'బనారస్‌' మిస్టీరియస్ లవ్ స్టొరీ.. కంప్లీట్ ఎంటర్ టైన్ మెంట్ ప్యాకేజీ: చిత్ర యూనిట్

  • IndiaGlitz, [Tuesday,October 11 2022]

కర్ణాటక సీనియర్ రాజకీయ నేత జమీర్ అహ్మద్ కుమారుడు జైద్ ఖాన్, బెల్ బాటమ్ ఫేమ్ జయతీర్థ దర్శకత్వం వహించిన పాన్ ఇండియా ప్రాజెక్ట్ 'బనారస్‌' తో సినీ రంగ ప్రవేశం చేస్తున్నారు. బనారస్ సిటీ (వారణాసి) నేపథ్యంలో సాగే ఆహ్లాదకరమైన ప్రేమకథగా రూపొందుతున్న ఈ చిత్రంలో సోనాల్ మోంటెరో కథానాయికగా నటిస్తోంది. ఎన్‌కె ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తిలకరాజ్ బల్లాల్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న బనారస్ నవంబర్ 4వ తేదీన ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో గ్రాండ్ గా పాన్ ఇండియా విడుదల కానుంది. 'నాంది' సతీష్ వర్మ ఈ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాలలో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం విలేఖరులు సమావేశం హైదరాబాద్ లో నిర్వహించారు.

జైద్ ఖాన్ మాట్లాడుతూ .. తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు మాపై ఎంతో ప్రేమ చూపిస్తున్నారు. మొన్న జరిగిన వైజాగ్ ఈవెంట్ లో మాపై ఎంతో అభిమానం కురిపించారు. ఈ అభిమానం, ప్రేమ నేను ఊహించలేదు. తెలుగు ప్రేక్షకులకు జీవితాంతం రుణపడి వుంటాను. నవంబర్ 4వ 'బనారస్‌' ప్రేక్షకుల ముందుకు వస్తోంది. 'బనారస్‌' మిస్టీరియస్, మెచ్యూర్ లవ్ స్టొరీ. యాక్షన్ కామెడీ థ్రిల్ సస్పెన్స్ ఫ్యామిలీ ఎంటర్ టైన్మెంట్ ఇలా అన్నీ ఎలిమెంట్స్ వుంటాయి. ఇందులో ఒక వినూత్నమైన ప్రయోగం చేశాం. అది ప్రేక్షకుడు గుర్తుపెట్టుకునేలా వుంటుంది. చాలా ఫ్రెష్ కంటెంట్ వున్న సినిమా బనారస్. సినిమాని తెలుగులో విడుదల చేస్తున్న సతీష్ గారికి కృతజ్ఞతలు. నవంబర్ 4వ అందరూ థియేటర్ కి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించాలి'' అని కోరారు.

సోనాల్ మాంటెరో మాట్లాడుతూ.. తెలుగు ప్రేక్షకులు మాకు ఎంతో గొప్పగా ప్రోత్సాహం ఇస్తున్నారు. ముందుకు తెలుగు ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు. ఈ చిత్రంలో ఒక కీలక పాత్ర పోహిస్తున్నాను. అందరికీ కనెక్ట్ అయ్యే పాత్ర ఇది. సతీష్ గారు ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు. నవంబర్ 4న సినిమా విడుదలౌతుంది. మీ అందరి ప్రేమ, అభిమానం కావాలి'' అని కోరారు.

సతీష్ వర్మ మాట్లాడుతూ.. బనారస్ బలమైన కంటెంట్ వున్న చిత్రం. ట్రైలర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నాం. నవంబర్ 4న సినిమా విడుదలౌతుంది. అందరూ థియేటర్ లో సినిమా చూసి ఆదరించాలని కోరారు.

More News

Jr NTR - Nayanthara: కవల పిల్లలకు తల్లైన నయనతార... 12 ఏళ్ల క్రితమే చెప్పిన ఎన్టీఆర్, ఈ ట్విస్ట్ 'అదుర్స్'గా..!!

లేడీ సూపర్‌స్టార్ నయనతార- విఘ్నేష్ శివన్ జంట తల్లీదండ్రులైన సంగతి తెలిసిందే. వీరిద్దరూ పండంటి కవల పిల్లలకు జన్మనిచ్చారు. గాడ్ ఫాదర్ మూవీ సూపర్‌హిట్ కావడం...

కొట్టుకునే వరకు వెళ్లిన రోహిత్ - ఆదిరెడ్డి.... ఈ వారం నామినేషన్స్‌లో 9 మంది

బిగ్‌బాస్‌లో సోమవారం కావడంతో ఇంటి సభ్యులు నామినేషన్లలోకి దిగారు. ఈ వారం మాత్రం ఈ ప్రక్రియ హోరాహోరిగా సాగింది. గడిచిన కొన్ని వారాలుగా సైలెంట్‌గా వుంటోన్న ఆదిరెడ్డి మాత్రం ఈరోజు రెచ్చిపోయాడు.

Jr NTR - Nayanthara : కవల పిల్లలకు తల్లైన నయనతార... 12 ఏళ్ల క్రితమే చెప్పిన ఎన్టీఆర్, ఈ ట్విస్ట్ ‘‘అదుర్స్’’గా..!!

లేడీ సూపర్‌స్టార్ నయనతార- విఘ్నేష్ శివన్ జంట తల్లీదండ్రులైన సంగతి తెలిసిందే. వీరిద్దరూ పండంటి కవల పిల్లలకు జన్మనిచ్చారు.

Nandamuri Balakrishna : కృష్ణంరాజు కుటుంబాన్ని పరామర్శించిన బాలయ్య దంపతులు.. శ్యామలాదేవికి ఓదార్పు

అనారోగ్యంతో మరణించిన దిగ్గజ నటుడు, రెబల్ స్టార్ కృష్ణంరాజు కుటుంబాన్ని హిందూపురం ఎమ్మెల్యే, సినీనటుడు నందమూరి బాలకృష్ణ పరామర్శించారు.

ఆధ్యాత్మిక సౌరభం.. అక్టోబర్ 31 నుంచి నవంబర్ 14 వరకూ భక్తి టీవీ కోటి దీపోత్సవం

అజ్ఞానాంధకారాన్ని తొలగించి, ప్రపంచానికి వెలుగునిచ్చే దీపాన్ని ఆరాధించడమే భారతీయ ఆధ్యాత్మికత గొప్పదనం. భక్తి టీవీ కోటి దీపోత్సవం గురించి తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.