ట్విట్టర్‌ని వదిలేసిన బాలీవుడ్ దర్శకుడు .. కారణమేంటో తెలుసా?

  • IndiaGlitz, [Monday,August 12 2019]

సామాజిక సమస్యలపై సినిమాలు తీసే బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్.. ట్విట్టర్ మాధ్యమం నుండి బయటకు వచ్చేశారు. అందుకు కారణం.. ఆయన తల్లిదండ్రులు, కుమార్తెకు బయట వ్యక్తుల నుండి బెదిరింపు ఫోన్ కాల్స్ రావడమేనట. ప్రారంభం నుండి కేంద్ర ప్రభుత్వ వైఖరిని ట్విట్టర్ వేదికగా దయ్య బట్టిన అనురాగ్ కశ్యప్‌కు ఇది వరకే ఇలాంటి సమస్యలు ఎదురయ్యాయి. అయితే రీసెంట్‌గా కశ్మీర్ వ్యవహారంపై కూడా ఆయన తన వైఖరిని ప్రభుత్వానికి వ్యతిరేకంగానే స్పందించారు. దీనిపై ఆయనకు బలమైన బెదిరింపులే వచ్చినట్లు ఉన్నాయి.

ట్విట్టర్‌ చివరి ట్వీట్‌గా ''ప్రస్తుతం దుర్మార్గులు రాజ్యమేలుతున్నారు. బెదిరించే వ్యక్తులదే జీవన విధానంగా ఉంది. నా కుటుంబంలోని తల్లిదండ్రులు, నా కుమార్తెను కొందరు బెదిరించారు. ఇలాంటి సందర్భాల్లో నేను నా అభిప్రాయాన్ని ధైర్యంగా వ్యక్తం చేయలేను. అలాంటప్పుడు మౌనంగానే ఉండిపోతాను. సరికొత్త భారతదేశంలో ఉన్నవారు అభివృద్ధిలోకి వస్తారు. అందరికీ శుభాకాంక్షలు గుడ్ బై'' అన్నారు.

More News

కె.విశ్వనాథ్‌ని కలిసి సీఎం కె.సి.ఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కె.సి.ఆర్.. సీనియర్ దర్శకుడు కె.విశ్వనాథ్‌ను కలుస్తున్నారు` అనే వార్త బయటకు రాగానే కె.విశ్వనాథ్‌కి ఏమైంది?

వాళ్ళకు నా వంతు సాయం చేస్తా!- హీరో చిరంజీవి

“సంగీతమంటే నాకు ప్రాణం. సంగీతం లేనిదే నేను లేను. అప్పటి చక్రవర్తి, ఇళయరాజా నుంచి రాజ్ కోటి, ఇప్పటి మణిశర్మ దాకా ఎంతోమంది సంగీత దర్శకుల బాణీలు

`రాక్షసుడు` చిత్రాన్ని పెద్ద హిట్ చేసిన తెలుగు ప్రేక్షకులకు థ్యాంక్స్ - కోనేరు సత్యనారాయణ

బెల్లంకొండ సాయిశ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా రమేశ్ వర్మ దర్శకత్వంలో ఎ స్టూడియో బ్యానర్‌పై కొనేరు సత్యనారాయణ నిర్మించిన చిత్రం `రాక్షసుడు`.

'రణరంగం' సౌండ్ కట్ ట్రైలర్ ను విడుదలచేసిన - రామ్ చరణ్

యువ కథానాయకుడు శర్వానంద్, కాజల్, కళ్యాణి ప్రియదర్శి ని ల కాంబినేషన్ లో ప్రముఖ దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వంలో

కెజిఫ్ రికార్డు బ్రేక్ చేసిన కన్నడ సూపర్ స్టార్ దర్శన్ 'కురుక్షేత్రం 3D'

కన్నడ సూపర్ స్టార్ దర్శన్ దుర్యోధనుడు గా నటించిన కురుక్షేత్రం, తాజా గా విడుదలైన సంగతి తెలిసిందే,