బంతిపూల జానకి బావుందంటున్నారు - చిత్ర దర్శకుడు నెల్లుట్ల ప్రవీణ్ చందర్

  • IndiaGlitz, [Saturday,September 03 2016]

చిన్న సినిమాలు రెండు మూడు రోజులు ఆడ‌డ‌మే గగనంగా ఉన్న ప్రస్థుత గడ్డు పరిస్థితుల్లో.. రెండో వారంలోనూ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సందడి చేస్తోంది బంతిపూల జానకి. ఈ చిత్రం సాధిస్తున్న విజయం ఇస్తున్న ఉత్సాహంతో.. సినిమా ప్రారంభంలో టైటిల్స్ వస్తున్నప్పుడు బ్యాక్ గ్రౌండ్ లో ప్లే అయిన బంతిపూల జానకి టైటిల్ సాంగ్ ను.. హీరోయిన్ దీక్షాపంత్, ధన్ రాజ్, అదుర్స్ రఘు, సుడిగాలి సుధీర్, రాకెట్ రాఘవ తదితరులపై ప్రత్యేకంగా చిత్రీకరించి ఈ చిత్రానికి జోడించారు. అంతే కాదు, ఈ పాటతోపాటు కొన్ని హాస్య సన్నివేశాల్ని కూడా జత చేశామని చిత్ర దర్శకుడు నెల్లుట్ల ప్రవీణ్ చందర్ చెబుతున్నారు.

ఉజ్వల క్రియేషన్స్ పతాకంపై రూపొందిన ఈ రొమాంటిక్ కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్ కి కల్యాణి-రామ్-తేజ్ నిర్మాతలు. ఈ చిత్రం విజయం సాధిస్తుండడాన్ని పురస్కరించుకొని చిత్ర దర్శకులు నెల్లుట్ల ప్రవీణ్ చందర్ మాట్లాడుతూ.. దర్శ‌కుడిగా బంతిపూల జానకి నాకు రెండో చిత్రం. హాస్యానికి పెద్ద పీట వేస్తూ రూపొందిన ఈ చిత్రం రెండో వారంలోనూ ఉభయ రాష్ట్రాల్లో విజయవంతంగా ప్రదర్శించబడుతుండడం చాలా సంతోషాన్నిస్తోంది. సినిమాను ఇంత బాగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు, నాకు ఇంత మంచి అవకాశం ఇఛ్చిన మా నిర్మాతలు కళ్యాణి-రామ్-తేజ్ లకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నేను దర్శకత్వం వహించే మూడో చిత్రం వివరాలు త్వరలోనే తెలియజేస్తాను అన్నారు.

More News

రవితేజ మూవీకి ముహుర్తం ఫిక్స్..!

మాస్ రాజా ర‌వితేజ న‌టించిన బెంగాల్ టైగ‌ర్ గ‌త సంవ‌త్సరంలో రిలీజైంది. మంచి విజ‌యాన్ని సాధించింది కానీ...ఇప్ప‌టి వ‌ర‌కు ర‌వితేజ త‌న నెక్ట్స్ మూవీ స్టార్ట్ చేయ‌లేదు. కొన్ని ప్రాజెక్ట్స్ అనుకున్న‌ప్ప‌టికీ కొన్ని కార‌ణాల వ‌ల‌న సెట్స్ పైకి వెళ్ల‌లేదు.

నిర్మ‌లా కాన్వెంట్ ఎక్స్ క్లూజివ్ డీటైల్స్..!

కింగ్‌ నాగార్జున సమర్పణలో హీరో శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ను హీరోగా, శ్రేయా శ‌ర్మ‌ను హీరోయిన్ గా  పరిచయం చేస్తూ రూపొందుతున్న చిత్రం నిర్మ‌లా కాన్వెంట్.

పూరిఇజం ఎక్స్ క్లూజీవ్ డీటైల్స్..!

నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ - డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్లో రూపొందుతున్న భారీ చిత్రం ఇజం. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్ పై నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు.

జో అచ్యుతానంద‌లో గెస్ట్ రోల్ చేస్తున్న యువ హీరో..!

నారా రోహిత్‌, నాగ‌శౌర్య, రెజీనా హీరో హీరోయ‌న్ గా అవ‌స‌రాల శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో వారాహిచ‌ల‌న చిత్రం బ్యాన‌ర్‌పై సాయికొర్ర‌పాటి నిర్మించిన చిత్రం `జ్యో అచ్యుతానంద‌`. ట్ర‌యింగిల్ ల‌వ్ స్టోరీగా రూపొందిన ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ సెప్టెంబ‌ర్ 9న విడుద‌ల కానుంది.

ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 7న మ‌న ఊరి రామాయ‌ణం..!

జాతీయ ఉత్తమనటుడు   ప్రకాష్ రాజ్ స్వీయ దర్శకత్వంలో నటిస్తూ నిర్మించిన‌ ద్విభాషా చిత్రం  మన ఊరి రామాయణం.  ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, ప్రియమణి, సత్యదేవ్, పృథ్వి, రఘుబాబు ప్రధాన పాత్ర‌లు పోషించారు.ఈ చిత్రాన్ని క‌న్న‌డ‌లో  ఇదొల్లె రామాయణ అనే టైటిల్ తో రిలీజ్ చేయ‌నున్నారు.