బిగ్‌బాస్ విజేత ఎవరో తెలిసిపోయింది.. ఫొటోలు లీక్!?

  • IndiaGlitz, [Friday,November 01 2019]

తెలుగు రియాల్టీ బిగ్‌బాస్-3 మరికొన్ని రోజుల్లో ముగియనుంది. ఇప్పటి వరకూ జరిగిన సీజన్స్ అన్నీ ఓ లెక్క.. ఈ సీజన్ ఓ లెక్క అన్నట్లుగా బుల్లితెర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుందీ షో. మరో రెండ్రోజుల్లో గ్రాండ్ ఫినాలే జరగనుంది. కాగా.. టైటిల్ కోసం బాబా భాస్కర్, రాహుల్ సిప్లిగంజ్, వరుణ్ సందేశ్, అలీ, శ్రీముఖి పోటీపడుతున్నారు. అదృష్టం ఎవర్ని వరిస్తుందో తెలియట్లేదు కానీ.. పుకార్లు మాత్రం పెద్ద ఎత్తున షికార్లు చేస్తున్నాయి. సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ఫలానా వ్యక్తే టైటిల్ విన్నర్ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మరి కొందరు తాము అభిమానించేవారే గెలవబోతున్నారంటూ నెట్ట్టింట్లో అభిమానులు వారిని ఆకాశానికెత్తేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ఇప్పటికే విజేత ఎవరన్నది తెలిసిపోయిందని.. ఇదిగో శ్రీముఖినే విన్నర్ అంటూ కొందరు ఫొటోలతో సహా బయటపెడుతున్నారు. అయితే ఈ ఫొటోలు నిజమా..? లేకుంటే మార్ఫింగ్ చేశారా..? అన్నది మాత్రం తెలియరాలేదు. కాగా ఈ ఫొటోలో మాత్రం బిగ్‌బాస్ టైటిల్‌ను అందుకున్న శ్రీముఖి.. అనంతరం హోస్ట్ నాగార్జున ఆప్యాయంగా హత్తుకున్నట్టు ఉంది. కాగా ఈ ఫొటో నెట్టింట్లో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. అయితే శ్రీముఖి వీరాభిమానులు కొందరు ఇలా మార్ఫింగ్ చేసి హడావుడి చేస్తున్నారనే.. రాహుల్ సిప్లిగంజ్ అభిమానులు దుమ్మెత్తిపోస్తున్నారు. అయితే ఇప్పుడు మిగతా వారిని పక్కనెడితే శ్రీముఖి-రాహుల్ మధ్యే విన్నర్ ఫైట్ జరుగుతోంది. వీరిలో ఎక్కువగా శ్రీముఖినే టైటిల్ గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయ్.. ఓట్లు కూడా ఈమెకు ఎక్కువ పడ్డాయ్. మరి అసలు విజేత ఎవరో..? అసలు ఇప్పుడు లీకైన.. మార్ఫింగ్ చేసిన ఫొటోలో ఏ మాత్రం నిజాలున్నాయో తెలియాలంటే ఆదివారం వరకు వేచి చూడాల్సిందే మరి.

More News

సీబీఐ కోర్టులో జగన్‌కు చుక్కెదురు.. కోర్టుకు రావాల్సిందే!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి సీబీఐ కోర్టు ఊహించని షాకిచ్చింది.

'నిశ్శ‌బ్దం' లో అంజ‌లి లుక్ విడుద‌ల‌

అభిన‌యంతో పాటు గ్లామ‌ర్ పాత్ర‌ల్లో న‌టిస్తూ హీరోయిన్‌గా త‌న‌కంటూ ఓ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న హీరోయిన్ అంజ‌లి.

జొన్నవిత్తులపై ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్!

వివాదాలకు కేరాఫ్‌గా పేరుగాంచిన.. వివాదాలే ఊపిరిగా భావించే రామ్‌గోపాల్ వర్మ ‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు’ అనే మూవీతో మరో సంచలనానికి తెరలేపుతున్న విషయం విదితమే.

బిగ్‌బాస్‌‌-3: రాహుల్ కోసం రంగంలోకి దిగిన తల్లి!

తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్‌-3 మరికొన్ని రోజుల్లో ముగియనుంది. అయితే ఈ సీజన్‌లో టైటిల్‌ ఎవరు ఎగరేసుకుపోతారనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

బాబు, లోకేష్, పవన్‌లకు మంత్రి అవంతి ఓపెన్ చాలెంజ్

టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లకు పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ ఓపెన్ చాలెంజ్ చేశారు.