క‌వ‌ల‌లుగా బాల‌య్య‌

  • IndiaGlitz, [Wednesday,February 26 2020]

నంద‌మూరి బాల‌కృష్ణ 106వ చిత్రం మార్చి నుండి ప్రారంభం కానుంది. బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. సింహ‌, లెజెండ్ వంటి విజ‌య‌వంత‌మైన‌ చిత్రాల త‌ర్వాత వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో రాబోతున్న చిత్రం కావ‌డంతో సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి. ఈ చిత్రంలో బాల‌కృష్ణ ద్విపాత్రాభిన‌యం చేస్తున్నాడ‌ని, అందులో ఓ పాత్ర అఘోరా పాత్ర అని వార్త‌లు వినిపించాయి. అయితే లేటెస్ట్ స‌మాచారం మేర‌కు ఈ చిత్రంలో బాల‌కృష్ణ క‌వ‌ల‌లుగా క‌నిపించ‌బోతున్నాడ‌ట‌. క‌వ‌ల‌లు చిన్న‌ప్పుడే విడిపోతార‌ట‌. ఓ అబ్బాయి వార‌ణాసిలో.. మ‌రో అబ్బాయి రాయ‌ల‌సీమ‌లో పెరుగుతాడ‌ట‌.

వార‌ణాసిలో పెరిగిన అబ్బాయి అఘోరాగా మారుతాడ‌ట‌. ఆ పాత్ర ఇంట‌ర్వెల్‌లో ఎంట్రీ ఇస్తుంద‌ట‌. శ్రియా శ‌ర‌న్‌, అంజ‌లి హీరోయిన్స్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రంలో జ‌గ‌ప‌తిబాబు విల‌న్‌గా న‌టించ‌బోతున్నాడట‌. ద్వార‌కా క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు బాల‌కృష్ణ‌ను త‌న సినిమాల్లో తండ్రీ కొడుకులుగా, అన్న‌ద‌మ్ములుగా చూపించిన బోయ‌పాటి తొలిసారి క‌వ‌ల సోద‌రులుగా చూపించ‌నున్నారు. న‌వ‌గ్ర‌హాలు, ఆధ్యాత్మిక అంశాల‌ను కూడా ఈ క‌థ‌కు లింక్ పెట్టార‌ట బోయ‌పాటి.

More News

రెండు ప్రేమ‌క‌థ‌లు..పున‌ర్జ‌న్మ‌ల‌తో నాని 27

నేచుర‌ల్ స్టార్ నాని వ‌రు సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు. రీసెంట్‌గానే త‌న 25వ సినిమా `వి`ను పూర్తి చేశాడో లేదో ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండా త‌న 26వ సినిమాకు రెడీ అయిపోయాడు.

చంద్రబాబును జగన్ ఓడించారని ట్రంప్‌కు కోపం!

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే..

పూరితో ప‌వ‌ర్‌స్టార్‌..?

జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన త‌ర్వాత వ‌రుస సినిమాలు చేస్తున్నాడు.

నిర్మాత‌గా మారుతున్న చైత‌న్య‌

అక్కినేని వార‌సుల్లో మూడో త‌రం హీరోలుగా అక్కినేని చైత‌న్య‌, అఖిల్ ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితులే.

భారత్ పర్యటన ఎప్పటికీ మర్చిపోలేను: ట్రంప్

అగ్రరాజ్యం అధినేత డోనాల్డ్ ట్రంప్ రెండ్రోజుల పర్యటన అనంతరం మీడియా మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా భారత్‌పై ప్రశంసల వర్షం కురిపించారు.