కళ్లు చెదిరే రేటింగ్‌తో దూసుకుపోతున్న బిగ్‌బాస్ 4

  • IndiaGlitz, [Thursday,September 17 2020]

బిగ్‌బాస్ సీజన్ 4 వైభవంగా ప్రారంభమైంది. ఇప్పటికే ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చేసింది. గురువారం మరో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుందని తెలుస్తోంది. మొదట్లో అంతలా ఆకట్టుకోని ఈ షో తరువాత తర్వాత మాత్రం ప్రేక్షకులను బాగా చేరువైంది. తాజాగా దీనికి షాకింగ్ రేటింగ్ వచ్చింది. ఇంతకు ముందెన్నడూ లేని విధంగా 18.5 రేటింగ్‌తో బిగ్‌బాస్ షో దూసుకు పోతోంది. మొదట్లో కంటెస్టెంట్లు గేమ్‌ను అర్థం చేసుకోలేదో లేదంటే హౌస్‌లో ఇమిడేందుకు టైమ్ తీసుకున్నారో గానీ.. ఎవ్వరూ అంతగా హైలైట్ అవలేదనే చెప్పాలి.

రెండవ వారానికి వచ్చే వరకూ గేమ్ స్ట్రాటజీలన్నీ మెల్లగా బయటకు వస్తున్నాయి. ఒక్క గంగవ్వ.. కాస్త కరాటే కల్యాణి మినహా ఎవరి గేమ్ ప్లాన్‌తో వారు దూసుకుపోతున్నారు. కెమెరాల ఎదుట హైలైట్ అయ్యేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ప్రస్తుతం కెప్టెన్‌గా ఉన్న లాస్య తొలివారంలో పెద్దగా పెర్ఫార్మ్ చేయలేదు. ప్రస్తుతం కెప్టెన్‌గా ఆర్డర్స్ పాస్ చేయడం.. ఎవరైనా ఏదైనా అడిగితే ధీటుగా సమాధానమివ్వడం వంటివి బాగా చేసుకుపోతోంది. ఇక అభి, మొనాల్, అఖిల్ ఎవరికి వారే బాగా ఫోకస్ అవుతున్నారు. దివి కూడా వారాంతానికి వచ్చే సరికి కంటెస్టెంట్లందరి గురించి చెప్పి అదరగొట్టేసింది.

నిన్న మొన్నటి వరకూ సైలెంట్‌గా ఉన్న కండల వీరుడు మెహబూబ్.. రెండో వారానికి వచ్చే సరికి తన పెర్ఫార్మెన్స్‌లతో మెస్మరైజ్ చేస్తున్నాడు. కరాటే కల్యాణి ఓ టాస్క్‌లో అత్తగా నటించి రాక్ చేసేశారు. ఆ రోజుతో ఆమె గ్రాఫ్ ఎక్కడికో వెళ్లి ఉంటుంది. ఇక దేత్తడి హారిక.. షోని బాగా అర్థం చేసుకుందనే చెప్పాలి. ఎలా ఉంటే ఫోకస్ అవుతుందో తెలుసుకుని మరీ అడుగులేస్తోంది. అమ్మ రాజశేఖర్, నోయెల్, సొహైల్ తదితరులంతా గేమ్ ప్లాన్‌ని బాగానే అమలు చేస్తున్నారు. ఏది ఏమైనా రెండో వారానికి హైలైట్.. మన పారు, దేవదాసులే. ఈ ముగ్గురూ షోని నడుపుతున్నారనడంలో ఆశ్చర్యంలో లేదు. ఇక ఈ షో మున్ముందు ఎలా ఉండబోతోందో చూడాలి.

More News

కరోనా వైరస్ వూహాన్ ల్యాబ్‌‌లో తయారైందన్న డాక్టర్ లీకి షాక్..

కరోనా వైరస్ వూహాన్‌ ల్యాబ్‌లో తయారైందంటూ హాంకాంగ్‌కు చెందిన ప్రముఖ వైరాలజిస్టు డాక్టర్ లి మెంగ్‌ యాన్‌ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

కనకదుర్గ ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవం మరోసారి వాయిదా

విజయవాడ నగర వాసుల ఎన్నో ఏళ్ల కల సాకారమైంది. కనకదుర్గ ఫ్లై ఓవర్ నగరానికే ఒక మణిహారంలా నిలవబోతోంది.

దర్శకుడు ఎన్. శంకర్ చేతుల మీదుగా తెరవెనుక ఫస్ట్ లుక్ విడుదల

ఆయుష్ క్రియేషన్స్ పతాకంపై విజయలక్ష్మి మురళి మచ్చ సమర్పణలో మురళి జగన్నాథ్ మచ్చ నిర్మాతగా రూపుదిద్దుకున్న చిత్రం " తెరవెనుక "

తెలంగాణలో ఆసక్తికర పరిణామం.. భట్టి ఇంటికి తలసాని..

తెలంగాణలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఇంటికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్..

డ్రగ్స్ కేసు విషయమై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన రకుల్..

బాలీవుడ్ డ్రగ్స్ కేసులో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పేరు కూడా బాగా వినిపిస్తోంది. అయితే దీనిపై రకుల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది.