కేరళ బీజేపీ అభ్యర్థిగా మెట్రో మ్యాన్ శ్రీధరన్

  • IndiaGlitz, [Friday,March 05 2021]

ఇటీవల మెట్రో మ్యాన్ శ్రీధరన్ బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ఆయనకు బీజేపీ బంపర్ ఆఫర్ ఇచ్చింది. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీధరన్ కీలకంగా మారారు. ఆయనను బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆ పార్టీ ప్రకటించింది. ఈ విషయాన్ని కేరళ బీజేపీ చీఫ్ సురేంద్రన్ స్వయంగా వెల్లడించారు. త్వరలోనే మిగిలిన అభ్యర్థుల పేర్లను కూడా వెల్లడిస్తామని ఆయన తెలిపారు. కేరళలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పని చేస్తానని ఇప్పటికే శ్రీధరన్ ప్రకటించారు.

అయితే ఈ ప్రకటనకు ముందు శ్రీధరన్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఢిల్లీ మెట్రో రైల్ కార్పోరేషన్ యూనిఫాంలో తనకు ఇదే చివరి రోజని తెలిపారు. ఢిల్లీ మెట్రో రైల్ కార్పోరేషన్‌కు రాజీనామా సమర్పించిన తర్వాతే తాను ఎన్నికలకు ముందుకు వెళతానని శ్రీధరన్ స్పష్టం చేశారు. ఇంజినీర్‌గా ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్టులను దేశానికి శ్రీధరన్ అందించారు. భారత్ లో ప్రజారవాణా వ్యవస్థ ముఖచిత్రాన్ని మార్చేలా మెట్రో రైలు వ్యవస్థలకు ఊపిరిపోశారు. ప్రస్తుతం తన సొంత రాష్ట్రం కేరళకు ఏదైనా చేయాలని పరితపిస్తున్నారు.

కాగా.. గతంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేరళలో బీజేపీని అందలం ఎక్కించడమే లక్ష్యంగా తాను శ్రమిస్తానని వెల్లడించారు. ఈ క్రమంలో పార్టీ ఆదేశిస్తే సీఎం పదవి చేపట్టేందుకు కూడా తాను సిద్ధమేనని శ్రీధరన్ తెలిపారు. ఒకవేళ తాను కేరళ ముఖ్యమంత్రి అయితే, రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనకే అత్యంత ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. గవర్నర్ పదవిపై తనకు ఏమంత ఆశ లేదని, ఆ పదవితో రాష్ట్రానికి చేకూరే ప్రయోజనం ఏమంత ఉండదని శ్రీధరన్ అభిప్రాయపడ్డారు.

More News

సుశాంత్‌ని చంపినట్టు చంపేస్తారు: కంగన

బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ ఎంత ధైర్యంగా బోల్డ్‌గా తన అభిప్రాయాలను వెల్లడిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

అప్రమత్తంగా లేకపోవడం కూడా హానికరమే: వెంకీ కుడుమల

‘భీష్మ’ డైరెక్టర్‌ వెంకి కుడుములను ఇటీవల ఒక మోసగాడు మోసగించిన విషయం తెలిసిందే. దీనిపై ఇటీవల చాలా కథనాలు వెలువడ్డాయి.

నెట్టింట హ‌ల్ చ‌ల్ చేస్తోన్న ‘ఆర్ఆర్ఆర్‌’ లీక్డ్ ఫొటోస్

దర్శకధీరుడు రాజమౌళికి కొత్త టెన్షన్ పట్టుకుంది. సినిమా పరంగానే కానీ, టెక్నికల్ టెన్షన్ కాదు.. లీకేజీ రాయుళ్ల సమస్య.

తల్లి కాబోతున్న ప్రముఖ గాయని..

ప్రముఖ గాయని తల్లి కాబోతోంది. ఈ విషయాన్ని ఆమె ట్విటర్ వేదికగా స్వయంగా వెల్లడించింది. సింగర్ శ్రేయా ఘోషల్ తాను పెళ్లికాబోతున్నానంటూ శుభవార్త చెప్పింది.

మొన్న ఘట్కేసర్.. నిన్న విజయనగరం.. ఎందుకిలా?

మొన్న ఘట్కేసర్.. నిన్న విజయనగరం జిల్లా గుర్ల.. ప్రాంతం ఏదైతేనేమి తెలుగు రాష్ట్రాల్లో వరుస ఘటనలు తల్లిదండ్రులను భయాందోళనకు గురి చేస్తున్నాయి.