బిగ్‌బాస్ ఫేమ్ పునర్నవికి ఎంగేజ్‌మెంట్ అయిపోయింది

  • IndiaGlitz, [Wednesday,October 28 2020]

బిగ్‌బాస్ ఫేమ్ పునర్నవి భూపాలంకి ఎంగేజ్‌మెంట్ అయిపోయింది. ఇన్‌స్టాగ్రాం వేదికగా ఆమె ఈ విషయాన్ని వెల్లడించింది. ఎంగేజ్‌మెంజ్ రింగ్‌తో ఉన్న ఓ పిక్‌ను ఆమె ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఈ ఫోటోకు ‘ఫైనల్లీ! ఇట్స్ హ్యాపెనింగ్’ అనే క్యాప్షన్‌ను పున్ను ఇచ్చింది. ఆ పిక్‌లో తనకు కాబోయే వ్యక్తి చెయ్యిని తప్ప ఫేస్ మాత్రం పున్ను కనిపించనివ్వలేదు. ఆ పిక్‌లో పున్ను చేతిని తన చేతిలోకి తీసుకుని డైమండ్ రింగ్ తొడిగినట్టుగా మాత్రమే కనిపించింది.

కనీసం తనకు కాబోయే వ్యక్తి పేరును కూడా పున్ను రివీల్ చేయలేదు. అయితే ఆమె పెట్టిన కాప్షన్ మాత్రం పెళ్లి చేసుకోబోతోందన్న విషయాన్ని మాత్రం స్పష్టం చేస్తోంది. 24 ఏళ్ల పునర్నవి భూపాలం.. ‘ఉయ్యాల జంపాల’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ సినిమా తరువాత ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’, ‘పిట్ట గోడ’, ‘మనసుకు నచ్చింది’ వంటి సినిమాలను చేసింది. అయితే ఆమె బిగ్‌బాస్ తెలుగు సీజన్ 3 ద్వారానే చాలా ఫేమస్ అయిపోయింది.

బిగ్‌బాస్ సీజన్‌ 3లో ఆ సీజన్ విన్నర్ రాహుల్‌తో ఆమె ప్రేమలో పడినట్టు రూమర్స్ వచ్చాయి. ఆ తరువాత వారిద్దరూ డేటింగ్‌లో ఉన్నారంటూ కూడా రూమర్స్ వచ్చాయి. అయితే వారిద్దరూ ఎప్పటికప్పుడు వాటిని ఖండిస్తూనే వచ్చారు. తామిద్దరం మంచి స్నేహితులమని చెబుతూ వచ్చారు. తాజాగా ఆమె పోస్ట్ చేసిన పిక్‌తో ఈ రూమర్స్‌కు ఫుల్ స్టాప్ పడనుంది.

More News

రక్షించాలంటూ సీఎంకు ప్రముఖ దర్శకుడి మొర

తన జీవితం ప్రమాదంలో ఉందని రక్షించాలంటూ ఏకంగా ముఖ్యమంత్రికి ప్రముఖ దర్శకుడు మొరపెట్టుకోవడం సంచలనంగా మారింది. ఆయన మరెవరో కాదు.. జాతీయ అవార్డు గ్రహీత అయిన శీను రామస్వామి.

గొర్రెకుంట హత్య కేసుల నిందితుడికి ఉరిశిక్ష ఖరారు

తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన గొర్రెకుంట తొమ్మిది మంది హత్య కేసులో న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. నిందితుడు సంజయ్ కుమార్ యాదవ్‌కు ఉరిశిక్ష విధిస్తూ వరంగల్

బేబీ బంప్‌తో షూటింగ్‌కు హాజరైన కరీనా

బేబీ బంప్‌తో బయటకు వచ్చేందుకు హీరోయిన్లు పెద్దగా ఇష్టపడరు. కానీ బాలీవుడ్ బ్యూటీ మాత్రం అవేమీ పట్టించుకోకుండా హ్యాపీగా బయటకు వెళుతోంది. ఆమె మరెవరో కాదు..

పునర్జన్మల నేపథ్యంలో నాని

నేచురల్ స్టార్ నాని ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌కు ఓకే చెబుతున్నారు. ఇప్ప‌టికే శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో ‘ట‌క్ జ‌గ‌దీష్’ సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

సరికొత్త రూపు సంతరించుకోనున్న ఇంద్రకీలాద్రి

ఇంద్రకీలాద్రి సరికొత్త రూపు సంతరించుకోనుంది. దుర్గమ్మ భక్తులకు మౌలిక వసతులతో పాటు.. అమ్మవారి ఆలయ సమగ్ర అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి.