బాలీవుడ్ బాహుబలి2 కు భారీ క్రేజ్....

  • IndiaGlitz, [Wednesday,April 20 2016]

రాజమౌళి, ప్రభాస్ కాంబినేష్ లో బాహుబలి కన్ క్లూజన్ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. ప్రస్తుతం వేసవి కారణంగా గ్యాప్ తీసుకున్న యూనిట్ సినిమాను అక్టోబర్ కంతా పూర్తి చేసి వచ్చే ఏడాది ఏప్రిల్ 14నాటికి విడుదల చేయాలని అనుకుంటుందట. అయితే బాహుబలి ది బిగినింగ్ క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు.

హాలీవుడ్ మీడియా సైతం టాలీవుడ్ వైపు ఫోకస్ అయ్యేలా చేసిన రాజమౌళి సెకండ్ పార్ట్ ను మరింత ప్రెస్టిజియస్ గా రూపొందిస్తున్నారు. బాలీవుడ్ లో ధర్మేంద్ర ప్రొడక్షన్స్ బ్యానర్ పై బాహుబలి పార్ట్ 1ను విడుదల చేశారు. బాలీవుడ్ 100 కోట్లుకు పైగా కలెక్ట్ చేసి బాలీవుడ్ క్రిటిక్స్ సైతం ఆశ్చర్యపోయేలా చేసింది. ఇప్పుడు బాహుబలి 2 సినిమాను విడుదల చేయాలని యశ్ రాజ్ చోప్రా బ్యానర్ పోటీలో ముందుగా నిలబడింది. ఏకంగా 150 కోట్ల రూపాయలను వారు ఆఫర్ చేస్తున్నట్లు సమాచారం. ఏదేమైనా బాహుబలి పార్ట్ 2 సరికొత్త రికార్డులకు తెర తీయడం ఖాయంగా కనిపిస్తుంది.

More News

ఘనంగా 'మదగజరాజ' ఆడియో వేడుక

గతంలో "జిల్లా" వంటి సూపర్ హిట్ చిత్రాన్ని తెలుగులో అనువదించిన శ్రీ ఓబుళేశ్వరా ప్రొడక్షన్స్ సంస్థ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న తాజా చిత్రం "మదగజరాజ". జెమిని ఫిలిం సర్క్యూట్ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని తమటం కుమార్ రెడ్డి నిర్మిస్తున్నారు.

'చల్ చల్ గుఱ్ఱం' పాటలు విడుదల

ముకుంద సినిమాలో వరుణ్ తేజ్ ఫ్రెండ్ పాత్రలో నటించిన శైలేష్ మంచి కార్ రేసర్ అని తెలిసి ఆశ్చర్యపోయాను.తనే సోలో హీరోగా చేసిన ఈ సినిమా తనకు మంచి సక్సెస్ కావాలని హీరో శ్రీకాంత్ అన్నారు.

త్రిష లోని మరో కోణాన్ని ఆవిష్కరించే నాయకి మంచి విజయాన్నిసాధించాలి - నందమూరి బాలకృష్ణ

అగ్ర కథానాయిక త్రిష నటించిన హర్రర్ మూవీ నాయకి.ఈ చిత్రాన్ని గోవి తెరకెక్కించారు.తెలుగు,తమిళ్ లో రూపొందిన నాయకి చిత్రాన్ని గిరిధర్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై గిరిధర్ మామిడిపల్లి నిర్మించారు.

ర‌కుల్ కి వంద మంది క‌ష్ట‌మ‌ర్స్ ఉన్నార‌ట‌..

హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్..కి వంద మంది క‌ష్ట‌మ‌ర్స్ ఉన్నార‌ట‌. అవును..! ఇది నిజంగా నిజం. ఈ విష‌యాన్నిస్వ‌యంగా ర‌కుల్ ప్రీత్ సింగే చెప్పంది. ఇంత‌కీ ర‌కుల్ ఏం చేస్తుంది అనుకుంటున్నారా..?

మే లో చుట్టాల‌బ్బాయి..

ఆది హీరోగా వీర‌భ‌ద్ర‌మ్ చౌద‌రి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం చుట్టాల‌బ్బాయి. ఈ చిత్రంలో ఆది స‌ర‌స‌న న‌మిత‌, యామిని హీరోయిన్స్ గా న‌టిస్తున్నారు. ఈ చిత్రాన్నిశ్రీ ఐశ్వ‌ర్య ల‌క్ష్మీ మూవీస్ బ్యాన‌ర్ పై వెంక‌ట్ త‌లారి నిర్మిస్తున్నారు.