శ్రీకాళహస్తిలో కంగనా రనౌత్ రాహుకేతు పూజలు

  • IndiaGlitz, [Saturday,January 01 2022]

బాలీవుడ్ అగ్ర కథానాయిక, ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ శనివారం శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయాధికారులు ఆమెకు ఘనస్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారి దర్శనానికి ముందు కంగనా రనౌత్ ప్రత్యేక రాహుకేతు పూజల్లో పాల్గొన్నారు. అనంతరం స్వామి అమ్మవార్లను ఆమె దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దేవస్థానం అర్చకులు కంగనాకు శ్రీకాళహస్తీశ్వర ప్రసాదాలు, వేదాశీర్వచనాలు అందజేశారు. కంగనా రనౌత్ వెంట శ్రీకాళహస్తి వైసీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌ రెడ్డి ఉన్నారు.

అంతకుముందు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు కంగనా రనౌత్. శనివారం ఉదయం 2 గంటలకు వీఐపీ బ్రేక్ సమయంలో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా రంగనాయకుల మండపంలో కంగనాకు వేద పండితులు ఆశీర్వాదాల అందించారు. పట్టు వస్రాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. నూతన సంవత్సరం సందర్భంగా పలువురు ప్రముఖులు శ్రీవారిని దర్శించుకున్నారు. డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి, నటుడు సాయికుమార్‌, కూడా వెంకటేశ్వర స్వామి సేవలో పాల్గొన్నారు.

కాగా.. వరుస వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నారు కంగనా రౌనత్. ఇటీవల కేంద్రం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు మొదటినుంచి మద్దతు తెలుపుతున్న బాలీవుడ్ క్వీన్, రైతులపై కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు. సిక్కు సమాజం మొత్తాన్ని ఖలిస్తానీ ఉగ్రవాదులని అభివర్ణించారు. అంతేకాకుండా ఎందరో స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాల ఫలమైన 1947 నాటి దేశ స్వాతంత్య్రాన్ని ఆమె ‘భిక్ష’గా అభివర్ణించారు. నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్రంలో సర్కార్‌ కొలువుతీరిన 2014 ఏడాదిలోనే దేశానికి నిజమైన స్వాతంత్య్రం సిద్ధించినట్లు భావించాలని ఆమె వ్యాఖ్యానించారు. దీనిపై అన్ని వైపుల నుంచి విమర్శలు రావడంతో పాటు కంగనాపై పలు చోట్ల కేసులు కూడా నమోదయ్యాయి. కొందరైతే ఆమె నుంచి పద్మశ్రీ అవార్డును వెనక్క తీసుకోవాలని డిమాండ్ చేశారు.

More News

న్యూ ఇయర్ వేళ మెగా - నందమూరి అభిమానులకు చేదువార్త.. 'ఆర్ఆర్ఆర్' వాయిదా..?

అనుకున్నట్లుగానే కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ అన్ని రంగాలను ప్రభావితం చేస్తోంది. ముఖ్యంగా సినీ పరిశ్రమను మరోసారి కష్టాల్లోకి నెడుతోంది. ఇప్పటికే ఫస్ట్, సెకండ్ వేవ్‌లతో తీవ్ర ఇబ్బందు పడ్డ

ఆర్ఆర్ఆర్ నుంచి 'రామం రాఘవం' సాంగ్... అల్లూరిగా నెత్తురు వేడెక్కించిన చరణ్

బాహుబలి సిరీస్ తర్వాత ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన చిత్రం 'ఆర్ఆర్ఆర్' . సంక్రాంతి కానుకగా జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. తొలిసారిగా రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా

లాలా భీమ్లా డీజే సాంగ్ వచ్చేసింది... ఇక రచ్చ రచ్చే

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులకు భీమ్లా నాయక్ చిత్ర యూనిట్ న్యూఇయర్ గిఫ్ట్ ఇచ్చింది. ఈ మూవీలోని ‘‘లాలా భీమ్లా’’ సాంగ్ డీజే వర్షన్‌ను రిలీజ్ చేశారు. పాటను ప్రముఖ దర్శకుడు

శ్యామ్ సింగరాయ్‌ని వీక్షించిన బాలయ్య.. బాగా తీశారంటూ కితాబు

నేచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘‘శ్యామ్ సింగరాయ్’’. ఈ చిత్రంలో నాని ద్విపాత్రాభినయం చేయగా..

తెలంగాణ‌లో భారీగా పెరిగిన సినిమా టికెట్ల ధ‌ర‌లు.. ఆ థియేటర్‌లో చూడాలంటే రూ.350

ఏపీలో సినిమా టికెట్ ధరలను తగ్గింపు వ్యవహారం పెద్ద దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. దీంతో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఏపీ ప్రభుత్వం చర్చలు జరుపుతున్నారు.