close
Choose your channels

దొంగల హౌస్‌గా మారిన బిగ్‌బాస్ హౌస్.. అంతా రచ్చ రచ్చే..

Thursday, October 1, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

దొంగల హౌస్‌గా మారిన బిగ్‌బాస్ హౌస్.. అంతా రచ్చ రచ్చే..

ఇవాళంతా కిల్లర్ కాయిన్స్ టాస్క్‌తోనే షో మొత్తం నడిచింది. షో స్టార్టింగ్ స్టార్టింగే సొహైల్‌కి అమ్మ రాజశేఖర్‌కు మధ్య రచ్చ. కుమార్ సాయి నుంచి దివి కొట్టేసిన కాయిన్స్ అన్నీ తిరిగి ఇచ్చేసింది. హారిక తన ఇంగ్లీష్‌కి బాగా పదును పెట్టేసింది. బిగ్‌బాస్ వద్దని చెప్పినా కూడా ఇంగ్లీష్ మధ్యలో తెలుగు పదాలను వాడుతూ అభితో మీటింగ్ పెట్టింది. అసలు ఇది తెలుగు షోనా? ఇంగ్లీష్ షోనా? అన్న డౌట్ వచ్చింది హారిక, అభి కాన్వర్సేషన్ వింటున్నంత సేపు. బిగ్‌బాస్ కూడా వార్న్ చేయకపోవడం విచిత్రంగా అనిపించింది. అందరూ పొందిన వాటిలో ఒక స్విచ్ కాయిన్ ఉందని.. దానికో ప్రత్యేకత ఉందని బిగ్‌బాస్ సూచించారు. గేమ్ పూర్తయ్యాక ఆ కాయిన్ ఉన్న వారికి ఒక బంపర్ ఆఫర్ ఉంటుందని తెలిపారు. అయితే దానిపై స్విచ్ అని ఉండటంతో మెహబూబ్ వదిలేశాడు. దానిని సుజాత తీసుకుంది. దీంతో మెహబూబ్‌కి సొహైల్ క్లాస్ పీకాడు.

ఆ తరువాత అంతా నిద్ర పోతుంటే అమ్మ రాజశేఖర్ దాచుకున్న కాయిన్స్‌ను సొహైల్, లాస్య, అరియానా కొట్టేసి పంచుకున్నారు. అమ్మ రాజశేఖర్‌ని నాగ్.. అమాయకపు రాజశేఖర్ అని సరదాగా అన్నారు. ఇవాళ నాగ్ పెట్టిన పేరుకి ఆయన సార్ధకత చేకూర్చినట్టు అనిపించింది. మరింత బ మెహబూబ్ లోపలివి కొట్టేస్తుంటే.. బయట హారిక మెహబూబ్‌వి కొట్టేసింది. ఇక కుమార్ సాయి గాఢ నిద్రలో ఉండగా సొహైల్ వెళ్లి కుమార్ సాయి కాయిన్స్‌ను తెలివిగా కొట్టేయడానికి ట్రై చేశాడు. ఇంతలో కుమార్ సాయి లేచాడు. నైట్ అంతా దొంగతనాల పర్వం జరుగుతూనే ఉంది. నైట్ మొత్తం మెహబూబ్, సొహైల్‌ల కాయిన్‌ల వేట జరుగుతూనే ఉంది. తన కాయిన్స్ కొట్టేశారని సుజాత గొడవకు దిగింది. అంతా సాంగ్‌కి డ్యాన్స్ చేస్తుంటే అమ్మ రాజశేఖర్ తన కాయిన్స్ పోయిన విషయాన్ని తెలుసుకుని అవాక్కయ్యాడు. మొత్తం కాయిన్స్ ఎలా తీసుకుంటారని అమ్మ రాజశేఖర్ సొహైల్‌ని నిలదీశాడు. ఇక అమ్మ రాజశేఖర్, కుమార్ సాయిల మధ్య వాగ్వాదం. బ్రాండ్‌లపై బట్టలు ఆరేస్తున్నారని వాటిని వెంటనే తొలగించాలని బిగ్‌బాస్ చెప్పారు. దీంతో సొహైల్, మెహబూబ్‌లపై హౌస్‌మేట్స్ కొందరు గొడవకు దిగారు.

దొంగల హౌస్‌గా మారిన బిగ్‌బాస్ హౌస్.. అంతా రచ్చ రచ్చే..

సొహైల్, మెహబూబ్‌లు కాయిన్స్‌ని బట్టల కింద దాచుకున్నారని అవన్నీ తీసేయాలని పేర్కొన్నారు. సొహైల్, మెహబూబ్‌లకు అఖిల్, గంగవ్వ అండగా నిలిచారు. కిల్లర్ కాయిన్స్ టాస్క్ మొదటి లెవల్ పూర్తయిందని బిగ్‌బాస్ తెలిపారు. ఇక అభి, అమ్మ రాజశేఖర్‌ల మధ్య చర్చ. అందరికంటే ఎక్కువగా మెహబూబ్ కాయిన్స్ కలెక్ట్ చేశాడు. కాయిన్ టాస్క్ రెండవ లెవల్ ప్రారంభమైంది. రెండవ లెవల్‌లో దివి సొహైల్‌ని టార్గెట్ చేసింది. దీంతో సొహైల్ సీరియస్ అయ్యాడు. అమ్మ రాజశేఖర్‌ మధ్యలోకి రావడంతో ఇష్యూ మరింత సీరియస్ అయింది. మొదటగా మోనాల్ అవుట్ అయింది. ఆటలో అవినాష్ కాలు బెణికింది. అవినాష్‌ను మెడికల్ రూమ్‌కి తీసుకెళ్లారు. లాస్య వాళ్లు నా దగ్గర నుంచి చాలా కాయిన్స్ కొట్టేశారంటూ హిందీలో బాధపడింది. బిగ్‌బాస్ తెలుగులో మాట్లాడమంటే.. ఈ సమయంలో నేను తెలుగులో మాట్లాడలేనని మోనాల్ బాగా ఎమోషనల్ అయింది. తన చేతికి తగిలిన గాయాన్ని చూపించి ఇది గేమంటే అంటూ బాధ పడటమే కాదు. వాష్‌రూమ్‌లోకి వెళ్లి బాగా బాధపడటం కాస్త టచింగ్‌గా అనిపించింది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.