మ్యాజిక్‌ను మ‌ళ్లీ క్రియేట్ చేస్తారా?

  • IndiaGlitz, [Wednesday,October 16 2019]

బాక్సాఫీస్ ద‌గ్గ‌ర కొన్ని కాంబినేష‌న్స్ మ్యాజిక్ క్రియేట్ చేస్తుంటాయి. అలాంటి మ్యాజిక్ 2012లో జ‌రిగింది. ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, డైరెక్ట‌ర్ హ‌రీశ్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో రూపొందిన 'గ‌బ్బ‌ర్ సింగ్' చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది. ప‌దేళ్ల పాటు స‌రైన హిట్ లేని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు గ‌బ్బ‌ర్‌సింగ్ ఓ ర‌కంగా హిట్ ఆక‌లిని తీర్చేసింది. ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను ఆయ‌న అభిమానులు ఎలా చూడాల‌నుకుంటున్నారో అలా తెర‌పై ఆవిష్క‌రించి అంద‌రితో శ‌భాష్ అనిపించుకున్నాడు డైరెక్ట‌ర్ హ‌రీశ్ శంక‌ర్‌. ఇప్పుడు మ‌రోసారి ఈ బ్లాక్‌బ‌స్ట‌ర్ కాంబినేష‌న్ రిపీట్ కానుందని సినీ వ‌ర్గాల స‌మాచారం.

వివ‌రాల్లోకెళ్తే.. ప‌వ‌న్‌క‌ల్యాణ్ రాజ‌కీయాల్లోకి వెళ్ల‌క ముందుగా మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ‌తో ఓ సినిమా చేస్తాన‌ని అడ్వాన్స్ తీసుకున్నాడు. కానీ ప‌వ‌న్ రాజ‌కీయాల్లోకి వెళ్ల‌డంతో ఆ ప్రాజెక్ట్ ప‌క్క‌న ప‌డింది. ఇప్పుడు ఎన్నిక‌లు ముగిశాయి. త‌దుప‌రి ఎన్నిక‌లకు ఇంకా స‌మ‌యం ఉంది. కాబ‌ట్టి ఈలోపు ప‌వ‌న్ త‌న క‌మిట్‌మెంట్స్‌ను పూర్తి చేసుకునే ప్ర‌య‌త్నాల్లో ఉన్నారు. అందుకోస‌మ‌ని, ప‌వ‌న్ హీరోగా హ‌రీశ్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలోఓ సినిమా చేయ‌డానికి చ‌ర్చ‌లు జ‌రుపుతున్నార‌ట‌. అయితే రీసెంట్‌గా డైరెక్ట‌ర్ క్రిష్ చెప్పిన క‌థ న‌చ్చ‌డంతో ప‌వ‌న్‌క‌ల్యాణ్ సినిమా చేయ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ట‌. మ‌రోప‌క్క మైత్రీ సంస్థ త‌మ సినిమాను హ‌రీశ్ శంక‌ర్‌తో ప్లాన్ చేసుకుంటుంది. మ‌రి ఈ రెండు చిత్రాల‌ను ప‌వ‌న్ ఎలా కంప్లీట్ చేస్తాడో చూడాలి.

More News

కేసీఆర్ ఫాంహౌస్‌లో కానిస్టేబుల్ ఆత్మహత్య.. కారణమిదేనా!

తెలంగాణ సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో ఓ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన కలకలం రేపుతోంది.

సమ్మెకు దిగిన ఆర్టీసీ కార్మికులకు గుడ్ న్యూస్!

ఇదేంటి.. కొంపదీసి తెలంగాణ సీఎం కేసీఆర్.. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు తలొగ్గి వారి డిమాండ్లను నెరవేరుస్తున్నారా ఏంటి..?

హేమమాలిని బుగ్గల్లా రోడ్లు తయారుచేస్తా!!

అవును మీరు వింటున్నది నిజమే.. పై మాట అన్నది ఓ స్టేట్ మినిస్టర్.. డ్రీమ్‌గాళ్ అంటే అమితంగా అభిమానించే ఆ మంత్రి ఆమె బుగ్గలను రోడ్లతో పోలుస్తూ..

అక్టోబర్ 18న 'సరోవరం'రిలీజ్

శ్రీలత సినీ క్రియేషన్స్ సరోవరం చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. అక్టోబర్ 18న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

దయచేసి నటించడం ఆపోద్దమ్మా రాములమ్మా..!

ఒకట్రెండు కాదు ఏకంగా 13 ఏళ్ల గ్యాప్ తర్వాత అలనాటి సీనియర్ నటి విజయశాంతి అలియాస్ రాములమ్మ రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే.