వివాదంపై బండ్ల గణేష్ వివరణ

  • IndiaGlitz, [Saturday,November 25 2017]

నిర్మాత బండ్ల గ‌ణేష్‌, ర‌చ‌యిత‌, ద‌ర్శ‌కుడు వ‌క్కంతం వంశీ మ‌ధ్య టెంప‌ర్ వివాదం రాజుకుంది. పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన టెంప‌ర్ సినిమాకు వ‌క్కంతం వంశీ క‌థ‌ను అందించారు. ఈ సినిమా పెద్ద స‌క్సెస్ కావ‌డంతో నిర్మాత బండ్ల గ‌ణేష్ క‌థ‌ను రోహిత్ శెట్టికి విక్ర‌యించేశాడు. చెక్ బౌన్స్ అయ్యింది. దీనిపై ర‌చ‌యిత వంశీ కోర్టుకెళ్లాడు. కోర్టు వివాదాన్ని ప‌రిశీలించి బండ్ల గ‌ణేష్‌కు ఆరు నెల‌లు జైలు 15 ల‌క్ష‌లు జ‌రిమానా విధించింది. అయితే ష‌ర‌తులతో కూడిన బెయిల్ అప్లై చేసుకుని బండ్ల గ‌ణేష్ బ‌య‌ట‌కు వ‌చ్చేశాడు.

త‌న వివాదంపై ఏం జ‌రిగింద‌నే దానిపై త‌న ట్విట్ట‌ర్ వేదికగా స‌మాధానం ఇచ్చాడు. "2015 'టెంపర్' చిత్రం వివాదం ఇది కోటి నాలుగు లక్షల రూపాయలకు టెంపర్ కథా హక్కులను రచయిత వంశీ నుండి కొనడం జరిగింది.సినిమా సూపర్ హిట్ అయిన తరువాత హిందీ రీమేక్ హక్కులను దర్శక నిర్మాత అయిన రోహిత్ శెట్టికి సంయుక్తంగా విక్రయించాం. కానీ నాకు తెలియకుండా టెంపర్ నవల హక్కులను రచయిత వంశీ మరొకరికి అమ్మాడు. దీనివలన నేను తీవ్ర మనస్తాపానికి లోనై ఇ విషయాన్ని సినీ ఛాంబర్ దృష్టి కి తీసుకు వచ్చాను.అదే సమయం లో 'టెంపర్' చిత్ర కథకి ఇచ్చిన బ్యాలన్స్ డబ్బుల చెక్ ను నిలిపివేశాను. ఈవివాదం ఫిల్మ్ ఛాంబర్ లో ఉన్నప్పటికీ వంశీ చెక్ ను పట్టుకొని కోర్టు కి వెళ్లాడు. నేను కొంత ఉపేక్షించటం వల్ల కోర్టు తీర్పు ఇవ్వటం జరిగింది.అది తెలిసిన నేను కోర్టు ద్వారా బెయిల్ పొందాను ఈ విషయం పై ఉన్నత న్యాయ స్థానానికి అప్పీల్ కు వెళ్తున్నాను రచయిత వంశీ పై నా న్యాయ పోరాటం సాగిస్తాను. 'టెంపర్' సినిమాకు అద్భుతంగా మాటలు రాసి కథను విస్తృత పరిచిన శక్తి ఎవరో,ఏమిటో నాకు నా సినిమా యూనిట్ సినిమా సహాయ రచయితలకు,వంశీ మనసాక్షికి తెలుసు. సినిమా రంగంలో నటులకు,దర్శకుల,సాంకేతిక నిపుణులకు కోట్ల రూపాయలు చెల్లించిన నేను తొమిది లక్షల రూపాయల చెల్లించలేని స్థితి లో లేనా? నా అభిమానులు, ఆత్మీయులు అర్థం చేసుకొనగలరు'' అంటూ బండ్ల గ‌ణేష్ స‌మాధానం చెప్పాడు.

మ‌రి దీనిపై ర‌చ‌యిత, ద‌ర్శ‌కుడు వ‌క్కంతం వంశీ ఎలా రియాక్ట్ అవుతాడో చూద్దాం..

More News

'ఇంద్రసేన' సెన్సార్ పూర్తి

వైవిధ్యమైన సినిమాలతో, వరుస కమర్షియల్ సక్సెస్ లతో తనకంటూ ఓ మార్క్ ను సృష్టించుకున్న హీరో విజయ్ ఆంటోని తాజాగా నటించిన చిత్రం `ఇంద్రసేన`.

చరణ్.. ఆ ఇద్దరితో మూడోసారి?

మెగాపవర్ స్టార్ రామ్చరణ్.. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న రంగస్థలం 1985తో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ సినిమాని వేసవి కానుకగా మార్చి 29న విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.

అజ్ఞాతవాసిలోనూ ఆమె ఉందా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ చిత్రాలలో ఒకటిగా నిలిచింది అత్తారింటికి దారేది. కుటుంబ కథా చిత్రంగా నిరూపొందినఈ సినిమా.. ఇండస్ట్రీ హిట్ అనిపించుకుంది.

చరణ్ మూడోసారి ఒప్పుకుంటాడా?

మెగాపవర్ స్టార్ రామ్చరణ్ తనతో మూడోసారి నటించడానికి రకుల్ ప్రీత్ సింగ్కు అవకాశం ఇస్తాడా?..ఏమో చెప్పలేం అంటున్నారు టాలీవుడ్ జనాలు. వివరాల్లోకెళ్తే..రామ్చరణ్ హీరోగా బోయపాటి దర్శకత్వంలో సినిమా ప్రారంభమైన సంగతి తెలిసిందే.

మహేష్ గుర్తుకొచ్చాడట..

నటి, నిర్మాత, దర్శకురాలిగా రాణిస్తున్న మహేష్ అక్కయ్య మంజుల ఇప్పుడు సిటీ బ్యాక్ డ్రాప్ లో ఓ లవ్ స్టోరిని తెరకెక్కిస్తుంది. ఈ విషయం అందరికీ తెలిసిందే.