మల్లేశ్వరి బయోపిక్‌లో బాలీవుడ్ హీరోయిన్‌

  • IndiaGlitz, [Friday,June 12 2020]

ఇండియ‌న్ సినిమాల్లో బ‌యోపిక్స్ ట్రెండ్ కొన‌సాగుతోంది. రాజ‌కీయ‌, సినీ, క్రీడ‌లు స‌హా ప‌లు రంగాల్లో అత్యున్న‌త సేవ‌లు అందించిన ప‌లువురి జీవిత చ‌రిత్ర‌లు వెండితెర‌పై ఆవిష్కత‌మ‌వుతున్నాయి. మ‌రికొన్ని చ‌ర్చ‌ల ద‌శ‌లో ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో 2000లో జ‌రిగిన ఒలింపిక్స్ వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో కాంస్య ప‌త‌కం సాధించ‌డ‌మే కాకుండా ఒలింపిక్స్‌లో ప‌తకం సాధించిన తొలి భార‌తీయ మ‌హిళగా రికార్డ్ క్రియేట్ చేసిన క‌ర‌ణం మ‌ల్లేశ్వ‌రి జీవితాన్ని సినిమా రూపంలో ఆవిష్క‌రించ‌నున్నారు. ఎంతో మంది మ‌హిళ‌ల‌కు స్ఫూర్తినిచ్చిన క‌ర‌ణం మ‌ల్లేశ్వ‌రి బ‌యోపిక్‌ను పాన్ ఇండియా మూవీగా రూపొందించ‌నున్నారు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌లు ఎం.వి.వి.సినిమా, కె.ఎఫ్‌.సి బ్యాన‌ర్స్‌పై సంజ‌నా రెడ్డి ఈ బయోపిక్‌ను తెర‌కెక్కించ‌నున్నారు. ఎం.వి.వి.స‌త్య‌నారాయ‌ణ‌, కోన‌వెంక‌ట్ నిర్మాత‌లు.

మ‌ల్లేశ్వ‌రి పాత్ర‌లో ఎవ‌రు న‌టిస్తారు? అనే దానిపై చాలా పేర్లే వినిపించాయి. అనుష్క‌, నిత్యామీన‌న్‌,ర‌కుల్ ప్రీత్ సింగ్ ఇలా చాలా మంది స్టార్ హీరోయిన్స్ పేర్లు ప‌రిశీల‌న‌లో ఉన్నాయిన్నారు. అయితే పాన్ ఇండియా మూవీ కాబ‌ట్టి ఈ సినిమా కోసం బాలీవుడ్ హీరోయిన్ భూమి పెడ్నేక‌ర్‌ను నిర్మాత‌లు సంప్ర‌దించార‌ని, ఆమె కూడా ఓకే చెప్పింద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. త్వ‌ర‌లోనే ఈ పాన్ ఇండియా మూవీపై క్లారిటీ రానుందని టాక్‌.

More News

డిజిటల్ ద్వారా అల్లరోడి సినిమా..!

అల్ల‌రి చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చి నేటిత‌రం హీరోల్లో కామెడీ స్టార్‌గా పేరు సంపాదించుకుని యాబై సినిమాల‌ను పూర్తి చేశాడు అల్ల‌రి న‌రేశ్‌.

ఎన్టీఆర్ 30.... ద‌స‌రాకే!!

కరోనా ప్రభావంతో ఏర్ప‌డ్డ లాక్‌డౌన్ కార‌ణంగా థియేట‌ర్స్ బంద్ కావ‌డం..

త‌న పెళ్లిపై సెటైర్ వేసిన హ‌న్సిక‌

హీరోయిన్స్ కాస్త స‌క్సెస్ అయిన త‌ర్వాత కొన్నేళ్లు ఇండ‌స్ట్రీలో రాణించిన త‌ర్వాత వారికి రెగ్యుల‌ర్‌గా ఎదుర‌య్యే ప్ర‌శ్న మీ పెళ్లెప్పుడు?

ఈఎస్ఐ కుంభకోణంలో అచ్చెన్నాయుడు అరెస్ట్

తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన ఈఎస్‌ఐ కుంభకోణంలో టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.

నితిన్ జ‌త‌గా ఇస్మార్ట్ బ్యూటీ!!

యువ క‌థానాయ‌కుడు నితిన్‌.. ఏడాదిన్న‌ర గ్యాప్ త‌ర్వాత చేసిన `భీష్మ`తో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర పెద్ద హిట్ కొట్టాడు.