బాలయ్య సినిమాలో ఆమెకు నో చెప్పేశారు...

  • IndiaGlitz, [Friday,November 06 2020]

నంద‌మూరి బాల‌కృష్ణ‌, డైరెక్ట‌ర్ బోయపాటి శ్రీను కాంబినేష‌న్‌లో మూడో చిత్రం తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. సింహా, లెజెండ్ వంటి సూప‌ర్‌హిట్ చిత్రాల త‌ర్వాత ఈ క్రేజీ కాంబోపై భారీ అంచ‌నాలే ఉన్నాయి. ఇప్ప‌టికే ఓ షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకున్న బాల‌కృష్ణ.. కోవిడ్ ప్ర‌భావిత నేప‌థ్యంలో అంద‌రి స్టార్స్‌ను ఫాలో అవుతూ, త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ కొత్త షెడ్యూల్‌ను రీసెంట్‌గా స్టార్ట్ చేశారు. ఈ సినిమాలో బాల‌కృష్ణ డ్యూయెల్ రోల్ పోషిస్తున్నార‌ని స‌మాచారం.

బాలకృష్ణ సరసన నటించబోయే హీరోయిన్‌ ఎవరనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. రీసెంట్‌గా ఇద్దరు హీరోయిన్స్‌ పేర్లు వినిపించాయి. ఓ హీరోయిన్‌గా పూర్ణ నటిస్తుందని, మరో హీరోయిన్‌గా ప్రయాగమార్టిన్‌ నటిస్తుందని వార్తలు వినిపించాయి. అయితే ఫొటోషూట్‌లో బాలయ్య పక్కన్న ప్రయాగ మార్టిన్‌ సూట్‌ కావడం లేదని యూనిట్‌ భావించింది. దాంతో ఆమెను తప్పించి ఆమె స్థానంలో మరో హీరోయిన్‌ను తీసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారట. మ‌రి ఈ వార్త‌ల‌పై బాల‌య్య క్యాంప్ ఎలా స్పందిస్తుందో చూడాలి. ఈ సినిమాలో బాల‌కృష్ణ అఘోరా పాత్ర‌లోనూ క‌నిపిస్తార‌ట‌. మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

More News

కేటీఆర్ కీలక ప్రకటన.. తెలంగాణ రాష్ట్రానికి భారీ పెట్టుబడి

తెలంగాణకు మరో భారీ పెట్టుబడి వచ్చింది. ఈ మేరకు తెలంగాణ మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన చేశారు.

'మర్డర్‌' సినిమా విషయంలో ఆర్జీవీకి లైన్‌ క్లియర్‌..

రామ్‌గోపాల్‌ వర్మ చాలా సంతోషంగా ఉంది. అందుకు కారణం.. ఒక వైపు సక్సెస్‌ కావడం. తన సినిమాకు కావాల్సినంత పబ్లిసిటీ దొరకడం.

గూగుల్ పే, ఫోన్ పేలకు షాక్.. వాట్సాప్ పేమెంట్స్ స్టార్ట్..

నేటి నుంచి సోషల్ మీడియా దిగ్గజం వాట్సాప్ ద్వారా కూడా పేమెంట్స్ చేసుకోవచ్చు.

మీ వాహనం మోడల్ అదైతే మాత్రం.. తిరుమలలో నో ఎంట్రీ..

తిరుమలలో వాహనాల మోడల్‌పై ఆంక్షలు విధించారు. తిరుమలతో పాటు.. ఘాట్ రోడ్లపై కాలం చెల్లిన వాహనాలకు అనుమతి నిరాకరించనున్నారు.

గుడ్‌బై చెబుతున్నందుకు చాలా బాధగా ఉంది: నాగ్

నాగార్జున టైటిల్‌ రోల్‌లో నటిస్తున్న చిత్రం ‘వైల్డ్‌డాగ్‌’. ఏసీపీ విజయ్‌ వర్మగా ఈ చిత్రంలో నాగ్ నటిస్తున్నారు.