యంగ్ టైగర్ జోడీగా బాలీవుడ్ బ్యూటీ..!

  • IndiaGlitz, [Sunday,January 31 2021]

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌తో క‌లిసి భారీ బ‌డ్జెట్ చిత్రం ‘రౌద్రం ర‌ణం రుధిరం(ఆర్ఆర్ఆర్‌)’లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. క‌రోనా ఎఫెక్ట్ లేకుండా ఉంటే ఈపాటికి చిత్రీక‌ర‌ణ ముగిసేది. ఎన్టీఆర్ త‌దుప‌రి సినిమా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ప్రారంభ‌మై ఉండేది. కానీ ప‌రిస్థితుల‌పై క‌లిసి రాలేదు. ఈ విష‌యాన్ని ప‌క్క‌న పెడితే త్రివిక్ర‌మ్ మాత్రం ఓపిక‌గానే తార‌క్ కోసం వెయిటింగ్‌లో ఉన్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. తాజా స‌మాచారం మేర‌కు ఈ చిత్రంలో ఎన్టీఆర్ జోడీగా బాలీవుడ్ బ్యూటీ వ‌రీనా హుస్సేన్ న‌టించ‌నుంద‌ట‌. ల‌వ్‌యాత్రిలో న‌టించిన వ‌రీనా హుస్సేన్‌ను ఇందులో హీరోయిన్ న‌టించ‌నుంద‌ని, లుక్ టెస్ట్ అంతా పూర్త‌య్యింద‌ని కూడా టాక్ వినిపిస్తోంది.

'అరవిందసమేత' తర్వాత ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో రానున్న ఈ సినిమాకు ‘అయిన‌ను పోయి రావలె హస్తినకు’.. 'రాజా వచ్చినాడు’‌, ‘చౌడప్ప నాయుడు’ అనే టైటిల్స్ ప‌రిశీల‌న‌లో ఉన్న‌ట్లు వార్తలు వినిపించాయి. అలాగే ఈ సినిమాలో విల‌న్‌గా మంచు మ‌నోజ్‌ను న‌టింప చేస్తార‌ని వార్త‌లు విన‌ప‌డ్డాయి. హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్‌, ఎన్టీఆర్ట్స్ ప‌తాకాల‌పై ఈ సినిమా నిర్మితమవుతుంది.

More News

చిరంజీవి వ‌ర్సెస్ వెంక‌టేశ్‌

మెగాస్టార్ చిరంజీవి, విక్ట‌రీ వెంక‌టేశ్ మ‌ధ్య పోటీ న‌డుస్తుందా? అంటే అవున‌నే అంటున్నాయి సినీ వ‌ర్గాలు.

సినీ ఇండ‌స్ట్రీకి కేంద్ర ప్ర‌భుత్వం వ‌రం..

కోవిడ్ ప్ర‌భావంతో దాదాపు ఎనిమిది నెల‌లు పాటు సినీ ప‌రిశ్ర‌మ కోలుకోలేని దెబ్బతింది. ఇప్పుడిప్పుడే ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డుతున్నాయి.

ఏప్రిల్ 9న ‘వ‌కీల్ సాబ్‌’ రిలీజ్

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌కళ్యాణ్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం ‘వ‌కీల్ సాబ్‌’. ప్ర‌ముఖ నిర్మాత బోనీ క‌పూర్ స‌మ‌ర్ప‌ణ‌లో

'మ‌హాస‌ముద్రం' ఆగ‌స్ట్ 19న విడుద‌ల‌

శ‌ర్వానంద్‌, సిద్ధార్థ్ హీరోలుగా అజ‌య్ భూప‌తి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న 'మ‌హాస‌ముద్రం' ఆగ‌స్ట్ 19న విడుద‌ల కానున్న‌ది.

'ఖిలాడి' మే 28న విడుద‌ల‌‌

'క్రాక్' వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా, 'రాక్ష‌సుడు' వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్‌ని తెర‌కెక్కించిన ర‌మేష్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో