close
Choose your channels

తిరుగులేని శక్తిగా మారిన బీజేపీ!!

Wednesday, August 21, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

తిరుగులేని శక్తిగా మారిన బీజేపీ!!

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తిరుగులేని శక్తిగా మారింది. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ మరింత బలపడిందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇందుకు కారణం పార్టీ సభ్యత్వమే. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత మొట్ట మొదట సభ్యత్వాలపైనే కమలనాథులు దృష్టి పెట్టారు. తాజాగా.. 4 కోట్ల మందికిపైగా దేశవ్యాప్తంగా బీజేపీ సభ్యత్వం తీసుకోవడం విశేషమని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం బీజేపీ సభ్యత్వాలు 14.78 కోట్లకు చేరుకున్నట్లు బీజేపీ ఓ ప్రకటనలో తెలిపింది. జూలై 6న ప్రారంభమైన సభ్యత్వ నమోదు కార్యక్రమం నిన్నటితో (ఆగస్ట్ 20) ముగిసిందని తెలిపింది.

ఉత్తరప్రదేశ్‌లో 55 లక్షలు, ఢిల్లీలో 15 లక్షల మంది సభ్యత్వాలు తీసుకున్నారని చెప్పింది. తొలుత 2 కోట్ల కొత్త సభ్యత్వాలను టార్గెట్ గా పెట్టుకున్న బీజేపీ... ఆ తర్వాత టార్గెట్ ను 4 కోట్లకు పెంచింది.మొత్తానికి చూస్తే.. ఊహించని విధంగా బీజేపీకి ప్రజల్లో పెరుగుతున్న మద్దతు ఇతర పార్టీలకు వణుకు పుట్టిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పుకోవచ్చు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.