అమ్మ చాక్లెట్ రచ్చ.. హారికపై అభి ఫైర్

నిన్నటి బేబి డే కేర్ టాస్క్ ఇవాళ కూడా కంటిన్యూ అయింది. హారిక చాక్లెట్స్‌ను కొట్టేసింది. దీంతో అమ్మ రాజశేఖర్ బాగా హర్ట్ అయ్యారు. ఇంక నేను ఆడనని తేల్చేశారు. అయితే ఎవరు చెప్పినా హారిక వినలేదు. సేఫ్‌గా పెట్టుకున్నారు కాబట్టి.. అవినాష్, మెహబూబ్, అరియానా చాక్లెట్స్‌ను కొట్టేయలేకపోయానని చెప్పింది. తరువాత లాస్య మరోసారి గేమ్ రూల్స్ చదివి వినిపించింది. దానిలో చాక్లెట్స్‌ను కాపాడుకోవాలని ఉంది. దీంతో మోనాల్ వెళ్లి ఇదే విషయాన్ని అమ్మ రాజశేఖర్ చెప్పేందుకు ట్రై చేస్తే ఆయన అసలు వినిపించుకోలేదు. అమ్మ చాక్లెట్ గొడవ ఓ రేంజ్‌కు వెళ్లిపోయింది. తనకు నెగిటివ్‌గా ఏం జరిగినా ఆయన తీసుకోలేరని మరోసారి నిరూపించారు. చాక్లెట్ లాక్కొన్నాక అమ్మ రాజశేఖర్ మెడ వెనుక భాగంలో హారికను పట్టుకున్నారని.. అది ఎంత వరకూ కరెక్ట్ అనేది తెలియదని అభి.. లాస్య, నోయెల్‌కు చెప్పాడు.

ఈ ముగ్గురి మధ్య చాక్లెట్ రచ్చపై చర్చ జరిగింది. ఈ చర్చలోకి అమ్మ రాజశేఖర్, మోనాల్, హారిక వచ్చారు. చర్చలో భాగంగా అభి, హారికల మధ్య సీరియస్‌గా చర్చ జరిగింది. నేనేమైనా బేకార్‌ గాడినా అంటూ అభి హారికపై ఫైర్ అయ్యాడు. ఒక్కోసారి ఒక్కోలా హారిక మాట్లాడుతోందని అభి.. లాస్యకు చెప్పాడు. గొడవ ఎంతకూ తెగకపోవడంతో హారిక అక్కడ నుంచి వెళ్లిపోయింది. తరువాత హారిక.. అమ్మ రాజశేఖర్ దగ్గరకు వెళ్లి తాను తీసుకున్న చాక్లెట్‌ను తిరిగి ఇచ్చేసింది. వెయిట్ చేస్తే మనకు ఏ విషయంలోనైనా క్లారిటీ వచ్చేస్తుందని దానికి ఓ పులి స్టోరీని మెహబూబ్‌కి అభి చెప్పాడు. ఈ విషయం తనకు మోనాల్‌తో ఇష్యూ తరువాత తెలిసిందని చెప్పాడు. ఇక హారిక అందరూ నిద్ర పోతుంటే చాక్లెట్స్ దొంగతనం స్టార్ట్ చేసింది. ఇంతకీ హారిక దొంగతనం చేసిన చాక్లెట్స్ లాస్యవి. నిజానికి కెమెరాకు కారణం చెప్పి మాత్రమే లాస్య ఇవ్వాలి. వాటిని దొంగతనం చేసినా అవి కౌంట్ అవ్వవు.

అరియానా ఐలవ్యూ.. మనం బెస్ట్ ఫ్రెండ్స్ కదా అని మెహబూబ్ చెప్పాడు. నోయెల్‌కి ఆరోగ్యం బాగాలేనందున అవినాష్‌కి అభి కేర్ టేకర్‌గా మారిపోయాడు. తరువాత ఇచ్చిన టాస్క్‌ని అఖిల్ విన్ అయ్యాడు. బీబీ డే కేర్ టాస్క్ నుంచి విన్నర్ జోడిని ఎంపిక చేసి చెప్పాలని లాస్యకు బిగ్‌బాస్ చెప్పారు. దీనికి రీజనబుల్ కారణాన్ని కూడా లాస్య చెప్పింది. మాస్టర్ గురించి లాస్య, అవినాష్, నోయెల్ మధ్య చర్చ. ఆయన కొంచెం ఫీలైనా డైరెక్టుగా కేరెక్టర్ మీదకు వెళ్లిపోతారని అలా చేయవద్దని చెప్పినా వినరని నోయెల్ చెప్పాడు. పారగాన్ ఫుట్‌వేర్ టాస్క్. పారగాన్ ఫుట్‌వేర్ నుంచి ఒక పెయిర్ ఇచ్చి దానికి ఒక కారణాన్ని చెప్పాలి. ఈ షూస్‌ను హారిక.. నోయెల్‌‌లు ఒకరికొకరికి మోనాల్.. అఖిల్.. ఒకరికొకరికి.. సొహైల్, మెహబూబ్ ఒకరికొకరికి.. అరియానా, అవినాష్‌లు ఒకరికొకరికి.. అభి, లాస్యలు ఒకరికొకరికి ఇచ్చుకున్నారు. ఇక బేబి డే కేర్ టాస్క్‌లో గెలిచిన వారికి గిఫ్ట్‌గా మటన్, చాక్లెట్స్ పంపించారు. మటన్ విషయంలో అవినాష్, సొహైల్‌ల మధ్య ఫన్నీ గొడవ. ఇక రేపు కెప్టెన్సీ టాస్క్. గతంలో ఎప్పుడూ చూడని వెరైటీ టాస్క్ ఏదో దీని కోసం డిజైన్ చేసినట్టు ప్రోమోని బట్టి తెలుస్తోంది.

More News

బిహార్ తొలిదశ అసెంబ్లీ ఎన్నికల్లో 53.54 శాతం ఓటింగ్

బిహార్ అసెంబ్లీ ఎన్నికలు నేడు ప్రారంభమయ్యాయి. నేడు మొదటి దశ పోలింగ్‌ జరిగింది. ఈ పోలింగ్‌లో 53.54 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల కమిషన్ వెల్లడించింది.

నన్ను నేను అద్దంలో చూసుకుని కుప్పకూలిపోయా: అవికా

'చిన్నారి పెళ్లికూతురు' సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అవికా గోర్ అనంతరం ‘ఉయ్యాల జంపాల’ సినిమా ద్వారా టాలీవుడ్‌కు హరోయిన్‌గా పరిచయమైంది.

బిగ్‌బాస్ ఫేమ్ పునర్నవికి ఎంగేజ్‌మెంట్ అయిపోయింది

బిగ్‌బాస్ ఫేమ్ పునర్నవి భూపాలంకి ఎంగేజ్‌మెంట్ అయిపోయింది. ఇన్‌స్టాగ్రాం వేదికగా ఆమె ఈ విషయాన్ని వెల్లడించింది. ఎంగేజ్‌మెంజ్ రింగ్‌తో ఉన్న ఓ పిక్‌ను ఆమె ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.

రక్షించాలంటూ సీఎంకు ప్రముఖ దర్శకుడి మొర

తన జీవితం ప్రమాదంలో ఉందని రక్షించాలంటూ ఏకంగా ముఖ్యమంత్రికి ప్రముఖ దర్శకుడు మొరపెట్టుకోవడం సంచలనంగా మారింది. ఆయన మరెవరో కాదు.. జాతీయ అవార్డు గ్రహీత అయిన శీను రామస్వామి.

గొర్రెకుంట హత్య కేసుల నిందితుడికి ఉరిశిక్ష ఖరారు

తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన గొర్రెకుంట తొమ్మిది మంది హత్య కేసులో న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. నిందితుడు సంజయ్ కుమార్ యాదవ్‌కు ఉరిశిక్ష విధిస్తూ వరంగల్