ఏపీకి కొత్త గవర్నర్‌గా బిశ్వ భూషణ్‌.. నరసింహన్ సంగతేంటి!?

  • IndiaGlitz, [Tuesday,July 16 2019]

ఆంధ్రప్రదేశ్ నూతన గవర్నర్‌గా బిశ్వ భూషణ్‌ హరిచందన్‌ నియమితులయ్యారు. హరించందన్ ఏపీ గవర్నర్‌గా నియమిస్తున్నట్లు మంగళవారం సాయంత్రం రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా బిశ్వభూషన్ బీజేపీలో కీలక నేతగా వ్యవహరించారు. కాగా ఈయన్ను రాజకీయవర్గాల్లో ‘ప్రసాద్‌ హరిచందన్‌’గా బాగా పాపులర్‌ అయ్యారు. ఈయన సుదీర్ఘకాలంగా సంఘ్‌పరివార్‌తో అనుబంధం ఉన్న వ్యక్తి. ఈయన రాజకీయ నేతే కాదు మంచి రచయిత కూడా. ఈయన రాజకీయాల్లో క్రియాశీలంగా ఉంటైనే ఎన్నో పుస్తకాలు రాశారు. కాగా ఈయన రాసిన పుస్తకాల్లో చాలా వరకు ఆయన మంచి పేరు తెచ్చిపెట్టాయి. కాగా.. ‘అవినీతిపై పోరు’, ‘మొక్కల పెంపకం’ అంటే భూషణ్‌కు ఎనలేని ఆసక్తి ఉండేదని గతంలో పలు పత్రికల్లో వార్తలు వచ్చాయి.

ఈసీఎల్ పరిస్థితేంటి..!?
 
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొదలుకుని విభజన అనంతరం కూడా ఈసీఎల్ నరసింహన్ గవర్నర్‌గా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఏపీకి కొత్త గవర్నర్ రావడంతో.. తెలంగాణకు కూడా కొత్త గవర్నర్ వస్తారా..? లేకుంటే నరసింహనే కంటిన్యూ అవుతారా..? అన్నది తెలియాల్సి ఉంది.

చత్తీస్‌గఢ్‌‌కు కొత్త గవర్నర్!
 
ఇదిలా ఉంటే.. ఏపీతో పాటు చత్తీస్‌గఢ్‌ కొత్త గవర్నర్‌‌గా రానున్నారు. అనసూయ ఊకేను చత్తీస్‌గడ్‌కు గవర్నర్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఇదిలా ఉంటే.. మధ్యప్రదేశ్ గవర్నర్ ఆనందిబెన్ పటేల్.. ఆ రాష్ట్రంతో పాటు చత్తీస్‌గడ్‌కు కూడా ఇంచార్జ్ గవర్నర్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే.

More News

బిగ్‌బాస్‌కు హోస్ట్‌గా నాగ్ చేయడం దారుణం!!

తెలుగు బిగ్‌బాస్-3కు టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున హాస్ట్‌గా వ్యవహరించడం దారుణమని ప్రముఖ నిర్మాత కేతిరెడ్డి జగదాశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు.

సందీప్‌.. తాప్సీ ట్వీట్ చూశావా?

సందీప్‌.. తాప్సీ ట్వీట్ చూశావా?  వామ్మో తాప్సీ నీలో ఈ యాంగిల్ కూడా ఉందా? అంటూ ప‌లువురు విస్తుపోతున్నారు.

మ‌ణిర‌త్నం 'పొన్నియిన్ సెల్వ‌న్‌' లో న‌య‌న‌తార‌!

మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌నున్న పీరియాడిక్ చిత్రం `పొన్నియిన్ సెల్వ‌న్‌`. ఈ చిత్రం కోసం ఇప్ప‌టికే విక్ర‌మ్‌, ఐశ్వ‌ర్య‌రాయ్‌తో పాటు ప‌లువురు ఆర్టిస్టుల‌ను మ‌ణిర‌త్నం ఎంపిక చేశారు.

కొడుకును ఇబ్బంది పెట్టిన విక్ర‌మ్‌

చియాన్ విక్ర‌మ్ సినిమాల్లో బిజీ బిజీగా న‌టిస్తున్న త‌రుణంలోనే ఆయ‌న త‌న‌యుడు ధ్రువ్ హీరోగా ఎంట్రీ ఇచ్చేశాడు.

'సాహో' షూటింగ్ పూర్తి..

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ హీరోగా సుజీత్ ద‌ర్శ‌క‌త్వంలో యు.వి.క్రియేష‌న్స్ నిర్మాణంలో వంశీ, ప్ర‌మోద్ నిర్మాత‌లుగా రూపొందిన భారీ బ‌డ్జెట్ చిత్రం `సాహో`.