ఉర్వశి రౌటేలా 'బ్లాక్ రోజ్' ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల

  • IndiaGlitz, [Thursday,September 24 2020]

మిస్ ఇండియా కిరీటాన్ని సాధించి బాలీవుడ్ లో పలు సక్సెస్ ఫుల్ చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన అందాల భామ ఉర్వశి రౌటేలా కథ విన్న వెంటనే ఇంప్రెస్ అయ్యి మొదటి సారి తెలుగు ప్రేక్షకులను తన అందం, అభినయంతో అలరించడానికి లేడీ షైలాక్ రూపంలో రాబోతున్న చిత్రం 'బ్లాక్‌రోజ్'‌. పలు సూపర్ హిట్ చిత్రాల‌ను నిర్మించిన నిర్మాత శ్రీనివాసా చిట్టూరి పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం:4గా తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్ ను ఈ రోజు విడుద‌ల‌చేసింది చిత్ర యూనిట్‌.

ఏమైంది ఈ వేళ , రచ్చ , బెంగాల్ టైగర్ చిత్రాలతో మాస్, క్లాస్ ప్రేక్షకులని అలరించిన ప్ర‌ముఖ‌ దర్శకుడు సంపత్ నంది షేక్స్పియ‌ర్‌ రచించిన “ది మర్చంట్ ఆఫ్ వెనిస్'' లోని జ్యూయిష్ మనీ లెండర్ షైలాక్ పాత్ర ఆధారంగా ఫిమేల్ ఓరియెంటెడ్ ఎమోషనల్ థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని క్రియేట్ చేస్తున్నారు. అలాగే యోగ్యత లేని, విచక్షణ లేని ఆర్థిక లావాదేవీలు మరణానికి సంకేతం అనే కౌటిల్యుడు అర్ధ శాస్త్రం లోని కాన్సెప్ట్ ని జోడిస్తూ అన్ని వ‌ర్గాల‌ ప్రేక్షకులను అలరించే విధంగా చిత్రాన్ని తీర్చి దిద్దుతున్నారు .

స్నేహ గీతం, దొంగాట చిత్రాలకు స్క్రీన్ ప్లే రైటర్ గా పని చేసిన మోహన్ భరద్వాజ్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

3వేల కోట్ల టర్న్ ఓవర్ ఉన్న ఒక పైనాన్స్ కంపెనీ లో రిలేషన్ షిప్ మేనేజర్ గా పని చేస్తున్న ఒక స్ట్రాంగ్ మోడరన్ వుమన్ వసుధ లైఫ్ లో ఒకరోజు జరిగిన కథ ఈ 'బ్లాక్ రోజ్'. చిత్ర యూనిట్ మొత్తానికి కోవిడ్ 19 పరీక్షలు నిర్వహించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్ జ‌రిపి ఒకే షెడ్యూల్‌లో సినిమాని పూర్తిచేయ‌నున్న‌ట్లు నిర్మాత‌లు తెలిపారు.

More News

వేస‌వి బ‌రిలో చిరు, బాల‌య్య‌..!

మెగాస్టార్ చిరంజీవి, నంద‌మూరి బాల‌కృష్ణ మ‌రోసారి బాక్సాఫీస్ వ‌ద్ద పోటీ ప‌డబోతున్నారు. ప‌లు సంద‌ర్భాల్లో ఈ అగ్ర క‌థానాయ‌కులు పోటీ ప‌డితే ఒక సంద‌ర్భంలో ఒక‌రిది పైచేయి

ర‌కుల్ నోటీసుల విష‌యంలో హై డ్రామా..!

సినీ ప‌రిశ్ర‌మ‌కు డ్ర‌గ్ మాఫియాతో సంబంధాలున్నట్లు నార్కోటిక్ విచార‌ణ‌లో వెల్ల‌డి కావ‌డంతో అధికారులు ద‌ర్యాప్తును ముమ్మ‌రం చేశారు. అందులో భాగంగా డ్ర‌గ్ మాఫియాతో డీలింగ్ ఉన్న‌ట్లు తెలిసిన

కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి సురేష్ అంగడి కరోనాతో మృతి

కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి సురేష్ అంగడి కరోనా మహమ్మారి బారిన పడి మృతి చెందారు. ఇటీవల ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు.

ఇవాళ్టి బీభత్సాన్ని చెప్పలేం.. చూసి తీరాల్సిందే..

రోబోల కిడ్నాప్ స్కెచ్‌తో షో స్టార్ట్ అయింది. అభి స్కెచ్ పర్ఫెక్ట్‌గా గీశాడు. ముందే రిహార్సల్ కూడా వేయించాడు. నిజానికి దేవి చనిపోయింది. ఆటలో ఇన్వాల్వ్ అవకూడదు.

పొలిటికల్ బ్యాక్ డ్రాప్ మూవీలో మెగా హీరో

కరోనా మహమ్మారి కారణంగా ఆగిపోయిన షూటింగ్‌లన్నీ క్రమక్రమంగా తిరిగి ప్రారంభమవుతున్నాయి. దీంతో హీరోలంతా ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు.