ఎస్ఎల్బీసీ ఘటన.. రంగంలోకి బీజేపీ కూడా


Send us your feedback to audioarticles@vaarta.com


ఎస్ఎల్బీసీ టన్నెల్ దుర్ఘటనపై ఇప్పటికే బీఆర్ఎస్, కాంగ్రెస్ రాజకీయ విమర్శలు చేసుకుంటున్నాయి. ప్రమాదం జరిగి ఇన్ని రోజులైనా ఫలితం లేదని, కాంగ్రెస్ నేతలంతా ఉదయాన్నే టన్నెల్ దగ్గరకు వెళ్లి టిఫిన్, భోజనం చేసి రాత్రికి ఇంటికెళ్తున్నారని బీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పించారు.
ఇటు కాంగ్రెస్ నేతలు కూడా బీఆర్ఎస్ పై దుమ్మెత్తిపోస్తున్నారు. అసలు బీఆర్ఎస్ అలసత్వం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపిస్తున్నారు. మిగిలిన 20 కిలోమీటర్ల టన్నెల్ పనుల్ని, గడిచిన పదేళ్లలో పూర్తిచేసినట్టయితే, ఇంత ప్రమాదం జరిగి ఉండేది కాదని, మంత్రి జూపల్లితో సహా పలువురు నేతలు ఆరోపిస్తున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై చూపెట్టిన శ్రద్ధలో కనీసం 10శాతం ఎస్ఎల్బీసీపై పెడితే నల్గొండ సాగునీటి కొరత తీరేదని, కాంగ్రెస్ పార్టీకి క్రెడిట్ ఇవ్వాల్సి వస్తుందని, ఎస్ఎల్బీసీని బీఆర్ఎస్ పక్కనపెట్టిందని విమర్శిస్తున్నారు.
ఇప్పుడీ టన్నెల్ రాజకీయంలోకి బీజేపీ కూడా చేరింది. పలువురు బీజేపీ నేతలు టన్నెల్ దగ్గరకు వెళ్లారు. ఇంత పెద్ద దుర్ఘటన జరిగినప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టన్నెల్ దగ్గరకు వెళ్లకపోవడం బాధాకరంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. జరిగిన ఘటనకు సీఎం బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout

-
Devan Karthik
Contact at support@indiaglitz.com