శ్యామ్ సింగరాయ్‌ని వీక్షించిన బాలయ్య.. బాగా తీశారంటూ కితాబు

  • IndiaGlitz, [Saturday,January 01 2022]

నేచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘‘శ్యామ్ సింగరాయ్’’. ఈ చిత్రంలో నాని ద్విపాత్రాభినయం చేయగా.. ఆయన సరసన సాయిపల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌ హీరోయిన్‌లుగా నటించారు. వెంకట్ బోయనపల్లి నిర్మాతగా నిహారిక ఎంటర్టైన్‌మెంట్ బ్యానర్‌పై తెరకెక్కిన శ్యామ్ సింగరాయ్ క్రిస్మస్ కానుకగా డిసెంబరు 24న విడుదలైంది. మంచి మౌత్ టాక్, పాజిటివ్ రివ్యూలతో ఈ సినిమా మంచి వసూళ్లు సాధిస్తోంది. నాని కెరీర్‌లోనే తొలిసారిగా దక్షిణాది భాషలన్నింటిలో శ్యామ్ సింగరాయ్ రిలీజ్ అయ్యింది.

కాగా ఈ చిత్రాన్ని అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ కోసం నేడు ప్రత్యేకంగా ప్రదర్శించారు. హీరో నానితో కలిసి శ్యామ్ సింగరాయ్ సినిమా వీక్షించారు బాలయ్య. బాగా చేశారంటూ హీరో నానితో పాటు చిత్రంలోని నటీనటులను, టెక్నీషియన్లను ఆయన అభినందించారు. అలాగే సినిమా బాగా తీశావంటూ దర్శకుడు రాహుల్ సాంకృత్యన్‌ను బాలయ్య ప్రశంసించారు.

ఇక నిన్న అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘‘పుష్ప’’ సినిమాను కూడా బాలకృష్ణ తన ఫ్యామిలీతో కలిసి వీక్షించారు. మైత్రీ మూవీ మేకర్స్ .. బాలయ్య కోసం స్పెషల్ స్క్రీనింగ్‌ని వేయించారు. బాలకృష్ణ తో పాటు ఆయన సోదరి, బీజేపీ నేత పురందేశ్వరి, బాలయ్య సతీమణి వసుంధర, కుమారుడు మోక్షజ్ఞ, చిన్న కూతురు తేజస్విని, ఆమె భర్త భరత్‌లు పుష్ప సినిమాను వీక్షించారు. ఇకపోతే ప్రస్తుతం బాలకృష్ణ ‘‘ఆహా’’ ఓటీటీలో అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే టాక్ షో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ షో లో ఇటీవల ‘‘పుష్ప’’ టీమ్ తో బాలయ్య హంగామా చేశారు.
 

More News

తెలంగాణ‌లో భారీగా పెరిగిన సినిమా టికెట్ల ధ‌ర‌లు.. ఆ థియేటర్‌లో చూడాలంటే రూ.350

ఏపీలో సినిమా టికెట్ ధరలను తగ్గింపు వ్యవహారం పెద్ద దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. దీంతో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఏపీ ప్రభుత్వం చర్చలు జరుపుతున్నారు.

కరోనా భారిన పడ్డ విశ్వక్ సేన్: వ్యాక్సిన్ వేసుకున్నా, అప్రమత్తంగా వుండాలంటూ ట్వీట్

భారతదేశంలో మరోసారి కరోనా మహామ్మారి పంజా విసురుతోంది.

'ఖిలాడీ' నుంచి ‘అట్టా సూడకే’ లిరికల్ సాంగ్ రిలీజ్... స్టెప్పులతో అదరగొట్టిన రవితేజ

మాస్ మహారాజా రవితేజ వరుస సినిమాలతో దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. ఆయన తాజాగా నటిస్తోన్న చిత్రం ‘‘ఖిలాడీ’’.

జపాన్‌లో ప్రభాస్ క్రేజ్.. IKEA బాటిల్స్‌పై ‘‘రాధేశ్యామ్’’ స్టిక్కర్స్

బాహుబలి సీరిస్ తర్వాత యంగ్ రెబల్ స్టార్‌గా వున్న ప్రభాస్ కాస్తా.. పాన్ ఇండియా స్థార్‌గా మారిన సంగతి తెలిసిందే.

రూ.100 కోట్లా.. నాకు ఎవరిస్తారు : రెమ్యూనరేషన్‌ వార్తలపై తేల్చేసిన రామ్‌చరణ్

తెలుగు చిత్ర పరిశ్రమ ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు తీసే స్థాయికి చేరుకుంది. అదే సమయంలో హీరోలు, హీరోయిన్లు, దర్శకుల పారితోషకాలు కూడా బాగా పెరిగాయి.