ప్రభాస్ ‘సలార్’కు కళ్లు చెదిరే ఆఫర్స్..

  • IndiaGlitz, [Friday,March 05 2021]

‘కేజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘సలార్’. ఈ సినిమాలో హీరోయిన్‌గా శ్రుతి హాసన్ నటిస్తోంది. ఈ సినిమా ఏకకాలంలో తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో తెరకెక్కుతోంది. రవి బస్రూర్‌ ‘సలార్‌’కు సంగీతం అందిస్తున్నారు. ‘కేజీయఫ్‌’తో డైరెక్టర్‌గా సత్తా నిరూపించుకున్న ప్రశాంత్‌నీల్‌ సారథ్యంలో ‘బాహుబలి’తో ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్‌ హీరోగా వస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి.

‘కేజీఎఫ్’ను నిర్మించిన హోంబలే ఫిలిమ్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. అయితే ఈ సినిమా గురించి ఇంట్రస్టింగ్ అప్‌డేట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సినిమా విడుదలకు ఏడాదికి పైగానే సమయం ఉన్నప్పటికీ బిజినెస్ మాత్రం ఓ రేంజ్‌లో సాగుతోందట. ఈ సినిమాకు ఓటీటీ సంస్థల నుంచి కళ్లు చెదిరే ఆఫర్స్ వస్తున్నాయని సమాచారం. ఈ సినిమా రూ.150కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతోంది. అయితే ఈ సినిమా డిజిటల్ హక్కులు భారీ రేటుతో దక్కించుకునేందుకు పలు సంస్థలు పోటీ పడుతున్నాయని సమాచారం.

ముఖ్యంగా ఈ సినిమా అన్ని భాషల డిజిటల్ హక్కుల కోసం ప్రముఖ ఓటీటీ సంస్థ అమేజాన్ ప్రైమ్ వీడియోస్ ప్రయత్నిస్తోందట. ఏకంగా వంద కోట్ల రూపాయల ఇస్తామని ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్స్ సినిమాలకు కూడా అమేజాన్ నుంచి ఈ రేంజ్ ఆఫర్ ఇప్పటివరకు రాలేదు. ప్రభాస్‌ ‘బాహుబలి’తో నేషనల్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకోవడంతో.. ఆయనకు అంతర్జాతీయ స్థాయిలో కూడా అభిమానులున్నారు. అందుకే 'సలార్' కోసం అంత మొత్తం వెచ్చించేందుకు అమేజాన్ సిద్ధపడుతోందట. కాగా.. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

More News

‘సారంగదరియా’ గురించి ‘రేలారే రేలా’లో పాడిన కోమల ఏం చెప్పిందంటే..

ప్రస్తుతం యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న పాట ‘సారంగదరియా’. ఇప్పటికీ ఈ సాంగ్ యూట్యూబ్ ట్రెండింగ్‌లో ఉంది.

‘ఆచార్య’లో కేవలం 15 నిమిషాల కోసం పూజా షాకింగ్ రెమ్యునరేషన్..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘ఆచార్య’. మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్‌ను రూపొందిస్తూ తన ప్రతి సినిమాను బ్లాక్ బస్టర్ హిట్ వైపు నడిపించిన కొరటాల శివ

ఆడియెన్స్‌కు క‌నెక్ట్ అవుతుంది, కాక‌పోవ‌చ్చు అయితే.. రాజ్ తరుణ్

యంగ్ హీరో రాజ్ త‌రుణ్, కొండా విజ‌య్ కుమార్‌ల‌ స‌క్సెస్‌ఫుల్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన చిత్రం ‘పవర్ ప్లే’.

కేరళ బీజేపీ అభ్యర్థిగా మెట్రో మ్యాన్ శ్రీధరన్

ఇటీవల మెట్రో మ్యాన్ శ్రీధరన్ బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ఆయనకు బీజేపీ బంపర్ ఆఫర్ ఇచ్చింది.

సుశాంత్‌ని చంపినట్టు చంపేస్తారు: కంగన

బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ ఎంత ధైర్యంగా బోల్డ్‌గా తన అభిప్రాయాలను వెల్లడిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.