'సాహో' కంటే ముందుగా..

  • IndiaGlitz, [Wednesday,March 14 2018]

ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో మ‌న క‌థానాయ‌కులంతా ఒక సినిమాలో నటిస్తూనే.. మరో సినిమాను లైన్లో పెట్టేస్తున్నారు. ఆ బాటలోనే.. కింగ్ నాగార్జున నుంచి నిఖిల్ వరకు అందరూ నడుస్తున్నారు. అయితే బాహుబలి'తో జాతీయ స్థాయిలో పేరు సంపాదించుకున్న ప్రభాస్ మాత్రం ఈ విషయంలో కొంత వెనకబడి ఉన్నారని నిన్నటి వరకు వార్తలు వ‌చ్చాయి. ప్రస్తుతం ఈ యంగ్ రెబ‌ల్ స్టార్ కూడా స్పీడ్ పెంచారు. బాహుబలి' సెట్స్ పై ఉన్నప్పుడే దర్శకులు సుజీత్, రాధాకృష్ణల కథలు విన్న ఈ హీరో.. అప్ప‌ట్లోనే వీరితో సినిమాలు చేస్తానని మాటిచ్చారట. అన్నట్టుగానే.. సుజీత్ డైరెక్షన్‌లో సాహో' చిత్రంలో నటిస్తున్నారు.

ఈ ఏడాదిలోనే ఈ చిత్రం విడుదల కావాల్సి ఉండగా.. కొన్ని కారణాల వలన ఈ సినిమా వచ్చే ఏడాది వేసవికి వాయిదా పడింది. దీంతో ప్రభాస్ అభిమానులు నిరాశలో పడిపోయారు. అయితే వారిని ఆనందపరిచేందుకు రాధాకృష్ణతో చేయబోయే సినిమాను ఇప్పుడు తెరపైకి తీసుకొచ్చారు. సాహో'తో పాటు ఈ చిత్రంలో కూడా సమాంతరంగా నటించే ఆలోచనలో ప్రభాస్ ఉన్నారని తెలుస్తోంది. ఇంకా చెప్పాలంటే.. ఈ సినిమాని సాహో' కంటే ముందుగానే అంటే.. 2019 సంక్రాంతి బరిలో దింపాలని కూడా ఈ యంగ్ హీరో ప్లాన్ చేస్తున్నారని సమాచారం. తెలుగుతో పాటు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ రొమాంటిక్ ఎంటర్‌టైన‌ర్‌లో ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటించనున్న‌ విషయం తెలిసిందే.

More News

నాగ చైతన్య.. ఈ ఏడాదంతా బిజీగానే..

వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో ఉన్నారు అక్కినేని వారి నట వారసుడు నాగచైతన్య.

ఆ ఇద్దరిలో ఎవరితో?

డైరెక్టర్ విక్రమ్ కుమార్ కు 'హలో' సినిమా కాస్త బ్రేక్ వేసింది.

విరామమే లేకుండా నాగ్ , నాని చిత్రం

నాగార్జున,నాని కథానాయకులుగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో

మూగవాడిగా నారా రోహిత్

విభిన్న చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేక మార్క్ క్రియేట్ చేసుకున్న హీరో నారా రోహిత్

బెల్లంకొండ శ్రీనివాస్ చిత్రంలో నీల్ నితిన్ ముఖేష్

ఇప్పటివరకూ స్టార్ డైరెక్టర్లతో కలిసి సినిమాలు చేస్తూ కథానాయకుడిగా తన స్టార్ డమ్ ను పెంచుకొన్న బెల్లంకొండ శ్రీనివాస్ మొ