Raghunandan Rao:4 వేల కోట్ల ల్యాండ్ స్కాంలో తోట చంద్రశేఖర్.. భూ దందా కోసమే బీఆర్ఎస్‌లోకి : రఘునందన్ రావు వ్యాఖ్యలు

  • IndiaGlitz, [Wednesday,January 18 2023]

ఇటీవల బీఆర్ఎస్‌లో చేరిన జనసేన నేత తోట చంద్రశేఖర్‌ను ఉద్దేశించి బీజేపీ నేత, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తోట చంద్రశేఖర్‌కు సీఎం కేసీఆర్ రూ.4 వేల కోట్ల విలువైన భూములను కట్టబెట్టారని ఆరోపించారు. తెలంగాణ మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ ఆధ్వర్యంలోనే భూ కుంభకోణం జరిగిందని.. ఇందులో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ పాత్ర కూడా వుందని రఘునందన్ అన్నారు. దీనిలో భాగంగా మియాపూర్‌లోని 40 ఎకరాల భూమిని చంద్రశేఖర్‌కు కట్టబెడుతున్నారని..ముందు జరిగిన ఒప్పందంలో భాగంగానే ఖమ్మం బీఆర్ఎస్ సభకు ఆయన ఖర్చు పెడుతున్నారని రఘునందన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

కేసీఆర్‌కు బీహారీలంటే చాలా ఇష్టం :

కేసీఆర్‌కు గతంలో దొంగలుగా, రాక్షసులుగా కనిపించిన ఆంధ్రా వాళ్లు ఇప్పుడు బంధువులుగా, మిత్రులుగా మారిపోయారని ఆయన దుయ్యబట్టారు. మియాపూర్ భూములకు సంబంధించి గతంలో సుఖేష్ గుప్తా వ్యవహారంలో కోర్ట్‌ను ఆశ్రయించిన రంగారెడ్డి కలెక్టర్ ఇప్పుడు.. తోట చంద్రశేఖర్ విషయంలో ఎందుకు పట్టించుకోవడం లేదని రఘునందన్ రావు ప్రశ్నించారు. బీహార్ అధికారులంటే కేసీఆర్‌కు ప్రేమ ఎక్కువని.. దీనిలో భాగంగానే బీహార్‌కు చెందిన అధికారిని డీజీపీని నియమించారని ఎద్దేవా చేశారు.

ఇటీవలే బీఆర్ఎస్‌లో చేరిన తోట చంద్రశేఖర్:

ఇకపోతే.. గతంలో ఐఏఎస్ అధికారిగా పనిచేసిన తోట చంద్రశేఖర్ అనంతరం చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం, వైసీపీలో పనిచేసి గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు జనసేనలో చేరారు. ఆ ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయినప్పటికీ జనసేన కీలక నేతల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే అనూహ్య పరిణామాల మధ్య తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్థాపించిన బీఆర్ఎస్‌లో చేరారు తోట చంద్రశేఖర్. ఆ వెంటనే ఆంధ్రప్రదేశ్ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఆయనను ప్రకటించారు కేసీఆర్. తోట వెంట మాజీ మంత్రులు రావెల కిశోర్ బాబు, రామలింగేశ్వరరావు, విశాఖకు చెందిన మాజీ ఐఆర్ఎస్ అధికారి పార్థసారథి సైతం బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు.

More News

Amala Paul:గుడిలోకి అడుగుపెట్టనివ్వని పూజారులు.. అమలాపాల్‌కు ఘోర అవమానం, వివక్ష పోలేదంటూ హీరోయిన్ ఆవేదన

శాస్త్ర, సాంకేతిక రంగాల్లో భారతదేశం అగ్రరాజ్యాల సరసన నిలుస్తున్నా.. ఇంకా దేశంలో మూఢ నమ్మకాలు, అంధ విశ్వాసాలు రాజ్యమేలుతున్నాయి.

Bandi Sanjay:తోటి విద్యార్ధిపై దాడి, ముదురుతోన్న బండి సంజయ్ కుమారుడి వివాదం.. వెలుగులోకి మరో వీడియో

తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కుమారుడు భగీరథ్ తోటి విద్యార్ధిని కొట్టిన వీడియో వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Pawan kalyan - ali : పవన్‌ కల్యాణ్‌పై పోటీకి సిద్ధం.. కమెడియన్ అలీ సంచలన ప్రకటన

మెగా ఫ్యామిలీకి ముఖ్యంగా పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌కు కమెడియన్ అలీ అత్యంత సన్నిహితుడు. పవన్ సినిమా చేస్తుంటే..

Panja Vaishnav Tej :పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా ప్రచార చిత్రం విడుదల

పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా సితార ఎంటర్ టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్త నిర్మాణం లో

Shaakuntalam:ఫిబ్ర‌వ‌రి 17న ‘శాకుంతలం’ రిలీజ్‌

అద్భుతమైన విజువల్స్, భారీ బడ్జెట్‌తో సినిమాల‌ను రూపొందించే  ఎపిక్ ఫిల్మ్ మేక‌ర్ గుణ శేఖ‌ర్ సిల్వ‌ర్ స్క్రీన్‌పై ఆవిష్క‌రిస్తోన్న