close
Choose your channels

మంత్రి గంటాకు షాక్.. జనసేనలో చేరిన భాస్కరరావు

Monday, March 18, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు ఊహించని షాక్ తగిలింది. ఆయన సమీప బంధువు అయిన పరచూరి భాస్కరరావు జనసేన తీర్థం పుచ్చుకున్నారు. ఆదివారం సాయంత్రం విజయవాడలోని పార్టీ కార్యాలయంలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సమక్షంలో ఆయన కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా భాస్కర్‌కు కండువా కప్పి సాదరంగా పవన్ సాదరంగా ఆహ్వానించారు. చేరిక అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. పార్టీ బలోపేతానికి శాయశక్తులా పనిచేస్తానన్నారు.

ఇంతకీ ఎవరీ భాస్కరరావు..!?

భాస్కరరావు మంత్రి గంటాకు సమీప బంధువు. ప్రముఖ పారిశ్రామిక వేత్త కూడా. జిల్లాలో ఈయన పేరు తెలియని వారుండరు. అందరికీ ఈయన సుపరిచితమే. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఈయన పలు పదవులు చేపట్టారు. అంతేకాదు.. గంటాకు ఈయన రైట్ హ్యాండ్ అని కూడా చెప్పుకుంటూ ఉంటారు. అలాంటి వ్యక్తి మంత్రికి దూరమవ్వడం గట్టి ఎదురుదెబ్బేనని స్థానికులు చెబుతున్నారు. కాగా భాస్కరరావును విశాఖ జిల్లాలోని ఏదో ఒక నియోజకవర్గం నుంచి జనసేనాని పోటీ చేయిస్తారని తెలుస్తోంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.