బీరుట్ ఘటన ఎఫెక్ట్.. భాగ్యనగర వాసుల్లో టెన్షన్ టెన్షన్..

  • IndiaGlitz, [Wednesday,August 12 2020]

హైదరాబాద్‌కు అమ్మోనియా నైట్రేట్ టెన్షన్ పట్టుకుంది. కీసర మండలం అంకిరెడ్డి పల్లెకు కంటైనర్స్ చేరుకున్నాయి. లెబనాన్ రాజధాని బీరూట్‌లో జరిగిన భారీ పేలుడుకు కారణమైన అమ్మోనియం నైట్రేట్ రసాయన పదార్థం ఇప్పుడు చెన్నై నుంచి 8 కంటైనర్లలో హైదరాబాద్‌కు చేరుకుంది. లెబనాన్ రాజధాని బీరూట్‌లో జరిగిన పేలుడులో 200 మంది మరణించగా.. వేల సంఖ్యలో ప్రజలు క్షతగాత్రులైన సంగతి తెలిసిందే. నిల్వ ఉంచిన 2700 టన్నుల అమ్మోనియం నైట్రేట్ కారణంగా భారీ ఎత్తున పేలుడు సంభవించింది. అణుబాంబు దాడి తరహాలో విధ్వంసం చోటు చేసుకుంది.

ఈ పరిణామంతో ప్రపంచ దేశాలు ఉలిక్కి పడ్డాయి. తమ దేశాల్లో అమ్మోనియం నైట్రేట్ నిల్వలు ఎక్కడైనా ఉన్నాయా అనే విషయం ఆరా తీస్తున్నాయి. మన దగ్గర సాగర ప్రాంత నగరాలైన చెన్నై, విశాఖల్లో అమ్మోనియం నైట్రేట్ భారీ స్థాయిలో నిల్వ ఉంది. ఐదేళ్ల క్రితం దక్షిణ కొరియా నుంచి దిగుమతి చేసుకున్న 740 టన్నుల అమ్మోనియం నైట్రేట్‌ను చైన్నై సమీపంలోని మనాలిలో ఉన్న టెర్మినల్ వద్ద 37 కంటైనర్లలో నిల్వ ఉంచారు. కానీ గతంలో చెన్నై వరదల సమయంలో 50 టన్నుల మేర అమ్మోనియం నైట్రేట్ నీటిలో, గాల్లో కలిసిపోయినట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు. బీరూట్‌లో జరిగిన భారీ పేలుడుతో చెన్నై కస్టమ్స్ అధికారులు అప్రమత్తమయ్యారు. అక్కడ 37 కంటైనర్లలో అమ్మోనియం నైట్రేట్ ఉండగా.. 10 కంటైనర్లలోని 181 టన్నుల రసాయన మిశ్రమాన్ని హైదరాబాద్ తరలిస్తున్నారు.

భాగ్యనగరానికి చెందిన ఓ సంస్థ ఈ అమ్మోనియం నైట్రేట్‌ను కొనుగోలు చేసింది. పేలుడు స్వభావం ఉన్న అమ్మోనియం నైట్రేట్‌ను హైదరాబాద్ తరలిస్తుండటం పట్ల గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ స్పందించారు. ప్రజల భద్రత విషయమై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. పరిస్థితిని సమీక్షించాలని, ఎప్పటికప్పుడు వివరాలను సేకరించాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు ఆమె ట్వీట్ చేశారు. బీరూట్ ఘటన నేపథ్యంలో చెన్నై నుంచి అమ్మోనియం నైట్రేట్ హైదరాబాద్ వస్తుండటం పట్ల నగరవాసులు కూడా ఆందోళనకు గురవుతున్నారు.

More News

‘నిశ్శ‌బ్దం’ రిలీజ్‌ విష‌యంలో  ప్రేక్ష‌కుల రెస్పాన్స్

లేడీ ఓరియెంటెడ్ చిత్రాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ అయిన అనుష్క శెట్టి లేటెస్ట్ మూవీ ‘నిశ్శబ్దం’.

ఓల్డేజ్... పూరి ఇచ్చిన స‌ల‌హా

డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కొన్ని విషయాలను తన అభిప్రాయాలను చెబుతూ వీడియోలను విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే.

ర‌చ్చ స్టార్ట్ చేసిన శ్రీదేవి అభిమానులు

సోష‌ల్ మీడియా ఇప్పుడు భావ ప్ర‌క‌ట‌న‌కు కీల‌క వేదిక‌గా మారింది.

‘దృశ్యం’ దర్శకుడి పరిస్థితి విషమం..

‘దృశ్యం’ దర్శకుడి పరిస్థితి విషమంగా ఉంది. బాలీవుడ్‌లో ‘దృశ్యం’ చిత్రాన్ని అజయ్ దేవగన్‌తో తెరకెక్కించిన నిషికాంత్ కామత్ తీవ్ర అనారోగ్యం పాలయ్యారు.

సంజ‌య్ ద‌త్‌కు లంగ్స్ క్యాన‌ర్!!

బాలీవుడ్ స్టార్ న‌టుడు సంజ‌య్‌ద‌త్‌కి మూడు రోజుల క్రితం శ్వాస‌కోశ సంబంధిత స‌మ‌స్య‌ల‌తో ముంబైలోని నానావ‌తి హాస్పిట‌ల్‌లో