close
Choose your channels

కేసీఆర్, కేటీఆర్, హరీష్‌ కంటే బురదలో పందులు నయం: బీజేపీ ఎంపీ

Tuesday, December 8, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

కేసీఆర్, కేటీఆర్, హరీష్‌ కంటే బురదలో పందులు నయం: బీజేపీ ఎంపీ

దళారీలకు సీఎం కేసీఆర్ చీఫ్ బ్రోకర్‌గా వ్యవహరిస్తున్నారంటూ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్
సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతు చట్టంపై ముఖ్యమంత్రి, మంత్రులతో చర్చకు సిద్ధమన్నారు. తెలంగాణ రైతులు సీఎం కేసీఆర్‌ను త్వరలో బట్టలూడదీసి కొడతారన్నారు. ఉద్యమం అంటే కేసీఆర్‌కు చూపిస్తామని.. గడాఫీకి పట్టిన గతే కేసీఆర్‌కు పడుతుందన్నారు. టీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ఫేక్ ఉద్యమం నడుపుతోందన్నారు. దుబ్బాక ఎన్నికతో మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆత్మగౌరవం పెంచిన ఘనత బీజేపీదేనన్నారు. మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీకి కృతజ్ఞతలు చెప్పాలన్నారు. ధర్నా చౌక్ ఎత్తేసినోళ్ళకి ధర్నాలు చేసే హక్కులేదని అరవింద్ పేర్కొన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో దిమ్మతిరిగింది కేటీఆర్‌కు సరిపోలేదేమోనని ఎద్దేవా చేశారు.

కేసీఆర్ పాలన తీరు మారకపోతే తెలంగాణలో రాష్ట్రపతి పాలన వస్తుందని హెచ్చరించారు. ఇంకా అరవింద్ మాట్లాడుతూ.. ‘‘రాజ్యాంగం గురించి నాకంటే కేసీఆర్‌కు బాగా తెలుసు. బెంగాల్‌నే కొట్టబోతున్నాం.. తెలంగాణలో కేసీఆర్ మాకొక పెద్ద సమస్య కాదు. కేసీఆర్, కేటీఆర్, ఆర్థికమంత్రి హరీష్‌రావు కంటే బురదలో పందులు నయం. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల రక్తం తాగే బ్రోకర్. మక్కలు కొనుగోలు కేంద్రాలు ఎందుకు ఏర్పాటు చేయలేదో ప్రభుత్వం చెప్పాలి. సన్నాలను ప్రభుత్వం ఎందుకు కొనుగోలు చేయటం లేదు? దగ్గు, జలుబు వస్తే కేసీఆర్ కార్పోరేట్ ఆసుపత్రైన యశోదాకే ఎందుకు వెళ్తున్నాడు? కవిత, హరీష్‌రావులు కార్పోరేట్ కాళాశాలల్లోనే తమ పెట్టుబడులు ఎందుకు పెడుతున్నారు?

సాయంత్రమైతే కేటీఆర్ కార్పోరేట్ తరహా పార్టీలు ఎందుకు చేసుకుంటున్నాడు? కేటీఆర్, కవితలు కమిషన్ ఇవ్వకపోవటం వలనే ఎమ్మెల్యే, మంత్రులు భూనులు కబ్జాలు చేస్తున్నారు. కేసీఆర్ రైతు నిర్వచనాన్నే మార్చివేశారు. ‌‌‌దున్నే వాడిదే భూమి అనే నినాదాన్ని.‌‌‌‌. పాస్ పుస్తకం ఉన్నోడిదే భూమి అనే పరిస్థితికి కేసీఆర్ తీసుకొచ్చాడు. దళారీలు మాత్రమే ఉద్యమం చేస్తున్నారు. ఢిల్లీ ఉద్యమంలో రైతులు లేరు. తెలంగాణలో పండుతున్న పసుపును కాదని.‌. కమిషన్ కోసమే ప్రభుత్వం పసుపును దిగుమతి చేసుకుంటోంది. వేల కోట్ల కమీషన్లు పోతున్నాయనే రైతు చట్టంపై ప్రాంతీయ పార్టీల ఏడుపు’’ అని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మండిపడ్డారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.