బిగ్‌బాస్‌ టైమ్‌ చేంజ్‌..

  • IndiaGlitz, [Wednesday,December 02 2020]

'నేను టైమ్‌ను నమ్మను టైమింగ్‌ను నమ్ముతాను' అని గబ్బర్‌సింగ్‌లో పవన్‌కల్యాణ్‌ డైలాగ్‌ చెప్పిన డైలాగ్‌ గురించి చెప్పనక్కర్లేదు. ఇప్పుడు అదే డైలాగ్‌ను నాగార్జున చెప్పబోతున్నాడట. ఇంతకీ నాగార్జున ఆ డైలాగ్‌ను ఎందుకు చెప్పబోతున్నాడా? అనే సందేహం రాకమానదు. అసలు విషయమేమంటే నాగార్జున అక్కినేని హోస్ట్‌గా చేస్తున్న తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్‌ సీజన్‌ 4 ముగింపు దశకు చేరుకుంటోంది. ఇప్పటికే 12 వారాలు పూర్తయ్యాయి. మరో మూడు వారాలకు బిగ్‌బాస్‌ 4 పూర్తవుతుంది. అయితే చివరి స్టేజీలో బిగ్‌బాస్‌ 4 టైమింగ్‌ను నిర్వాహకులు మార్చేశారట.

వివరాల్లోకెళ్తే.. సాధారణ రోజుల్లో బిగ్‌బాస్‌ రాత్రి 9.30 గంటలకు వస్తే వారాంతరాలైన శని, ఆదివారాల్లో రాత్రి తొమ్మిది గంటలకు వస్తుంది. అయితే ఇకపై బిగ్‌బాస్‌ సోమవారం నుండి శుక్రవారం వరకు రాత్రి పదిగంటలకు.. శని, ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు ప్రసారం అవుతుంది. మరి సడెన్‌గా బిగ్‌బాస్‌ 4ను మార్చడానికి కారణం... షో చివరి దశకు వచ్చేటప్పటికీ ఆసక్తితో ప్రేక్షకులు ఎక్కువగా చూస్తారు. కాబట్టి టైమ్‌ మార్చినా పరావాలేదనిపించే నిర్వాహకులు బిగ్‌బాస్‌ 4 టైమ్‌ను మార్చారట. కొత్త సీరియల్‌ రావడంతో దాన్ని సాయంత్రం ఏడు గంటలకు ప్రసారం చేస్తూ, ఆ టైమ్‌లోవచ్చే వదినమ్మ సీరియల్‌ను రాత్రి తొమ్మిదిన్నర గంటలకు మార్చేశారట. అదీ అసలు సంగతి

More News

టికెట్ టు ఫినాలే టాస్క్‌: రౌండ్‌ 2లోకి అఖిల్, సొహైల్, అభి, హారిక..

ఓపెనింగే అఖిల్ తన ఫ్యామిలీ ఫోటోని ముందు పెట్టుకుని దిల్‌తో ఆడలేదు.. దిమాక్‌తో ఆడానంటూ ఎమోషనల్ అయ్యాడు.

సిగ్గో సిగ్గు.. ఇంట్లో ఓటర్లు.. పోలింగ్ బూత్‌లో ఆఫీసర్లు నిద్ర..!

400 ఏళ్ల ఘన చరిత్ర.. పొద్దున లేస్తే సోషల్ మీడియాలో నీతులు చెప్పే యువత.. పవర్ పాలిటిక్స్‌పై చర్చించే పెద్దలు..

అపోహలు సృష్టించి పోలింగ్ శాతం తగ్గేలా చూశారు: కిషన్‌రెడ్డి

ఓటింగ్ శాతం తగ్గినందుకు టీఆర్ఎస్ సిగ్గుతో తలదించుకోవాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

ఉద్ధవ్ సమక్షంలో శివసేనలో చేరిన నటి ఊర్మిళ

బాలీవుడ్ నటి ఊర్మిళ మటోండ్కర్ మంగళవారం శివసేన పార్టీలో చేరారు. పార్టీ అధ్యక్షుడు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే

నగరం నిద్రపోయిందా?

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటలకు ముగిసింది.