిపల్లవి జంటగా నటిస్తున్న చిత్రం 'పడి పడి లేచె మనసు'. హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నారు.