close
Choose your channels

శంఖం ఊదుతూ బురదలో కూర్చుంటే కరోనా సోకదు: బీజేపీ ఎంపీ

Friday, August 14, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

శంఖం ఊదుతూ బురదలో కూర్చుంటే కరోనా సోకదు: బీజేపీ ఎంపీ

కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచమే ఏం చేయాలో అర్థం కాని స్థితిలో పడిపోయింది. నేటికీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే కరోనా సోకదనే విషయాన్ని ఎవరూ కచ్చితంగా చెప్పలేకపోతున్నారు. అసలు ఏ రకంగా కరోనా బారిన పడుతున్నారో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో బీజేపీ నేతల ఇస్తున్న స్టేట్‌మెంట్లు జనాన్ని గందరగోళానికి గురి చేస్తున్నాయి. వీరి కామెంట్లపై నెటజన్లు సెటైర్లు మీద సెటైర్లు వేస్తున్నారు. ఒకరు అప్పడాలు తింటే కరోనా రాదంటారు.. మరొకరు బురద రాసుకుని శంఖం ఊదితే కరోనా వైరస్ పారిపోతుందంటారు. కరోనాను ఇంత సిల్లీగా తీసుకోవడమేంటంటూ విపక్షాలు మండి పడుతున్నాయి.

రాజస్థాన్‌కి చెందిన బీజేపీ ఎంపీ సుఖ్‌బీర్ సింగ్ జౌనపూరియా తాజాగా చేసిన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. ఒంటికి బురద రాసుకుని, శంఖం ఊదితే నోవెల్ కరోనా వైరస్ పరారైపోతుందని ఆయన వెల్లడించారు. ‘‘శంఖం ఊదుతూ బురదలో కూర్చుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. తద్వారా మన శరీరం కొవిడ్-19పై సమర్థంగా పోరాడగలదు’’ అని ఎంపీ సుఖ్‌బీర్ వెల్లడించారు. గతంలో యోగా డే సందర్భంగా కూడా ఇలాంటి వ్యాఖ్యనే ఆయన చేశారు. ‘‘ఒంటికి బురద రాసుకుని యోగా చేస్తే ఎలాంటి జబ్బులైనా మటుమాయం అయిపోతాయి...’’ అంటూ యోగా డే సందర్భంగా సుఖ్‌బీర్ వ్యాఖ్యానించారు.

కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్‌ కూడా ఇలాంటి వ్యాఖ్యలనే చేశారు. కొద్ది రోజుల క్రితం ఆత్మనిర్భర్‌ భారత్‌ క్యాంపెయిన్‌లో భాగంగా భాభీజీ అప్పడాల్లో రోగ నిరోధక శక్తిని పెంచే పదార్థాలు ఉన్నాయనీ.. కరోనాను జయించేందుకు ఈ అప్పడాలను తింటే చాలని వెల్లడించారు. దీంతో ప్రతిపక్షాలు ఆయనపై తీవ్ర స్థాయిలో సెటైర్లు గుప్పించారు. కాగా.. ఇటీవల అర్జున్ రామ్ కూడా కరోనా బారిన పడటం గమనార్హం. దీంతో ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.