వచ్చాడయ్యో సామి.. 'భరత్‌ అనే నేను' మూడో పాట విడుదల

  • IndiaGlitz, [Thursday,April 05 2018]

సూపర్‌స్టార్‌ మహేష్‌, సూపర్‌ డైరెక్టర్‌ కొరటాల శివ కాంబినేషన్‌లో శ్రీమతి డి.పార్వతి సమర్పణలో డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై స్టార్‌ ప్రొడ్యూసర్‌ దానయ్య డి.వి.వి. నిర్మిస్తున్న భారీ చిత్రం 'భరత్‌ అనే నేను'. ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.

కాగా, ఈ చిత్రంలోని మొదటి పాటను గురువారం విడుదల చేశారు. 'వచ్చాడయ్యో సామి.. నింగి సుక్కల్తో గొడుగెత్తింది భూమి.. ఇచ్చాడయ్యో సామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ' అంటూ రామజోగయ్యశాస్త్రి రాసిన పాటను కైలాష్‌ ఖేర్‌, దివ్యకుమార్‌ ఆలపించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఏప్రిల్‌ 20న ప్రపంచవ్యాప్తంగా 'భరత్‌ అనే నేను' చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.

సూపర్‌స్టార్‌ మహేష్‌, హీరోయిన్‌ కైరా అద్వాని, ప్రకాష్‌రాజ్‌, శరత్‌కుమార్‌ల తోపాటు ప్రముఖ తారాగణం నటిస్తున్న ఈ చిత్రానికి ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, పాటలు: రామజోగయ్యశాస్త్రి, సినిమాటోగ్రఫీ: రవి కె.చంద్రన్‌, ఎస్‌.తిరునవుక్కరసు, ఎడిటింగ్‌: శ్రీకర్‌ప్రసాద్‌, సమర్పణ: శ్రీమతి డి.పార్వతి, నిర్మాత: దానయ్య డి.వి.వి., దర్శకత్వం: కొరటాల శివ.

More News

తొలి తెలుగు - ఇంగ్లీష్ క్రాస్ ఓవర్ చిత్రంగా 'ఫ్రెండ్స్ ఇన్ లా'

ప్రముఖ సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ అమిత్ ఖన్నా దర్శకత్వం వహించిన 'ఫ్రెండ్స్ ఇన్ లా' తొలి తెలుగు - ఇంగ్లీష్ క్రాస్ ఓవర్ చిత్రంగా మన ముందుకు రాబోతుంది.

'అమ్మ‌మ్మ‌గారిల్లు' శాటిలైట్ రైట్స్

శ్రీమ‌తి స్వ‌ప్న స‌మ‌ర్ప‌ణ‌లో స్వాజిత్ మూవీస్ బ్యాన‌ర్ లో నాగ‌శౌర్య‌, బేబి షామిలి జంట‌గా

'కొత్త కుర్రోడు' ఆడియో విడుద‌ల‌

శ్రీరామ్‌, శ్రీప్రియ హీరో హీరోయిన్లుగా లైట్ ఆఫ్ ల‌వ్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై

ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు క్లాప్ తో ప్రారంభ‌మైన 'మాటే మంత్రము' సీరియ‌ల్

గంగోత్రి స్టూడియోస్ బ్యాన‌ర్ పై ఎస్.ఎస్. రెడ్డి నిర్మిస్తోన్న 'మాటే మంత్ర‌ము' సీరియ‌ల్ గురువారం ఉద‌యం హైద‌రాబాద్ అన్న‌పూర్ణ స్టూడియో లో ప్రారంభ‌మైంది.

'కృష్ణార్జున యుద్ధం' సెన్సార్ పూర్తి

పురాణాల్లో కృష్ణుడు, అర్జునుడు క‌లిసి మ‌హాభార‌త యుద్ధంలో శ‌త్రువుల‌ను జ‌యించారు. ఇప్పుడు మ‌రోసారి కృష్ణ‌, అర్జున్ క‌లిసి ఓ మంచి ప‌ని కోసం వేసే అడుగే మా 'కృష్ణార్జున యుద్ధం' అని అంటున్నారు నిర్మాత‌లు