వరుస మర్డర్లతో చెలరేగిన అఖిల్.. ఇరిటేట్ అయిన సొహైల్..
Send us your feedback to audioarticles@vaarta.com
ఇవాళ షో మొత్తం నామినేషన్ టాస్క్తోనే గడిచిపోయింది. ఈ వారం కూడా ఏడుగురు నామినేట్ అయ్యారు. మంచి జోష్ ఉన్న సాంగ్తో షో స్టార్ట్ అయింది. మార్నింగ్ మస్తీలో నవరసాలను ప్రదర్శించాలి. మొదట స్వాతి శృంగారంతో పాటు క్రోథం చేసి చూపించింది. స్వాతి జీవించేసింది. ఇక ప్రోమోలో చూపించిన లాస్య, నోయెల్ల మధ్య గొడవ. ఇది టాస్క్లో భాగంగా వారిద్దరూ నటించి చూపించారు. ఇక గంగవ్వ, అవినాష్ల బీభత్సం పీక్స్. మెహబూబ్, దివిల మధ్య నామినేషన్ గురించి కాన్వర్సేషన్. మరోవైపు అవినాష్, అరియానాల ఫన్నీ కాన్వర్సేషన్. ఇక అవినాష్.. తన వేలుకి దెబ్బతగిలిందంటూ బాగా నవ్వించేశాడు. సొహైల్, అఖిల్లకు బిగ్బాస్ ఓ డ్రస్ను పంపించారు. మనుషులు-రోబో టాస్క్లో భాగంగా అమ్మ రాజశేఖర్ని అవినాష్ కొట్టిన దెబ్బ ఇంకా మరచిపోలేదనుకుంటా. సొహైల్ షేక్ హ్యాండ్ ఇవ్వమంటే నేను ఎవ్వరినీ నమ్మనంటూ భయపడి పారిపోయారు.
నామినేషన్స్ టాస్క్ ప్రారంభమైంది. బజర్ మోగినప్పుడల్లా కంటెస్టెంట్లు పరుగెత్తుకెళ్లాలి. మొదట ఎవరు పరిగెడితే వాళ్లకు మరొకరిని నామినేట్ చేసే ఛాన్స్ ఉంటుంది. అయితే మొదటి ఐదుగురికి మాత్రమే ఈ అవకాశం. ఇక రూమ్లో ఉన్న సొహైల్, అఖిల్ కిల్లర్స్. కంటెస్టెంట్లు వచ్చి ఎవరి పేరు చెబితే వారిని సొహైల్, అఖిల్లలో ఒకరు టేబుల్పై ఉన్న గన్ను అందుకుని వెళ్లి మర్డర్ చేసి రావాలి. మర్డర్ చేసిన వారికి నామినేట్ చేసిన కంటెస్టెంట్ రూ.10 వేలు ఇస్తారు. మొదటగా డెన్లోకి అమ్మ రాజశేఖర్ వచ్చారు. రియల్గా లేదని స్వాతిని నామినేట్ చేస్తున్నట్టు అమ్మ రాజశేఖర్ తెలిపారు. నన్ను దేవత అని నామినేట్ చేస్తావా? అని అమ్మ రాజేశేఖర్ని స్వాతి అడిగింది. నెక్ట్స్ వచ్చిన మెహబూబ్.. అభిని నామినేట్ చేశాడు. అరియానా.. లాస్యని నామినేట్ చేసింది. వరుస మర్డర్లతో అఖిల్ చెలరేగిపోతుంటే.. సొహైల్ బాగా ఇరిటేట్ అయ్యాడు. నెక్ట్స్ వచ్చిన హారిక.. మెహబూబ్ని నామినేట్ చేసింది. నెక్ట్స్ వచ్చిన సుజాత.. కుమార్ సాయిని నామినేట్ చేసింది.
నాలుసార్లు అఖిల్ మర్డర్ చేయగా.. ఒకసారి మాత్రమే సొహైల్ మర్డర్ చేయగలిగాడు. అఖిల్ డబ్బును సొహైల్ కొంత కొట్టేశాడు. అయినా కూడా తన దగ్గర ఎక్కువ డబ్బున్న కారణంగా అఖిల్ సేఫ్ అయ్యాడు. తక్కువ డబ్బున్న కారణంగా సొహైల్ నామినేట్ అయ్యాడు. అఖిల్ దగ్గర ఎక్కువ డబ్బున్నందున ఒకరిని నామినేట్ చేసే అవకాశం ఉందని బిగ్బాస్ చెప్పడంతో హారికను నామినేట్ చేశాడు. దీంతో ఈ వారం స్వాతి, అభిజిత్, లాస్య మెహబూబ్, కుమార్, సొహైల్, హారిక నామినేట్ అయ్యారు. సొహైల్, మెహబూబ్ కాన్వర్సేషన్.. మాస్టర్ కాకపోతే వేరొకరు స్వాతిని నామినేట్ చేసి ఉండేవారని.. ఇక స్వాతి.. అభి కాన్వర్సేషన్.. వన్ వీక్ చూశాక నామినేట్ చేయాలి కానీ రెండు రోజులకే నామినేట్ చేయడమేంటని తెగ ఫీలైపోయింది. మొత్తంగా స్వాతి రాకతో ట్రయాంగిల్కి ఫుల్స్టాప్ పడినట్టేనని తెలుస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.