ఏపీకి కొత్త గవర్నర్గా బిశ్వ భూషణ్.. నరసింహన్ సంగతేంటి!?
- IndiaGlitz, [Tuesday,July 16 2019]
ఆంధ్రప్రదేశ్ నూతన గవర్నర్గా బిశ్వ భూషణ్ హరిచందన్ నియమితులయ్యారు. హరించందన్ ఏపీ గవర్నర్గా నియమిస్తున్నట్లు మంగళవారం సాయంత్రం రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా బిశ్వభూషన్ బీజేపీలో కీలక నేతగా వ్యవహరించారు. కాగా ఈయన్ను రాజకీయవర్గాల్లో ‘ప్రసాద్ హరిచందన్’గా బాగా పాపులర్ అయ్యారు. ఈయన సుదీర్ఘకాలంగా సంఘ్పరివార్తో అనుబంధం ఉన్న వ్యక్తి. ఈయన రాజకీయ నేతే కాదు మంచి రచయిత కూడా. ఈయన రాజకీయాల్లో క్రియాశీలంగా ఉంటైనే ఎన్నో పుస్తకాలు రాశారు. కాగా ఈయన రాసిన పుస్తకాల్లో చాలా వరకు ఆయన మంచి పేరు తెచ్చిపెట్టాయి. కాగా.. ‘అవినీతిపై పోరు’, ‘మొక్కల పెంపకం’ అంటే భూషణ్కు ఎనలేని ఆసక్తి ఉండేదని గతంలో పలు పత్రికల్లో వార్తలు వచ్చాయి.
ఈసీఎల్ పరిస్థితేంటి..!?
ఈసీఎల్ పరిస్థితేంటి..!?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొదలుకుని విభజన అనంతరం కూడా ఈసీఎల్ నరసింహన్ గవర్నర్గా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఏపీకి కొత్త గవర్నర్ రావడంతో.. తెలంగాణకు కూడా కొత్త గవర్నర్ వస్తారా..? లేకుంటే నరసింహనే కంటిన్యూ అవుతారా..? అన్నది తెలియాల్సి ఉంది.
చత్తీస్గఢ్కు కొత్త గవర్నర్!
చత్తీస్గఢ్కు కొత్త గవర్నర్!
ఇదిలా ఉంటే.. ఏపీతో పాటు చత్తీస్గఢ్ కొత్త గవర్నర్గా రానున్నారు. అనసూయ ఊకేను చత్తీస్గడ్కు గవర్నర్గా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఇదిలా ఉంటే.. మధ్యప్రదేశ్ గవర్నర్ ఆనందిబెన్ పటేల్.. ఆ రాష్ట్రంతో పాటు చత్తీస్గడ్కు కూడా ఇంచార్జ్ గవర్నర్గా వ్యవహరించిన విషయం తెలిసిందే.