close
Choose your channels

పాట చిత్రీక‌ర‌ణ‌లో 'భరత్ అనే నేను'

Tuesday, March 13, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సూపర్ స్టార్ మహేష్ బాబు, సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్ కొరటాల శివ కలయికలో తెరకెక్కుతున్న చిత్రం 'భరత్ అనే నేను'. ప్రస్తుతం చిత్రీకరణ చివరిదశలో ఉంది ఈ చిత్రం. ఏప్రిల్ మొదటి వారానికల్లా చిత్రీకరణ మొత్తం పూర్తవుతుందని సమాచారం. ఇచ్చిన మాట నిలబెట్టుకునే ముఖ్యమంత్రి పాత్రలో మహేష్ నటిస్తున్న ఈ పొలిటికల్ థ్రిల్లర్కు సంబంధించిన‌ టీజర్‌ను ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే.

ఆ టీజర్ తెలుగు రాష్ట్రాల్లో మంచి స్పంద‌నే రాబ‌ట్టుకుంది. ఇదిలా ఉంటే.. ప్ర‌స్తుతం మహేష్ బాబు, కైరా అద్వానీపై ఓ రొమాంటిక్ సాంగ్ ను చిత్రీకరిస్తున్నారు. ఈ పాటకు ప్రముఖ కొరియోగ్రాఫర్ రాజు సుందరం డ్యాన్స్ కంపోజ్‌ చేశారు.

కాగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీత సార‌థ్యంలో రూపొందిన ఆడియోను ఈ ఏప్రిల్ 7న వైజాగ్‌లో భారీ ఎత్తున విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. డి.వి.వి.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్న‌ ఈ సినిమా ఏప్రిల్ 20న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.