లోకేష్‌కు రాఖీ కట్టిన ఊహించని వ్యక్తి!!

  • IndiaGlitz, [Thursday,August 15 2019]

అన్నా చెల్లెళ్లు, అక్కాత‌మ్ముళ్ల మ‌ధ్య ఉండే ఆత్మీయ అనుబంధాన్ని గుర్తు చేసుకునే పవిత్రమైన రోజు రాఖీ పౌర్ణమి. ఈ రోజున అక్కలు, చెల్లెళ్లు త‌మ సోద‌రుల‌కు రాఖీల‌ను క‌ట్టి త‌మ‌కు ర‌క్షగా ఉండ‌మ‌ని కోరుకుంటారు. ఈ దేశంలో పేద‌, ధ‌నిక‌, కుల‌, మ‌త, వ‌ర్ణ వైష‌మ్యాలు లేకుండా ప్రతి ఒక్కరు ఈ రాఖీ పండుగ‌ను జ‌రుపుకుంటారు. తమకు రాఖీలు కట్టిన అక్కలు, చెల్లెళ్లకు అన్నదమ్ములు బహుమతులు ఇచ్చి సంతోషపెడుతుంటారు.

ఇక అసలు విషయానికొస్తే.. టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు ఎమ్మెల్సీ నారా లోకేశ్‌కు ఊహించని వ్యక్తి రాఖీ కట్టారు. గురువారం సాయంత్రం టీడీపీ మహిళా నేత భూమా అఖిల ప్రియ.. లోకేశ్ రాఖీ కట్టారు. అనంతరం లోకేశ్ ఆశీర్వాదం ఆమె తీసుకున్నారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా కుటుంబ సమేతంగా లోకేశ్ ఇంటికెళ్లిన భూమా అఖిల ప్రియ.. రాఖీ కట్టి.. అన్నయ్య ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ విషయాన్ని నారా లోకేశ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా పంచుకున్నారు.

లోకేశ్ ట్వీట్ సారాంశం ఇదీ...

థాంక్యూ అఖిలప్రియా. నీలాంటి సోదరి ఉండటం నాకు నిజంగా అదృష్టమే. రాఖీ పండుగ శుభాకాంక్షలు’ అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు అఖిలప్రియ తనకు రాఖీ కడుతున్న, స్వీట్ తినిపిస్తున్న ఫొటోలను లోకేశ్ పోస్ట్ చేశారు.

అఖిల రిప్లై...

‘మీరు ఎల్లప్పుడూ నాకు సపోర్ట్ చేశారు.. నన్ను రక్షణగా ఉంటూ వచ్చారు. మీకు ధన్యవాదాలు.. థ్యాంక్స్ చెప్పడం చాలా తక్కువే. మీరు నాకు ఎల్లప్పుడు పెద్ద అన్నయ్యలా ఉండిపోతారు అని భూమా అఖిల ప్రియా రిప్లై ఇచ్చారు. అంతేకాదు.. ఈమె కామెంట్‌కు స్పందించిన వారికి కూడా రిప్లై ఇస్తూ వచ్చారు.