కలెక్షన్లలో దూసుకెళ్తున్న‘భీష్మ’...!

  • IndiaGlitz, [Sunday,February 23 2020]

టాలీవుడ్ కుర్ర హీరో నితిన్, రష్మిక మందన్నా నటీనటులుగా వెంకీ కుడుముల తెరకెక్కించిన చిత్రం ‘భీష్మ’ ఇటీవలే రిలీజ్ అయ్యింది. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘భీష్మ’ కలెక్షన్ల పరంగా గట్టిగానే దూసుకెళ్తున్నాడు. వాస్తవానికి సినిమా పోస్టర్లు, లుక్స్, టీజర్లతోనే అంచనాలు పెరిగిపోయాయ్.. అయితే.. ఈ సినిమాను చాలా సీరియస్‌గా తీసుకున్న నితిన్.. అనుకున్నట్లుగానే సక్సెస్ అయ్యాడని చెప్పుకోవచ్చు.

తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజు ఈ చిత్రం రూ.6.30 కోట్ల షేర్ వసూలు చేయడం విశేషమని చెప్పుకోవచ్చు. రెండో రోజూ కూడా మంచి కలెక్షన్లనే రాబట్టింది రెండో రోజూ తెలుగు రాష్ట్రాల్లో రూ.4.20 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ వసూలు చేసింది. ప్రస్తుతం సినిమాలేమీ లేకపోవడం భీష్మకు కలిసొచ్చింది. రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ‘భీష్మ’ వసూలు చేసిన షేర్ మొత్తం రూ.10.50 కోట్లు.

రెండో రోజు కలెక్షన్స్ ఇలా..!
నైజాం - రూ. 4.1 కోట్లు
సీడెడ్ - రూ. 1.52 కోట్లు
ఉత్తరాంధ్ర - రూ. 1.20 కోట్లు
గుంటూరు - రూ. 1.02 కోట్లు
తూర్పు గోదావరి - రూ. 92 లక్షలు
పశ్చిమ గోదావరి - రూ. 72 లక్షలు
నెల్లూరు - రూ. 37 లక్షలు
ఏపీ, టీఎస్ మొత్తం - రూ. 10.52 కోట్లు.

మొత్తానికి చూస్తే.. నితిన్ చాలా కాలం తరవాత ఒక మంచి హిట్ అందుకున్నాడని చెప్పుకోవచ్చు.

More News

'మీనా బజార్'., చిత్రం మార్చి లో విడుదల !!!

ఇటీవల సినీ రాజకీయల సమక్షంలో www. మీనా బజార్., ఆడియో లాంచ్ కార్యక్రమం ఫిబ్రవరి 6న హైదరాబాద్ లో జరిగింది.

'జాను' తో శ‌ర్వాకి స‌మ‌స్యా?

రీసెంట్‌గా శ‌ర్వానంద్‌, స‌మంత క‌లిసి న‌టించిన `జాను`. త‌మిళంలో విజ‌య‌వంత‌మైన `96`కి ఇది రీమేక్‌.

సినిమా ప్లాప్‌కి విజ‌య్ దేవ‌ర‌కొండ కార‌ణ‌మంటున్న డైరెక్ట‌ర్‌!!

సినిమా మేకింగ్ స‌మ‌యంలో అన్నీ స‌రిగ్గానే ఉంటాయి. హిట్ అయితే అంద‌రూ దాని ఫ‌లితాన్ని పొందాల‌నుకుంటారు.

ట్రంప్‌ పర్యటనకు కోటి మంది.. ఆర్జీవీ ఐడియా!

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్‌లో పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 24న అమెరికా అధ్యక్షుడి తొలి భారత పర్యటన ప్రారంభం కానుంది.

ట్రంప్‌తో విందుకు కేసీఆర్.. ప్రత్యేక ఆహ్వానం!

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్‌లో పర్యటించనున్న సంగతి తెలిసిందే. పర్యటనలో భాగంగా..