మ‌ళ్లీ క్రేజీ కాంబో !!

కొన్ని కాంబినేష‌న్స్ పై ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తి బాగా ఉంటుంది. అలా ఆస‌క్తి రేపిన కాంబినేష‌న్స్‌లో నంద‌మూరి బాల‌కృష్ణ‌, డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్ ఒక‌టి. వీరిద్ద‌రి కాంబోలో వ‌చ్చిన పైసా వ‌సూల్ చిత్రం మంచి క్రేజ్‌ను ద‌క్కించుకుంది. అప్ప‌టి వర‌కు బాల‌కృష్ణ‌ను ఎవ‌రూ చూపించ‌ని కొత్త కోణంలో పూరి స్క్రీన్‌పై చూపించారు. ఇప్పుడు ఈ కాంబో మ‌రోసారి తెర‌పై సంద‌డి చేయ‌నుంద‌ని స‌మాచారం. వివరాల్లోకెళ్తే.. బాల‌కృష్ణ త‌న త‌దుపరి పూరితో చేయాల‌నుకుని, ఆయ‌న‌కు విష‌యాన్ని చేర‌వేశార‌ట‌. పూరి కూడా అందుకు సుముఖంగానే ఉన్నార‌ట‌.

ప్ర‌స్తుతం విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో ఫైట‌ర్ సినిమాను తెర‌కెక్కిస్తోన్న పూరీ జ‌గ‌న్నాథ్ త‌దుప‌రి ఓ సీనియ‌ర్ హీరోతో సినిమా చేస్తారంటూ కొన్నిరోజులుగా సోష‌ల్ మీడియాలో వార్త‌లు షికార్లు చేస్తున్నాయి. మ‌ఖ్యంగా నాగార్జున‌, పూరి పేర్లు కూడా వినిపించాయి. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు బాల‌కృష్ణ‌, పూరి కాంబినేష‌న్‌లో సినిమా అనే వార్త‌లు వ‌స్తున్నాయి. ప్ర‌స్తుతం బాల‌య్య‌, బోయ‌పాటి ద‌ర్శ‌క‌త్వంలో త‌న 106వ సినిమాను ఎప్పుడెప్పుడు పూర్తి చేసి కొత్త సినిమాను స్టార్ట్ చేయాలా? అని ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నార‌ట‌. మ‌రి పూరి ఫైట‌ర్ త‌ర్వాత ఏ సినిమా చేస్తాడో, ఎవ‌రితో సినిమా చేస్తారోన‌నే విష‌యం ఆస‌క్తిక‌రంగా మారింది.

More News

మళ్లీ టాక్స్‌లో వ‌రుణ్ తేజ్ మూవీ!!

యువ క‌థానాయ‌కుడు వ‌రుణ్ తేజ్‌,  'అప్ప‌ట్లో ఒక‌డుండేవాడు' ఫేమ్ సాగ‌ర్ చంద్ర ద‌ర్శ‌క‌త్వంలోనూ

ఆలియా త‌ప్పుకోలేదు... అయితే!!

బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భ‌ట్ రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ప్రెస్టీజియ‌స్ మూవీ ‘రౌద్రం ర‌ణం రుధిరం(ఆర్ఆర్ఆర్‌)’ సినిమాలో

చిన్ననాటి స్నేహితురాలితో పెళ్లి పీటలెక్కనున్న శర్వానంద్!

వైవిధ్యభరితమైన కథను ఎంచుకుంటూ ప్రతి సినిమానూ సక్సెస్ బాట పట్టించుకోవడంలో టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ దిట్ట.

ట్రంప్ ప్రభుత్వం విధించిన నిషేధంపై కోర్టును ఆశ్రయించిన టిక్‌టాక్..

అమెరికా.. సోషల్ మీడియా యాప్ టిక్‌టాక్‌ సంస్థ నిర్వాహకుల మధ్య వివాదం ముదురుతోంది. సోమవారం టిక్‌టాక్ సంస్థ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.

చైత‌న్య‌కు త‌ప్ప‌డం లేదా!!

హీరోలు కొన్ని ప్రాజెక్టులు చేయ‌కూడ‌ద‌ని అనుకున్నా కూడా.. డైరెక్ట‌ర్, స్క్రీన్‌ప్లే న‌చ్చితే చేయాల్సి వ‌స్తుంది.